TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

కోకాపేట్‌లో రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి..!

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్నేహితులంతా సరదాగా లాంగ్ డ్రైవ్‌కు బయలు దేరగా.. కారు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోకాపేట్‌లో చోటుచేసుకుంది. హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులంతా కలిసి తమన్ వర్మ పుట్టినరోజు పార్టీకి వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు పూర్త య్యాక మియాపూర్ నుంచి కోకాపేట్ నియో పోలీస్ వద్దకు లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరారు. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఒకే ఇన్నోవా క్రిస్టా కారులో ప్రయాణిస్తు న్నారు. నియో పోలీస్ వద్ద వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఇంటర్ విద్యార్థులేనని, వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. [ Road accident in Kokapet, Friend birthday, Long drive, Neo Police, Hi-Tech City, Hyderabad police, Telangana police, CP Sajjanar, Telugu One, Telugu News ]

Published on: Sun Sep 13, 2026 5:50PM

political-news-img

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. రూ.12 లక్షల వ్యవహారంలో కీలక మలుపు..!

బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలపై మియాపూర్ పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో తాజాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేయడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మియాపూర్‌లోని ఓ భవనంలో ఆమె బొటిక్ నిర్వహిస్తుండగా, అదే భవనంలోని డ్యాన్స్ స్టూడియోకు రాజు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం తరచూ వచ్చేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారిందని బాధితురాలు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని రాజు నమ్మించాడని, ఆ నమ్మకంతోనే అతడితో సన్నిహితంగా మెలిగానని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రాజు డబ్బులు అడిగేవాడని, అతడి అవసరాల కోసం పలు విడతల్లో ఫోన్‌పే, నగదు రూపంలో సుమారు రూ.12 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెళ్లి విషయం ప్రస్తావించిన ప్రతిసారీ రాజు ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకునేవాడని, చివరకు పెళ్లికి నిరాకరించడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది..రాజు అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. రాజుతో తనకు ఏర్పడిన పరిచయం, పెళ్లి హామీ, డబ్బుల లావాదేవీలతో పాటు ఇతర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తనను మోసం చేసిన తర్వాత రాజు మరో సీరియల్ నటితో తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా రాజుపై కేసు పెట్టిన తర్వాత తనకు ఆ సీరియల్ నటి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని కూడా ఆమె ఆరోపించింది. రాజుపై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై సినీ రంగంలోని పెద్దలు స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది. ముఖ్యంగా సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తనకు అండగా నిలిచి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే అరెస్ట్, రిమాండ్ వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో రూ.12 లక్షల లావాదేవీలు, పెళ్లి పేరుతో చేసినట్లు చెబుతున్న హామీ, మరో నటి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. [ Dhee winner Raju Arest, Sumalatha, Shekhar Master, Johnny Master, Miyapur Police, Telugu Film Dancers Association, Telugu One, Telugu News]

Published on: Sun Sep 13, 2026 5:36PM

political-news-img

ముందు కార్పొరేటర్‌గా గెలువు.. బస్వరాజు సారయ్యకు కొండా సురేఖ సవాల్..!

మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..? తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాలలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ఊహాగానాలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో తన భర్త కొండా మురళితో కలిసి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని, భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆమె పునరుద్ఘాటించారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాట్లాడిన కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోల్పోయినందుకు తనకు వ్యక్తిగతంగా ఎటువంటి బాధ లేదని, అయితే తొలగింపునకు గల సరైన కారణాన్ని అధిష్ఠానం వివరించకపోవడమే తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో త్వరలోనే తన భర్త కొండా మురళికి సముచితమైన పదవి లభిస్తుందనే సంకేతాలు అధిష్ఠానం నుంచి అందినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో ఆమె స్థానిక రాజకీయ ప్రత్యర్థులపై పరోక్ష విమర్శలు గుప్పించారు. పార్టీలో ఉంటూ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ప్రధాన లక్ష్యమని కొండా సురేఖ ప్రకటించారు. భవిష్యత్తులో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొంది, మరింత బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైక్ చూసి చాలా రోజులైందని.. మైక్ కనిపించగానే ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని బసవరాజు సారయ్య అంటున్నారని కొండా సురేఖ అన్నారు. ముందు తన అనుచరులపై కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని సవాల్ చేశారు. ఇక నాయిని రాజేందర్ రెడ్డిపై కూడా కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వినయ్ భాస్కర్‌ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు తమను బతిమాలి తీసుకెళ్లేవారని ఆరోపించారు. భద్రకాళి ఆలయ పదవి విషయంలో గతంలో హంగామా చేసిన నాయిని రాజేందర్ రెడ్డి.. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి విషయంలోనూ ఇదే పరిస్థితి ఎందుకని కొండా సురేఖ నిలదీశారు. తనపై, తన అనుచరులపై విమర్శలు చేసే ముందు గతంలో వారి వ్యవహారాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Basavaraj Saraiah, Naini Rajender Reddy, Telugu One, Telugu News]

Published on: Sun Sep 13, 2026 5:15PM

political-news-img

నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక..!

