TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

నో మైనింగ్ జోన్‌గా పంచదార్ల కొండ.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

కొండల్లో క్వారీ లీజులు రద్దు చేసిన ప్రభుత్వం.. హర్షం వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు..! ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక ధామమైన అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండల పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు పంచదార్ల కొండల ప్రాంతాన్ని అధికారికంగా ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించింది. ఈ నిర్ణయంతో సదరు కొండల పరిసర ప్రాంతాలలో ఎలాంటి తవ్వకాలు, క్వారీయింగ్ పనులకు తావులేకుండా పూర్తి స్థాయిలో నిషేధం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండల్లో కొన్నేళ్లుగా సాగుతున్న క్వారీ తవ్వకాల వల్ల అక్కడి సహజసిద్ధ జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంతో పాటు సహజంగా ప్రవహించే పుణ్యతీర్థ జలధారలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వినతులపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించింది. అధికారుల పరిశీలనలో మైనింగ్ కార్యకలాపాల వల్ల చారిత్రక నిర్మాణాలకు, పర్యావరణ సమతుల్యతకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోందని స్పష్టమైంది. దీంతో తక్షణ చర్యల్లో భాగంగా గతంలో కేటాయించిన దాదాపు 2.153 హెక్టార్ల క్వారీ లీజు అనుమతులను ప్రభుత్వం రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రాచీన సంపదను, ప్రకృతి సమతుల్యతను కాపాడటమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల స్థానిక భక్తులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ భద్రతకు, పంచదార్ల కొండల సహజ సౌందర్యానికి ఊరట లభించిందని వారు కొనియాడారు. ముందుముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలలో అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఈ నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని భావిస్తున్నారు. Anakapalli Panchadarla Hills, AP Government No Mining Zone, Sri Uma Dharmalingeswara Swamy Temple, Anakapalli Mining Prohibition, AP Environment News,Telugug News, Telugu One

Published on: Thu Aug 27, 2026 6:45PM

political-news-img

నేపాల్‌కు వెళ్లిన డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు సేఫ్..!

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కైలాస్ మానస సరోవరం యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మానస సరోవరం యాత్రలో భాగంగా వెళ్లిన 35 మంది ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. MS రామారావు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొత్తం 35 మంది మానస సరోవరం యాత్రకు వెళ్లారు. వీరిలో సుమారు 25 మంది హైదరాబాద్‌కు చెందినవారు కాగా.. చెన్నై, గుంటూరు, ఆస్ట్రేలియా, లండన్ తదితర ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌ నుంచి ఖాట్మాండుకు చేరుకుని.. అక్కడి నుంచి కైలాస్ యాత్రకు బయలుదేరారు. కైలాస్ పరిక్రమలో భాగంగా రెండో రోజు యాత్ర కొనసాగుతుండగా వరదల ఘటన చోటుచేసుకుంది. అయితే యాత్రికులు ఆ సమయంలో కైలాస్ పర్వత ప్రాంతంలో ఉండటంతో భారీ వరదల ప్రభావం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటన అనంతరం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వారిని బేస్ క్యాంప్‌కు తరలించారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇవాళ లేదా రేపు కైలాస్ పర్వతం కిందికి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు కూడా కైలాస్ యాత్రలో ఉన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాన్ని సతీష్‌రెడ్డి బృందం నిన్న ఉదయం దాటి వెళ్లింది. వారు ఆ ప్రాంతం దాటిన కొన్ని గంటలకే భారీ వరదలు సంభవించినట్లు సమాచారం. ప్రస్తుతం సతీష్‌రెడ్డి దంపతులు సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సుహాసిని ఆచూకీపై కుటుంబ సభ్యుల ఆందోళన..! మరోవైపు.. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని రెడ్డి ఆచూకీపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుహాసిని.. ఇంట్లో పూజ కార్యక్రమం ఉండటంతో భారత్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కైలాస్ ట్రావెల్స్ ద్వారా ఆదివారం నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. ఆమె స్నేహితురాలు కూడా ఆస్ట్రేలియా నుంచి ఖాట్మాండుకు వచ్చారు. అక్కడ ఇద్దరూ మరో 29 మందితో కలిసి యాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి సుహాసిని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని.. తాము ఫోన్ చేసినా ఆమెను సంప్రదించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకు అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని సుహాసిని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామే పోలీసులకు మిస్సింగ్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. IMEI నంబర్ ఆధారంగా సుహాసిని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి సమాచారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. “నా కూతురు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఆమె ఆచూకీ చెప్పండి” అంటూ సుహాసిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్ సంస్థను సంప్రదించినప్పటికీ తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని వారు చెబుతున్నారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న ఇతర యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో.. సుహాసిని కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. Nepal Floods, Nepal Heavy Rains, Kailash Mansarovar Yatra, Kailash Yatra, Satish Reddy, DRDO Former Chairman Satish Reddy, Hyderabad Pilgrims, Nepal Floods Telugu, Sushasini Reddy Missing, Suhasini Reddy, Telugu News, Telugu One

