TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

పాక్ వైమానిక స్థావరాల్లో టర్కీ, చైనా విమానాలు.. అసలేం జరుగుతోంది?

పాకిస్థాన్ కు భారీగా ఆయుధాల సరఫరా అంశం ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ గగనతలంలో ప్రత్యక్షమవుతున్న విదేశీ సైనిక విమానాలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. 60 గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో టర్కీకి చెందిన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్‌కు వచ్చి వెళ్లడం సంచలనంగా మారింది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 మధ్య చోటుచేసుకున్న ఈ సైనిక రాకపోకలు, శత్రుదేశాల కదలికలపై నిశితంగా క అంతర్జాతీయ నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, అలాగే కరాచీలోని మస్రూర్ వైమానిక స్థావరాలలో టర్కీ సైనిక విమానాలు పదేపదే ల్యాండ్ అయ్యాయి. అంత తక్కువ సమయంలో, అంతటి భద్రతా ప్రాముఖ్యత ఉన్న వైమానిక స్థావరాలలో ఈ స్థాయిలో సైనిక విమానాల రాకపోకలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా, టియుఎఎఫ్ 526 అనే ప్రత్యేమైన కాల్‌సైన్‌తో రికార్డైన టర్కీకి చెందిన మరొక భారీ ఎ-400ఎమ్ సైనిక విమానం పాకిస్థాన్‌లోని మురిద్ స్థావరంలో కనిపించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. అసలు ఈ విమానాల్లో టర్కీ నుంచి పాకిస్థాన్‌కు తరలించినది ఏమిటి? అంటే.. వాటి ద్వారా పాకిస్థాన్ కు భారీగా ఆయుధాలు.. అత్యాధునిక డ్రోన్లు, వాటి నిర్వహణకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలు అన్న అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటితో పాటు, హెచ్‌క్యూ-సిరీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పాక్ స్థావరాలకు ఈ విమానాల ద్వారా చేరి ఉండోచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి. టర్కీ విమానాలు నూర్ ఖాన్, మస్రూర్ స్థావరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలోనే.. చైనాకు చెందిన సైనిక రవాణా విమానాల కదలికలు కూడా అక్కడ కనిపించడం మరింత ఆందోళనకరంగా మారింది. ఇది టర్కీ, పాకిస్థాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న త్రైపాక్షిక సైనిక , రక్షణ సంబంధాలకు నిదర్శనంగా చెబుతున్నారు. పాకిస్థాన్ గతంలోనే టర్కీ నుంచి బైరక్టార్ రక్షణ డ్రోన్లను కొనుగోలు చేసిన విషయంతెలిసిందే. ఇటీవల ఆగస్టు 7న పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య చారిత్రాత్మకమైన మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక భద్రతా ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ దేశంపై విదేశీ దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా స్పందిస్తాయి. ఈ కీలక భద్రతా ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో భారీ సైనిక విమానాల కదలికలు సాగడం గమనార్హం. ఈ సైనిక విమానాలలో ఏం తరలించారనే దానిపై టర్కీ గానీ, పాకిస్థాన్ ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో ఆయుధాల సరఫరా అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేవలం రాడార్ సమాచారం, విమానాల కదలికలు, అంతర్జాతీయ నిఘా వర్గాల ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటకు వచ్చాయి. Turkish military aircraft in Pakistan, C130 Hercules Rawalpindi, Turkey Pakistan drone supply, HQ air defense systems, Mecca joint defense agreemen

Published on: Mon Aug 24, 2026 10:48AM

political-news-img

అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలు బంద్.!

అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలను బంద్ చేసింది. ఈ రెండు దేశాల మధ్యా ఉన్న ఉచిత వాణిజ్య బంధానికి కెనడా చెల్లు చీటీ రాసేసింది. దశాబ్దాలుగా హిత మిత్రదేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అమెరికాతో సాగిస్తున్న కీలక వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. చర్చల చివరి దశలో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అసంబద్ధంగా, ఏకపక్షంగా, తమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. కెనడా ప్రయోజనాల పరిరక్షణ కోసం అమెరికాతో వాణిజ్య చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు ఆయనా ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నందున ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. అదలా ఉండగా, అమెరికా కూడా.. తీవ్రంగా స్పందించింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లు విధించేందుకు నిర్ణయించింది. ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే కెనడాకు అత్యంత మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు తాము ముందడుగు వేసినప్పటికీ.. కెనడానే చివరి నిమిషంలో కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చిందని అమెరికా ఆరోపించింది. గతంలో అంగీకరించిన కొన్ని కీలక హామీల నుంచి కూడా కెనడా వెనక్కి తగ్గిందని పేర్కొంది. Canada band trade talks with America, Mark Carney Canada PM, Donald Trump 50 percent tariffs, US Canada trade dispute, 880 billion trade war

Published on: Sat Aug 22, 2026 12:56PM

political-news-img

చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన.. ఎప్పుడంటే? ఎందుకంటే?

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో వేలాది మంది ప్రజల సమక్షంలో ట్రంప్ చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధాలు, టారిఫ్‌ల వివాదాలు, టెక్నాలజీ ఆంక్షలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మే 13 నుండి 15 వరకు డొనాల్డ్ ట్రంప్ చైనాలో 3 రోజులు పర్యటంచిన సంగతి తెలిసిందే. చైనాలోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్, టెంపుల్ ఆఫ్ హెవెన్ వంటి ప్రదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రంప్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఓ కొత్త అధ్యాయానికి ప్రారంభంగా అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఆ సందర్భంగా ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను అమెరికా పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకుని జన్ పింగ్ మరో రెండు వారాలలో అమెరికార పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలలో గ్లోబల్ ట్రేడ్ రీసెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమికండక్టర్ చిప్స్ ఎగుమతులు, గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం పైచర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. China President America Tour, Donald Trump, Xi Jinping, Trump Xi News, Global Economy, TeluguOne

Published on: Sat Aug 22, 2026 11:53AM