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాగోబా ఆలయంతో మేస్రం వంశీయులకు ఉన్న అనుబంధం నేపథ్యంలో మేస్రం ఆనందరావు పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కల్వకుంట్ల కవితకు నాగోబా ఆలయంపై ప్రత్యేక భక్తి ఉంది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఆమె నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నాగోబా అమ్మవారి ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని కవిత విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్దగా ఉన్న ఆనందరావు చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్‌రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెలంగాణ రక్షణ సేన నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్ సభ అనంతరం ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపరిచేలా ఇంద్రవెల్లి సభను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు, గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలోకి ఆకర్షించేలా ఈ సభను వేదికగా మలచాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో జరగనున్న బహిరంగ సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. [ Nagoba temple pradhana pujari, Adilabad District, Keslapur, Mesram dynasty, Telangana Rakshana Sena, Indravelli Sabha, Kalvakuntla Kavitha ]

Published on: Sun Sep 13, 2026 4:51PM

political-news-img

సెల్‌ఫోన్‌ రిపేర్‌కు వెళ్తూ.. మృతి చెందిన యువతి..!

సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది. అమీర్‌పేట్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శనివారం చోటుచేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి. హేమదుర్గ (26) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచే స్తోంది. సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకునేందుకు కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న హేమదుర్గ.. రాపిడో బైక్‌పై అమీర్‌పేట్‌కు బయలుదేరింది. అయితే శ్రీనగర్‌ కాలనీలోని బిగ్‌ బజార్‌ వెనుక గేటు సమీపంలోకి చేరుకోగానే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హేమదుర్గ ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ షేక్‌ అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. [ Road accident at Ameerpet, Srinagar Colony, Big Bazaar, Crime news, Rapido Bike, Driver Sheikh Anwar, Hyderabad police, Telangana police, CP Sajjanar, Telugu One, Telugu News ]

Published on: Sun Sep 13, 2026 4:01PM

political-news-img

ఆర్య వైశ్యుల ఆత్మగౌరవం గొప్పది : సీఎం రేవంత్

ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదరికంలో ఉన్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడరన్నారు. కష్టాలు, బాధలు ఉన్నా.. సమాజంలో గౌరవంగా జీవించడానికే ఆర్యవైశ్యులు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. గ్రామాల్లో ఆర్యవైశ్యుల సేవలు..! గ్రామంలో ఎవరైనా పేదరికంలో ఉంటే.. కనీసం తినడానికి అప్పు ఇచ్చే వారు ఆర్యవైశ్యులేనని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా.. మొదట గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రధానంగా రెండు వృత్తులే ఉన్నాయని.. అవి వ్యవసాయం, వ్యాపారం అని సీఎం వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించేవారని గుర్తుచేశారు. రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం..! తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందంటే.. అందుకు ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య కీలక కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను శాసనమండలిలో దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి.. ఆవేశం తగ్గించుకుని, అనుభవంతో ముందుకు వెళ్తే రాజకీయాల్లో పైకి వస్తావని ఆశీర్వదించారని గుర్తుచేశారు. తనను ముందుగా గుర్తించింది రోశయ్యేనని చెప్పారు. రోశయ్య విమర్శలు చేయకుండా.. చురకలు వేస్తూ తనదైన శైలిలో మాట్లాడేవారని అన్నారు. ఆయన గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచస్థాయి నాయకుడు మహాత్మా గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ గాంధీ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణమన్నారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని.. దేశ సమగ్రత కోసం గాంధీ ప్రాణత్యాగం చేస్తే.. ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారని చెప్పారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలి..! ఆర్యవైశ్యులకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని సీఎం అన్నారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడాలని.. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. తాను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కలిసి ఉంటేనే బలం ఉంటుందని.. ఒక్కతాటిపై నడిస్తేనే అందరూ గౌరవిస్తారని అన్నారు. ఆర్యవైశ్యులకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చామని.. కొడంగల్‌లోని ఓ మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటా తీసుకోవాలని.. ఐక్యంగా ఉంటే అది సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులకు ముందు చూపు, జాగ్రత్త అనేవి వారి డీఎన్‌ఏలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. [ CM Revanth Reddy, Revanth Reddy Speech, Arya Vysya, Arya Vysya Meeting, Telangana CM, Telangana Politics, Arya Vysya Community, Atma Gauravam Bhavan, Rosయ్య, Mahatma Gandhi, Potti Sriramulu, Congress Party, Arya Vysya Corporation, Kodangal, Telangana Government ]

