TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

చికెన్‌ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్‌ పోలీసుల కొరడా.!

హైదరాబాద్‌లో చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా, విక్రయాలపై సైబరాబాద్‌ పోలీసులు, వెటర్నరీ అధికారులు కొరడా ఝుళి పించారు. నగరంలోని చికెన్‌ షాపులు, ప్రాసెసింగ్‌ కేంద్రాల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రివేళల్లో లారీల్లో తరలిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్న మాఫియాపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు వంద టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు. పగటిపూట నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చికెన్‌ వ్యర్థాలను సేకరిస్తున్న మాఫియా.. వాటిని గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళల్లో లారీల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఏపీలోని చేపల చెరువుల యజమానులకు ఈ వ్యర్థాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణాపై గతంలోనూ కేసులు నమోద య్యాయని, అయినప్పటికీ మాఫియా కార్యకలాపాలు ఆగలేదని అధికారులు చెబుతున్నారు. గత నెలలోనే హెచ్‌-ఫాస్ట్‌ అధికారులు సుమారు 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోసారి అదే తరహాలో వ్యర్థాలను తరలిస్తుండటంతో అధికారులు దాడులు నిర్వహించి వంద టన్నుల వ్యర్ధాలను స్వాధీనం చేసుకున్నారు.చికెన్‌ వ్యర్థాలను చేపలకు మేతగా వినియోగించ డం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చికెన్‌ వ్యర్థాల సేకరణ, అక్రమ రవాణా, విక్రయాల వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్‌పై పోలీసులు దృష్టి సారించారు. వ్యర్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. Police seize 100 tons Vhicken waste, Cybarabad Police, Raids, Vehicles, Transport chicken Waste, Ap

Published on: Mon Aug 24, 2026 12:57PM

political-news-img

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో మరో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్.. ఓ వ్యాపారవేత్తను బెదిరించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారవేత్తపై ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో సుమంత్ పరారయ్యారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు తెల్లాపూర్‌ లోని సుమంత్ ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా కే ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మార్టూరుకు వెళ్లి అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన సుమంత్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. Three more arrested, Konda Surekha former osd case, TaskForce, Attempt tp murder, Sumanth

Published on: Mon Aug 24, 2026 12:46PM

political-news-img

పోటెన్సీ టెస్ట్‌పై హైకోర్టుకు ఉదయ్ కృష్ణారెడ్డి.!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. పోటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల మధ్య ఉదయ్ కృష్ణారెడ్డికి పోటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అయితే కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించనుంది. Uday Krishnareddy petition in High court, Potency, test, Trainee, IPS

Published on: Mon Aug 24, 2026 12:12PM

political-news-img

ఆటోల బంద్ లేదు.!

తెలంగాణవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావాల్సిన ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మెను చివరి నిముషంలో విరమించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాతిక లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఆదివారం(ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం (ఆగస్టు 24)ఉదయం నుంచి నగర రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని, విపరీతమైన రద్దీతో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగరవాసులు ఆందోళన చెందారు. అయితే ఈ సంక్షోభ పరిస్థితులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ ప్రతినిధులు, ఆటో సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం, 2012 తర్వాత ఇప్పటివరకు మార్పులేని ఆటో మీటర్ చార్జీలను సవరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, అలాగే, ప్రైవేట్ రైడ్, హెయిరింగ్ యాప్స్ ఓలా, ఉబెర్, ర్యాపిడోల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఐటీ శాఖ ద్వారా ప్రభుత్వం స్వయంగా ఒక ప్రభుత్వ రైడ్-హెయిరింగ్ యాప్‌ను అభివృద్ధి చేస్తుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారనీ, దీంతో సమ్మె విరమించామని యూనియన్ నాయకులు ప్రకటించారు. అంతేకాకుండా, నగరంలో పెట్రోల్, డీజిల్ ఆటోలను పర్యావరణహిత విద్యుత్ (ఈవీ) వాహనాలుగా మార్చుకోవడానికి ఒక్కో ఆటోకు లక్షన్నర రూపాయల మేర ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, ప్రమాద బీమా 5 లక్షల రూపాయల పునరుద్ధరణ డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించినట్లు నాయకులు ప్రకటించారు. Auto bandh called off, Telangana auto drivers strike, Ponnam Prabhakar auto union talks, Hyderabad auto fare revision, Telangana govt auto ride app, Hyderabad city transport news

Published on: Mon Aug 24, 2026 11:14AM

political-news-img

ఖర్గేతో కొండా భేటీ.. ఏం జరిగిందంటే?

తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయతీ పార్టీ అదిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో బెంగళూరులో ఆదివారం (ఆగస్టు 23) భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రావడానికి ఒక్కరోజు ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొందరు లక్ష్యంగా చేసుకుని, మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని సురేఖకు హితవు చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలోని అంశమని, వాటిపై ఏకపక్ష ప్రకటనలుచేడయం తగదని ఖర్గే కొండ సురేఖకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల టికెట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేఖ, ఆమె కుమార్తెపై కఠిన చర్యలు తీసుకోవాలని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె నేరుగా ఖర్గేతో భేటీ అయ్యారని అంటున్నారు. Konda Surekha meet Kharge, Bengalore, AICC President, Telangana, Congress, Panchayat

Published on: Mon Aug 24, 2026 10:17AM

political-news-img

తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు.!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో (ఆగస్టు 24, 25) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సోమవారం (ఆగస్టు 24) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయా జిల్లాల యంత్రాంగం ప్రజలకు సూచించింది. అలాగే.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల సమీపంలో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. Heavy rains in telangana, Twodays, Yellow Alert, IMD

Published on: Mon Aug 24, 2026 10:02AM

political-news-img

పార్టీ మార్గదర్శకాలు దాటితే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చరిక..!

గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది. పార్టీ నిబంధనలను అతిక్రమించి ఎవరు వ్యవహరించినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ దాటితే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకత్వం కోరింది. అంతర్గతంగా ఏవైనా విబేధాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి పార్టీ పరిధిలోనే అనేక కమిటీలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అవసరమైతే ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా సమస్యలను తీసుకెళ్లవచ్చని, కానీ మీడియా లేదా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం సమర్థనీయం కాదని పార్టీ స్పష్టం చేసింది. క్రమశిక్షణా పరిధి దాటే ధోరణిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పింది. ఇటీవల చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి హైకమాండ్ దృష్టికి అంశం వెళ్లిందని వివరించారు. ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ సమగ్ర పరిశీలన జరిపిన అనంతరమే ఈ విషయమై తుది నిర్ణయం మరియు తగిన చర్యలు ఉంటాయని అధ్యక్షులు తెలియజేశారు. ఇతర ప్రతిపక్ష పార్టీల మాదిరిగా కాంగ్రెస్ నియంతృత్వ వైఖరితో నడవదని, తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, మాట్లాడే స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అయితే ఆ స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చర్యలు అనివార్యమని గుర్తుచేశారు. మరోవైపు, కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి అనవసర నష్టం జరుగుతోందని కేబినెట్ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీయే అత్యున్నతమైనదని, పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉందని, ఇలాంటి అంతర్గత వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వేళ నాయకుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, అధిష్ఠానం తీసుకున్న ఈ కఠిన వైఖరితో పార్టీలో క్రమశిక్షణ మళ్లీ పట్టాలెక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. Mahesh Kumar Goud, TPCC President, Konda Surekha, Congress Discipline Committee, Telangana Politics, Congress party, Minister Vakiti Srihari, KC Venugopal, AICC

Published on: Sun Aug 23, 2026 6:39PM

political-news-img

కేంద్రం వైఖరిపై సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి.. హైదరాబాద్‌కు రాగానే మాట్లాడతా..!

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) clearance నిరాకరించడంతో ఆయన బోస్టన్ షెడ్యూల్ రద్దయింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక పూర్తిగా రాజకీయ కోణమే దాగి ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేంద్రంలోని అధికార యంత్రాంగం కావాలనే ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అమెరికా పర్యటన రద్దయినప్పటికీ, తన లండన్ పర్యటన అత్యంత విజయవంతంగా పూర్తయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బ్రిటన్‌లో పలు కీలక భేటీలు ప్రయోజనకరంగా సాగాయని చెప్పారు. మరో కొన్ని గంటల్లో తాను హైదరాబాద్ చేరుకోబోతున్నానని పేర్కొన్నారు. నగరానికి చేరుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి, పర్యటన అనుమతుల నిరాకరణ వెనుక ఉన్న కారణాలపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని సీఎం స్పష్టం చేశారు. ఈ వివాదంపై సమగ్రమైన వివరాలను త్వరలోనే మీడియా ముందుకు తెస్తానని సంకేతాలిచ్చారు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, తెలంగాణ ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయమని కొనియాడారు. కాగా, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల విషయంలో కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ వంటి రాష్ట్రాల నేతలకు సత్వరమే అనుమతులు ఇస్తూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలకు ఆంక్షలు విధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరిన్ని రాజకీయ సెగలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చాక చేయబోయే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ సీఎం అమెరికా పర్యటనకు అనుమతించి.. తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ధి, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరింది. తెలంగాణ అభివృద్ధికి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని IOC పేర్కొంది. కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. Revanth Reddy US Visit, Revanth Reddy Centre Permission, Telangana CM, Ministry of External Affairs Revanth Reddy, Revanth Reddy London Tour,Telangana Investments, Central Government MEA, Telangana CM US Visit

Published on: Sun Aug 23, 2026 5:15PM

political-news-img

మొగల్‌కానా వద్ద ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం..!

గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందో ళనకు గురయ్యారు. గోదాంలో పెద్ద మొత్తంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాయి. ఫర్నిచర్ గోదాం చుట్టుపక్కల పలు ఇతర గోదాంలు కూడా ఉండటంతో మంటలు వాటివైపు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్‌ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం గోదాంలో జరిగిన ఆస్తి నష్టం, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. Massive fire breaks out in furniture warehouse at Mogalkana, Gudimalkapur, Furniture warehouse, Fire accident

Published on: Sun Aug 23, 2026 3:38PM

political-news-img

మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు..!

మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాకింగ్‌ స్టార్‌ యష్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెం ట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో యష్‌ను చూడ్డానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్‌ కొనసాగుతుండగా భారీ ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఒక్క సారిగా కూలిపోవడంతో అక్కడున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళ నకు గురైన అభిమానులు, విద్యార్థులు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మల్లారెడ్డి కాలేజీతో పాటు ‘టాక్సిక్‌’ చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేశారు. భారీగా అభిమానులు, విద్యా ర్థులు హాజరయ్యే కార్యక్రమానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, ఈవెంట్‌ నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎలా కూలింది? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిర్వాహకుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. Case registered against Mallareddy College, Toxic film unit, Maisammaguda, Hero Yash

Published on: Sun Aug 23, 2026 3:22PM