ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ఉన్న 12 గ్రామాలు అనాథలుగా మారాయి. ఈ గ్రామాలు మాకు చెందాలంటే కాదు మాకు చెందాలంటూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు ఎక్కాయి. 15 ఏళ్ళుగా ఈ కోర్టుకేసు ఒక కొలిక్కి రాలేదు. కేసు కోర్టులో ఉండటంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ గ్రామాలు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ తాగునీటికి సైతం నోచుకోక అల్లాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. గత 15 ఏళ్ళుగా ఈ 12 గ్రామాలకు అటు మహారాష్ట్ర అధికారులు కానీ, ఇటు ఆంద్ర అధికారులు కానీ వెళ్ళటం లేదు. వారికి రేషన్ కార్డులు కానీ, ఇతర సదుపాయాలూ కానీ లభించటం లేదు. గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
ఈ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అమలు కాకపోవటంతో గ్రామస్థులు మైళ్ళ తరబడి కాలినడకన ఇతర ప్రాంతాలకు వచ్చి నీటిని తీసుకువెళ్ళాల్సి వస్తోంది. గ్రామంలో నీరు, రహదారులు లేకపోవటంతో మిగిలిన ప్రాంతంలో వీటికి సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లోని యువతీ, యువకులకు పెళ్ళిళ్ళు కావటం కూడా కష్టంగా మారింది. 15 ఏళ్ళుగా తమ గోడును ఎవరూ పట్టించుకోవటం లేదనీ, తమ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారిందని ఈ 12 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-maharashatra-border-24-13885.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!