Published on: Sun Sep 13, 2026 1:59PM

political-news-img

ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం : హరీశ్‌రావు

పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో బస్సు ఛార్జీలను పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రయాణికులు పంపిన బస్‌ టికెట్లను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌–హన్మకొండ మధ్య నడిచే ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410గా ఉండగా.. సెప్టెంబర్‌ 11న ఏకంగా రూ.570కు పెంచారని హరీశ్‌రావు తెలిపారు. అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం మోపారని పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఛార్జీలను భారీగా పెంచడం వల్ల ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆయన విమర్శించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజలకు తెలియకుండా, అకస్మాత్తుగా ఛార్జీలను పెంచడం ద్వారా ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలపై దోపిడీ పాలన’ అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఉచితాలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మాటల్లో చెబుతూ.. మరోవైపు బస్సు ఛార్జీలను పెంచి సామాన్యులపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ‘మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మోత’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజలపై భారం మోపడం వెంటనే ఆపాలని, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై బస్సు ఛార్జీల పెంపు మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఛార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపై మోపుతున్న అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకో వాలని, పెంచిన ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. [ RTC fare hike, Ganesh festivals, Harish Rao, CM Revanth reddy, Minister ponnam Prabhakar, TGRTC, KCR, KTR]

Published on: Sat Sep 12, 2026 5:13PM

political-news-img

పూలమ్మితే, పాలమ్మితే వందల కోట్లు వస్తాయా..? : సీఎం రేవంత్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 7, 2023 నాటికి రాష్ట్రంలో బ్యాంకు అప్పులు ఏకంగా రూ. 8,11,000 కోట్లకు చేరడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా రూ. 5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మిగిల్చిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని కూడా గత పాలకులు రాజకీయ క్రీడగా మార్చడం అత్యంత బాధాకరం.ఫీజుల బకాయిలు.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్ వివరాలు పారదర్శకంగా లేకపోవడం వల్ల కొద్దిమంది కాలేజీల నిర్వాహకులు భారీగా గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి, కొన్ని కాలేజీలు చేసిన ఫ్రాడ్స్‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలను అడ్డుపెట్టుకుని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేశారని సీఎం మండిపడ్డారు. ఆనాడు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులకు అందాల్సిన ఫీజు బకాయిలను విస్మరించి, అధికారంలో ఉన్న నాయకుల విద్యాసంస్థలకే నిధులు మళ్లించుకున్న దుస్థితి నెలకొంది. సిబిఐటి, వాసవి, మాతృశ్రీ లాంటి పేరున్న ప్రతిష్టాత్మక కాలేజీలకు మొండిచెయ్యి చూపడం విద్యార్థులకు జరిగిన ఘోరమైన అన్యాయం.పేద విద్యార్థుల ఉసురు తగులుతుందిగతంలో ఫీజులు రాకపోయినా, అర్హులైన విద్యార్థులు మరియు యాజమాన్యాలు ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేకపోయాయి. ధర్నాలు లేవు, ఆందోళనలు లేవు.. కారణం ఏంటి? గత ప్రభుత్వ అధినేత కక్షసాధింపు చర్యలకు భయపడి అంతా మౌనంగా క్షోభ అనుభవించారు. నేడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల మేలు కోసమే గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడమే కాకుండా, పారదర్శకత కోసం 'ఫేషియల్ రికగ్నిషన్' విధానాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి కళాశాలకు వెళ్లాల్సిందేనని, నిజాయితీగా నడుచుకునే జెన్యూన్ కాలేజీలన్నింటికీ ఎలాంటి జాప్యం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. కానీ, ప్రజల సొమ్మును దోచుకునే నకిలీ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని హెచ్చరించారు.ప్రైవేట్ యూనివర్సిటీల్లో వేల కోట్ల సర్ప్లస్! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీలను తనిఖీ చేయగా వెలుగు చూసిన నిజాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. కేవలం ఒక యూనివర్సిటీ ఖాతాలను పరిశీలిస్తే, ఏకంగా రూ. 400 కోట్ల సర్ప్లస్ క్యాష్ ఉండటం విస్తుగొలుపుతోంది. ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మా? లేక పేద విద్యార్థుల నుంచి వసూలు చేసిన డొనేషన్ల సొమ్మా? అంటూ సీఎం ప్రశ్నించారు. "పూలమ్మితే, పాలమ్మితే వందల, వేల కోట్లు వస్తాయా?" అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కొల్లగొట్టిన వారి ఆటలు ఇక చెల్లవని, ప్రతి రూపాయికి లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల కన్నీళ్లను తుడిచే నిజమైన సంక్షేమ పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. [ CM Revanth Reddy On Reimbursement, Assembly Speech, KCR Government Debts, Student Fee Dues TS, Vigilance Report Telangana, MLA Mallareddy, CMR, Mallareddy Universities, Telugu One, Telugu News]

