మౌలాలి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు..!

Publish Date:Sep 14, 2026

Advertisement

 సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మరికాసేపట్లో చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మౌలాలి సమీపంలో ప్రయాణిస్తున్న సమయం లో ఒక్కసారిగా విద్యుత్ కరెంట్ తీగలు తెగి రైలు పైభాగంపై పడిపోయాయి. కరెంట్‌కు సంబంధించిన మెటీరియల్స్ రైలు పై పడటంతో భారీ ఎత్తున శబ్దం రావడంతో ప్రయాణి కులు ఒక్కసారిగా భయాం దోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పలు వురు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితిని గమ నించిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మౌలాలి సమీపంలోనే రైలును నిలిపివేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైలును నిలిపివేసిన అనంతరం ఇంజన్ డ్రైవర్ వెంటనే  సహాయ చర్యలు చేపట్టేందుకు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. కరెంట్ తీగలు తెగిపడటంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే రైళ్ల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తు న్నారు.కరెంట్ తీగలు ఎందుకు తెగిపడ్డాయి? రైల్వే విద్యుత్ వ్యవస్థలో ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే విషయా లపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. సహాయ చర్యలు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంది..

 

 

 

[ Intercity Express Train, Maulali Railway Station, Secunderabad Railway Station, SCR, South central railway ]


 

By
en-us Political News

  
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది.
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.