Published on: Thu Aug 27, 2026 4:05PM

political-news-img

మంగళగిరిలో మోడరన్ రైతు బజార్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..!

మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. స్థానిక రైతులు, వ్యాపారులు, సాధారణ వినియోగదారుల సంక్షేమమే ధ్యేయంగా మంగళగిరి పట్టణంలో రూ.18.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక 'మోడరన్ రైతు బజార్' నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును మంగళగిరి పరిధిలోని నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో సుమారు 5.90 ఎకరాల విస్తాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఈ సమగ్ర మార్కెట్ నిర్మాణానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందిస్తుండటం విశేషం. పటిష్టమైన ప్రణాళికతో రూపుదిద్దుకుంటున్న ఈ నమూనా మంగళగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మొత్తం 71,925 చదరపు అడుగుల వివిద విస్తీర్ణంలో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇందులో రిటైల్ మరియు హోల్ సేల్ విభాగాలను వేర్వేరుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాపారులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశాలమైన ప్రాంగణంలో ప్రతి చిన్న సదుపాయాన్ని పొందుపరిచారు. వివరాల్లోకి వెళితే, రిటైల్ విభాగంలో సాధారణ కూరగాయల అమ్మకాల కోసం 102 ప్రత్యేక స్టాళ్లతో పాటు పండ్లు, తాజా పూల విక్రయదారుల కోసం మరొక 54 స్టాళ్లను కేటాయించారు. అలాగే హోల్ సేల్ వ్యాపార కార్యకలాపాల కోసం 23 దుకాణాలను, సరుకులను సులువుగా దిగుమతి చేసుకునేందుకు వీలుగా 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు. కేవలం విక్రయ ప్రాంగణంగానే కాకుండా, సరుకులు పాడవకుండా భద్రపరుచుకోవడానికి అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని, కూరగాయలను శుభ్రపరిచే వాషింగ్ ప్లాంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు విచ్చేసే వినియోగదారులు, రైతుల కోసం క్యాంటీన్ మరియు విశాలమైన వాహన పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి, మార్కెట్ నమూనా మ్యాప్‌ను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఈ స్థాయి హైటెక్ మార్కెట్ రావడం పట్ల స్థానిక ప్రజలు మరియు రైతు వర్గాలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనలో మంగళగిరిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఇటువంటి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రూపుదిద్దుకోనున్నాయి. Nara Lokesh, Mangalagiri Modern Rythu Bazar, AP News, Mangalagiri Development, Aurobindo Pharma Foundation, TeluguOne News

Published on: Thu Aug 27, 2026 3:48PM

political-news-img

ఏపీ మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఐటీ అధికారులు..!