Published on: Sat Sep 12, 2026 4:47PM

political-news-img

క్యాబ్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి..!

బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..! బేగంపేటలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో విధులకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. సాధారణంగా విధులు ముగించుకుని ఉదయం 6 గంటలలోపు ఇంటికి చేరుకునే రాజశేఖర్‌ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన భార్య లీల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి రాజశేఖర్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఆయన ప్రయాణించిన మార్గం, ఫోన్‌ వివరాలు, కారుకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. ఈ క్రమంలో రాజశేఖర్‌కు చెందిన కారు కోహీర్‌–బుదేరా సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన ఆచూకీ కోసం మరింత విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పటాన్‌చెరు రుద్రారం సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది అదృశ్యమైన రాజశేఖర్‌దేనని గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోనే ఆయనను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రుద్రారం సమీపంలో పడేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజశేఖర్‌ మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజశేఖర్‌ మృతదేహం రుద్రారం వద్ద లభించగా, ఆయన కారు మాత్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కోహీర్‌–బుదేరా సమీపంలో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారు అక్కడికి ఎలా చేరుకుంది? రాజశేఖర్‌ రుద్రారం వరకు ఎలా వచ్చారు? ఆయన వెంట ఎవరైనా ఉన్నారా? ఘటనకు ముందు ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించారు. రాజశేఖర్‌ మహీంద్రా సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి క్యాబ్‌ నడుపుతున్నారు. ఆయనకు నాలుగు కార్లు ఉన్నాయి. భార్య లీలా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజశేఖర్‌ అదృశ్యమైనప్పటి నుంచి మృతదేహం లభ్యమయ్యే వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణం ఏమిటి? నిందితులు ఎవరు? అనే విషయాలను తేల్చేందుకు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. [ Cab driver dies under suspicious circumstances, Rajasekhar, Wife Leela, Cyberabad Police, Mahindra Software Company, CP Sajjanar, DGP C.V. Anand,Telugu One, Telugu News ]

Published on: Sat Sep 12, 2026 4:26PM

political-news-img

గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..!

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల సమన్వ యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వ హించాలని అధికారులను ఆదేశించారు. మా ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పున రుద్ధరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు, గణేశ్ ఉత్సవాల నిర్వాహకుల సమస్యలను తెలుసుకునేందుకే స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు. గణేశ్ మండ పాలకు ప్రముఖులు, అతిథులను ఆహ్వానించే సందర్భంలో వారి వివరా లను స్థానిక కమిషనరేట్‌ కు అందించాలని సీఎం సూచించారు. ఊహించని పరిణామాలు చోటుచేసు కున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.ఎక్కడెక్కడ గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులను కోరారు. మండపాల వివరాలు ముందుగానే అందు బాటులో ఉంటే ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు పోలీసులకు మరింత సులభంగా ఉంటాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగానే గణేశ్ నిమజ్జనాలకు అనుగు ణంగా కూడా ముందుగానే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. చెరువుల అభివృద్ధి పనులు చేపట్టే సమయంలోనే గణేశ్ నిమజ్జనాలకు అవసర మైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించా లని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారు లను నియమించాలని తెలిపారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచిం చారు.హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిం చాలని సూచించారు. గణేశ్ ఉత్సవాల సంద ర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కూడా పోలీస్, ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు [ CM Revanth Reddys key review on Ganesh festivals, Telangana Goverment, Hyderabad Command Control Center, CP Sajjanar, DGP C.V. Anand,Telugu One, Telugu News ]

Published on: Sat Sep 12, 2026 4:05PM