జగన్ అందుకే రామోజీని కలిసారుట!

Publish Date:Sep 26, 2015

Advertisement

 

రెండు రోజుల క్రితం బద్ద శతృవులయిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి ఫిలిం సిటీలో సమావేశం కావడం గురించి వారి మీడియాలలో చిన్నముక్క వ్రాయకపోయినా మిగిలిన వారందరూ వారి సమావేశంపై రకరకాల ఊహాగానాలు వ్రాసుకుపోతున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే వారి సమావేశం గురించి వైకాపా నేతలకి ఏమీ తెలియక పోవడం. కనుక వారు కూడా దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. తెదేపా నేతలు దానిపై ఇంతవరకు స్పందించలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీని కలిసారని మొదట చెప్పిన వైకాపా తరువాత రామోజీ చాలా పెద్దాయన కనుక ఆయన సలహాలు తీసుకోవడానికి వెళ్లి కలిసారని మరో ముక్క జోడించింది. ఆ తరువాత మాట్లాడిన రోజా ప్రత్యేక హోదాపై ఏవిధంగా ముందుకు పోవాలి? అనే దానిపై ఆయన సలహా తీసుకోనేందుకే వెళ్లి కలిసారని మరో లైన్ జోడించారు.

 

కానీ ప్రత్యేక హోదా పోరాడేందుకు జగన్ తన శత్రువయిన రామోజీ సలహా తీసుకోవడం ఏమిటి...విచిత్రం కాకపోతే? ఎక్కడయినా యుద్దంలో విజయం సాధించేందుకు శత్రువులను సలహాలు అడుగుతారా? అని ఆలోచిస్తే ఆమె చెప్పిన మాటలు ఎంత అసంబద్దంగా ఉన్నాయో అర్ధం అవుతాయి. ఒకవేళ దాని కోసమే రామోజీని కలిసి ఉండి ఉంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండబోదు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఈనాడు మీడియా చాలా ఆచి తూచి వార్తలు ప్రచురిస్తోంది. ప్రత్యేక హోదాను వ్యతిరేకించినా ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. సమర్ధిస్తే బీజేపీకి, తెదేపా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినట్లువుతుంది. కనుక ఈ విషయంలో జగన్ తన శత్రువయిన రామోజీని సలహాకోరడం అవివేకమే అవుతుంది.

 

జగన్ తనపై కేసుల మాఫీ కోసం లేదా తమ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు మీడియాలో రాబోతున్న కొన్ని వార్తలను ఆపడానికో రామోజీరావు కాళ్ళు పట్టుకొని ఉండవచ్చని కొందరు ఊహించారు. కానీ జగమొండిగా పేరుబడిన జగన్ తన కేసుల మాఫీ కోసమో, తన పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఆపడానికో రామోజీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యే అవకాశమే లేదు. కేసుల విషయంలో అవసరమయితే నేరుగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాళ్ళే పట్టుకొనే వెసులుబాటు ఉంది ఆయనకి. ఇక ఈనాడు మీడియాలో వైకాపాకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పటి నుండో వార్తలు వ్రాస్తోంది కనుక ఈరోజు కొత్తగా వ్రాసేదేమీ లేదు. ఒకవేళ ఉన్నా జగన్ చేతిలో కూడా బలమయిన మీడియా ఉంది కనుక దానికి ఏవిధంగా కౌంటర్ ఇవ్వాలో ఆయనకి బాగానే తెలుసు.

 

ఎప్పుడూ దుందుడుకు నిర్ణయాలు తీసుకొనే అలవాటున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్లుంది. కనుక జగన్ చాలా వ్యూహాత్మకంగానే రామోజీని కలిసి ఉండవచ్చును. ఆ విషయం రామోజీకి తెలియదనుకోలేము. జగన్ మర్యాదపూర్వకంగా కలిసినా దాని వలన తెదేపాలో గుబులు మొదలవుతుంది. ఇంతకాలం తమకు అండగా నిలబడ్డ రామోజీపై అనుమానం మొదలవుతుంది. బహుశః తెదేపాకు, రామోజీరావుకు మధ్య ఉన్న దృడమయిన బంధం తెగ్గోట్టేందుకే జగన్ తన అహాన్ని పక్కనపెట్టి వెళ్లి రామోజీని కలిసి ఉండవచ్చును. కానీ రాజగురువుగా పేరొందిన రామోజీ ఆ మాత్రం గ్రహించలేరని అనుకోలేము. కనుక ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ సమావేశం గురించి ఈపాటికి వివరణ ఇచ్చుకొనే ఉండాలి. లేకుంటే జగన్ వ్యూహం పనిచేయడం మొదలవుతుందని వేరేగా చెప్పుకోనవసరం లేదు. .

By
en-us Political News

  
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.