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కుంభకోణంలో అక్రమంగా సమీకరించిన సొమ్ము మూలాలు, నిధుల మళ్లింపు వ్యవహారంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా మనీ ట్రయల్‌పై ఆరా తీస్తున్న అధికారులు.. ఈ వ్యవహారంలో సిట్‌, ఈడీ దర్యాప్తు అధికారులతో కీలక వివరాలను సేకరిస్తున్నారు.హైదరాబాద్‌లో సిట్‌, ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావే శమై.. ఇప్పటివరకు జరి గిన దర్యాప్తు, నిధుల లావాదేవీలకు సంబం ధించిన సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా భారీ మొత్తంలో నగదు మళ్లించి నట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలపై ఐటీ అధికా రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కుంభకోణానికి సంబంధించిన నిధులు ఏఏ కంపెనీల ద్వారా మళ్లించారనే అంశంతో పాటు.. ఆ సొమ్ము చివరకు ఎక్కడికి చేరింది? ఎవరెవరి బ్యాంకు ఖాతా ల్లోకి వెళ్లింది? విదేశాలకు ఎంత మొత్తం తరలిం చారు? అనే కోణాల్లో ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యం గా దుబాయ్‌ సహా పలు దేశాలకు నిధులు తరలించినట్లు దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో.. విదేశీ లావాదేవీలపై కూడా ఐటీ శాఖ దృష్టి సారిం చింది. నిధులను విదేశాల కు, బినామీ సంస్థలకు ఎలా మళ్లించారు? ఏ మార్గాలను ఉపయోగిం చారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన వివరాలతో పాటు.. వారి ఆధీనంలో ఉన్నట్లు అనుమానిస్తున్న డొల్ల కంపెనీలు, వాటి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధిం చిన సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కుంభకోణంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను కూడా సిట్‌, ఈడీ నుంచి తీసు కుంటున్నారు. ఇదిలా ఉండగా.. నిందితులకు చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన వివరాలను ఈడీ అధికారులు ఐటీ శాఖకు అందించినట్లు తెలుస్తోంది. ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, నగదు లావాదేవీలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. సిట్‌, ఈడీ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తులు, విదేశీ నిధుల మళ్లింపు వంటి అంశాల్లో తదుపరి చర్యలకు ఐటీ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం...మొత్తం గా ఏపీ మద్యం కుంభకోణం లో అక్రమంగా సమీకరిం చిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి మళ్లింది? ఎవరెవరి ద్వారా లావాదేవీలు జరిగాయి? అన్న అంశాలపై ఐటీ దర్యాప్తు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. AP liquor scam case, SIT, ED, IT officers, Income Tax Department, Shell Companies, Money Laundering, CM Chandrababu, Naralokesh, TDP

Published on: Thu Aug 27, 2026 3:32PM

political-news-img

వివాహేతర సంబంధం.. జిమ్ ట్రైనర్ దారుణ హత్య..!

స్నేహితుడి ప్రియురాలితో ఎఫైర్.. హతమార్చిన ఫ్రెండ్..! కాకినాడలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ జిమ్ ట్రైనర్ హత్యకు గురయ్యాడు. స్నేహితుడి ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కొడమాటి సతీష్‌రెడ్డి (30) బుధవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. సతీష్‌రెడ్డికి ఏడాది క్రితమే వివాహం కాగా.. ఆయన భార్య జయశ్రీ ప్రస్తుతం గర్భిణిగా ఉంది. సతీష్‌రెడ్డి తన స్నేహితుడైన సాయికిరణ్ ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో సాయికిరణ్, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సాయికిరణ్‌కు జయశ్రీ కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో సతీష్‌రెడ్డి, సాయికిరణ్ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో సాయికిరణ్ తన స్నేహితులతో కలిసి సతీష్‌రెడ్డితో మరోసారి గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవలో సతీష్‌రెడ్డి తలపై చెక్క ముక్కతో బలంగా కొట్టారు. చెక్క ముక్క విరిగిపోవడంతో.. దాని పదునైన భాగంతో సతీష్‌రెడ్డి మెడపై పొడిచినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సతీష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సాయికిరణ్‌తో పాటు పరారీలో ఉన్న అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Kakinada, Gym Trainer Murder, Satish Reddy Murder, Extramarital Affair, Sai Kiran, Ramakrishna Rao Peta, Kakinada Crime, Murder Case, Andhra Pradesh Crime, Crime News, Friendship Dispute, Police Investigation, Telugu news, Telugu one

Published on: Thu Aug 27, 2026 2:05PM

political-news-img

జబర్దస్త్‌ నటి బర్త్‌డే వేడుకల్లో టీడీపీ, TNSF నేతల మధ్య ఘర్షణ..!

