దొంగగా మారిన శర్వానంద్
on Dec 14, 2013
"మిర్చి" చిత్రం తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "రన్ రాజా రన్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం శర్వా కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ చిత్రంలో శర్వా దొంగ పాత్రలో నటిస్తున్నాడు. అదే విధంగా ప్రస్తుతం శర్వా "ఏమిటో ఈ మాయ" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.