రేవ్‌ పార్టీలో క‌త్తులతో దాడి చేసుకున్న నేతలు..! జబర్దస్త్‌ ఫేమ్‌ నటి అను పుట్టినరోజు వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో నిర్వహించిన పార్టీలో టీడీపీ, TNSF నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. జబర్దస్త్‌ ఫేమ్‌ నటి అను తన పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో నిర్వహించింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుకలకు సుమారు 70 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో పార్టీలో ఉన్న కొందరి మధ్య వివాదం మొదలై క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే టీడీపీ నేత మమ్ముల వెంకట్‌ దినేష్‌పై యర్రా చరణ్‌తేజ్ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కత్తి దాడిలో వెంకట్‌ దినేష్‌ ఎడమ భుజం వెనుక భాగంలో తీవ్ర గాయ మైనట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రిసార్టుకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ స్వరూపంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రేవ్‌ పార్టీగా పేర్కొంటున్న ఈ వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరిగిందా? లేదా అనే కోణంలోనూ విచారణ సాగుతున్నది. పార్టీకి హాజరైన వారి వివరాలు, రిసార్టులో జరిగిన పరిణామాలు, ఘర్షణకు అసలు కారణం తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. Jabardasth fame actress Anus birthday celebrations, Rave Party, TNSF, Mammula Venkat Dhinesa, Yarra Charan Tej, CM Chandrababu, Naralokesh, Telugu news, Telugu one

Published on: Thu Aug 27, 2026 1:54PM

political-news-img

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం..!

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..! క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం..! పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచే సుకుంది. ఈరోజు గురువారం తెల్లవారు జామున చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు మితిమీరిన వేగంతో వచ్చి ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రు లను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంతా మంగమ్మ, బొంతా బాబు రావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, ఎస్‌.లక్ష్మమ్మ వీరంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వేలూరు గ్రామానికి చెందిన వీరంతా పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజులూ రుకు వెళ్లారు. వేడుకలు ముగించుకుని ఆటోలో తిరిగి వేలూరుకు వస్తుండగా అడ్డరోడ్డు సెంటర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అత్యంత వేగంగా వెళ్లి ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని వైద్య అధికారులకు సీఎం సూచించారు Chilakaluripeta Road Accident, Palnadu District News, CM Chandrababu, Naralokesh, Guntur General Hospital, Veluru Village Tragedy, Andhra Pradesh Bus Accident, Telugu news, Telugu one

Published on: Thu Aug 27, 2026 11:20AM

political-news-img

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల గిరులకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వరుస సెలవులు, అనుకూల వాతావరణం నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి తిరుమలలో అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని సాధారణ భక్తులకు ఉచిత సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోందని దేవస్థాన అధికారులు వెల్లడించారు. ముందస్తు టోకెన్లు లేని భక్తుల క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి బయట ఉన్న శిలాతోరణం ప్రాంతం వరకు నిడివిగా విస్తరించాయి. కొండపై ఏ వైపు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తుండటంతో అడుగడుగునా గోవింద నామస్మరణ మారుమోగుతోంది. క్యూలైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా తాగునీరు, వేడి పాలు, పౌష్టికాహార అన్నప్రసాదాలను క్యూలైన్లలోనే పంపిణీ చేస్తున్నారు. సమాచారం ప్రకారం, నిన్న ఒక్క రోజే ఏకంగా 77,568 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి నివాళులు అర్పించారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.19 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల విక్రయాలు కూడా ముమ్మరంగా సాగాయి; ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.15 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. రద్దీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోంది. భక్తుల భద్రత, సునాయాస దర్శనం కోసం ఆలయ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో విధులను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా తిరుమలలో ఇదే స్థాయిలో భక్తుల రాక కొనసాగే అవకాశం కనిపిస్తోంది. టోకెన్లు లేని భక్తులు ఓపికతో వేచి ఉండి, దేవస్థాన సిబ్బంది సూచనలను పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Tirumala Devotee Rush, Tirumala Sarva Darshan Time, TTD Temple News Telugu, Tirupati Temple Latest Updates, Tirumala Srivari Hundi Income

Published on: Thu Aug 27, 2026 11:05AM

political-news-img

ఏపీ నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఈ నెలాఖరులోనే నేతన్నల ఖాతాల్లోకి రూ.25 వేలు..! ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి వి. సవిత స్పష్టం చేశారు. 'నేతన్న సేవ' పథకం కింద నూతనంగా అర్హత సాధించిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ నెలాఖరు నాటికి రూ. 25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. పెనుకొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే మొదటి దఫాలో 71,536 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 166 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని నేరుగా అందించి ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల కొత్తగా మరో 36,617 మంది చేనేత కార్మికులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన శరవేగంగా జరుగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ ఈ ఆర్థిక నెలాఖరుకల్లా నగదు నేరుగా జమ అవుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తర్వాతి స్థానంలో అత్యధిక కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్న చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపిస్తూ, తమ పాలనలోనే చేనేత రంగానికి మళ్లీ మహర్దశ వచ్చిందని అన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల శ్రమను గు గుర్తించి 50 ఏళ్ల వయస్సుకే రూ. 4,000 చొప్పున నెలవారీ పెన్షన్ అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 86,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. వయోపరిమితి తగ్గించడం వల్ల వృద్ధాప్యంలో నేతన్నలకు గొప్ప ఆర్థిక భరోసా దక్కిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా విద్యుత్ వినియోగంలోనూ చేనేత కుటుంబాలకు ప్రభుత్వం బారీ మినహాయింపులు ఇస్తోంది. మగ్గం నడిపే నేతన్నలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 52,952 మంది చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే హామీ ఇచ్చిన ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తోందని చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ వరుస సాయాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. AP Weavers Scheme, Minister Savitha, Nethanna Seva Scheme, AP Handloom Welfare, CM Chandrababu, Weavers Pension, Free Power For Handlooms

Published on: Wed Aug 26, 2026 10:09PM

political-news-img

నా ఓటు తొలగించారు.. ఏపీ సీపీఐ కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

దేశంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే వర్గాలను లక్ష్యంగా చేసుకుని భారీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రొద్దుటూరులోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నా ఓటే తొలగించారు..! తాను గతంలో 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేశానని.. అలాంటి తన ఓటునే తొలగించారంటే ఎన్నికల వ్యవస్థ ఏ స్థాయిలో దుర్వినియోగమవుతోందో అర్థం చేసుకోవచ్చని ఈశ్వరయ్య అన్నారు. ఓట్ల తొలగింపుపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం రద్దు చేసే కుట్ర..! ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఈశ్వరయ్య ఘాటుగా స్పందించారు. కూటమి అధినేత చంద్రబాబు నాయుడికి తెలియకుండానే వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తెరవెనుక ఉండి పెద్దలతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితిపై విమర్శలు..! దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, భారత రూపాయి విలువ పాకిస్థాన్ కంటే దారుణంగా పడిపోతుంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని ఈశ్వరయ్య విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు పుట్టిన తర్వాతే దేశంలో ప్రజలు శ్రీరాముడిని పూజిస్తున్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో శ్రీరామచంద్రుడి పేరిట సేకరించిన బంగారు ఇటుకలు ఏమయ్యాయో కేంద్ర పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. CPI State Secretary G V Eswaraiah, Gujjula Eswaraiah, CPI Andhra Pradesh, Kadapa News SIR Voter Deletion, Voter List Revision, Voter Deletion, Narendra Modi, CM Chandrababu

Published on: Wed Aug 26, 2026 9:44PM