సూపర్స్టార్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. మన హీరో ఒకప్పుడు విలన్ అని మీకు తెలుసా?
సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్స్టార్ కృష్ణ. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసి రికార్డులను తిరగరాశారు. అయితే, ఎప్పుడూ హీరోగానే కనిపిస్తూ అభిమానుల మనసు గెలుచుకున్న కృష్ణ, తన కెరీర్ తొలినాళ్లలో విలన్గా కూడా నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ నెగటివ్ షేడ్ మూవీ ఆయన కెరీర్ను ఎలా మలుపు తిప్పిందనే ఆసక్తికరమైన కథనం ఇప్పుడు వైరల్గా మారింది. కృష్ణ హీరోగా పరిచయమైన ‘తేనె మనసులు’ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాతో యూత్ ఐకాన్గా మారిన కృష్ణకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ సమయంలోనే ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే 1967లో విడుదలైన ‘ప్రైవేట్ మాస్టర్’. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే, దీనికి దర్శకత్వం వహించింది సామాన్య దర్శకుడు కాదు, మన ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ గారు. సాధారణంగా ఒక హీరో విలన్గా కనిపిస్తే ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. ముఖ్యంగా కెరీర్ ఎదుగుతున్న దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పెద్ద సాహసమే. ‘ప్రైవేట్ మాస్టర్’ సినిమాలో రామ్మోహన్ హీరోగా నటించగా, కృష్ణ నెగటివ్ రోల్లో మెప్పించారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన పాత్రలో క్రూరత్వం కంటే మ్యానరిజమ్స్ ఎక్కువగా ఉండటం విశేషం. అయితే, అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. నిజానికి ‘ప్రైవేట్ మాస్టర్’ ఫ్లాప్ అవ్వడం కృష్ణ కెరీర్కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే, అప్పట్లో ఉన్న ట్రెండ్ ప్రకారం కృష్ణకు విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చేవి. దీంతో మనం ఒక గొప్ప హీరోను మిస్ అయ్యేవాళ్లం. ఆ సినిమా ఫలితం తర్వాత కృష్ణ తన రూట్ మార్చి, ‘గూఢచారి 116’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ జేమ్స్ బాండ్గా ఎదిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాత ముచ్చట విన్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మా సూపర్ స్టార్ ఏ రోల్ చేసినా అందులో తనదైన స్టైల్ చూపిస్తారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో కృష్ణ చేసిన ఆ ప్రయోగం ఆయనలోని నటుడికి నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో ఆయన పడ్డ కష్టం, తీసుకున్న రిస్క్ నేటి తరం నటులకు ఒక పాఠం లాంటిది. సూపర్స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన ఇలాంటి అరుదైన చిత్రాలు మరియు ఆయన సినీ ప్రస్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా అదే తరహాలో ప్రయోగాత్మక చిత్రాలతో తండ్రి పేరును నిలబెడుతున్నారు.
Apr 25, 2026
ఆస్కార్ గడప తాకిన తెలుగు నిర్మాత.. క్లాసిక్ సినిమాల రారాజు.. ఏడిద నాగేశ్వరరావు!
తెలుగు సినిమాను కళాత్మక విలువలతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాతలలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) అగ్రగణ్యులు. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన, క్లాసిక్ సినిమాల నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు (ఏప్రిల్ 24) ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని అద్భుత ఘట్టాలను ఓసారి గుర్తుచేసుకుందాం. 1934 ఏప్రిల్ 24న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించిన ఏడిద నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ ఉండేది. ఆ ఆసక్తే ఆయన్ని మద్రాసు రైలెక్కించింది. మొదట నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత 'గీతాకృష్ణా కంబైన్స్' బ్యానర్పై 1976లో 'సిరిసిరి మువ్వ' నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే 'పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్' సంస్థను స్థాపించి అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్తో ఏడిద నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. వీరి కలయికలో వచ్చిన 'శంకరాభరణం' ఒక చరిత్ర. కేవలం సంగీతం, కళాత్మక విలువలతో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత వచ్చిన 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' చిత్రాలు భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్స్గా నిలిచాయి. ముఖ్యంగా 'స్వాతిముత్యం' చిత్రం ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లడం విశేషం. చిరంజీవి మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో, ఆయనలోని అసలైన నటుడిని ప్రపంచానికి చూపిన ఘనత ఏడిద నాగేశ్వరరావుదే. 'స్వయంకృషి' సినిమాలో చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఈ సినిమాకు గాను చిరంజీవి మొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం వీరి కలయికలో వచ్చిన 'ఆపద్బాంధవుడు' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ప్రతి సినిమా ఒక పాఠం. కమర్షియల్ హంగులకు లోబడకుండా, కథాబలంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని ఆయన నిరూపించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నిర్మించిన అజరామరమైన చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. - ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జయంతి
Apr 24, 2026ఘంటసాల పాట కోసం పోటీ పడిన కృష్ణ, శోభన్బాబు!
పాతతరం హీరోల్లో ఎన్టీఆర్, ఎఎన్నార్ ఒకే సమయంలో స్టార్ హీరోలుగా కొనసాగారు. అయినా ఇద్దరూ కలిసి నటించేందుకు ఏ సందర్భంలోనూ ఇబ్బంది పడలేదు. ఇద్దరూ అన్నదమ్ములుగా మసలుకొనేవారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్బాబు కూడా వారిలాగే తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలా వారిద్దరూ కలిసి చేసిన ఓ మంచి సినిమా ‘మంచి మిత్రులు’. కృష్ణ కెరీర్ ప్రారంభంలో నిర్మాత మల్లిఖార్జునరావు ఎంతో ప్రోత్సహించారు. కృష్ణతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాయే ‘మంచి మిత్రులు’. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఇద్దరు మిత్రుల కథ ఇది. అభిప్రాయ భేదాల వల్ల ఒక సందర్భంలో ఇద్దరూ విడిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఒకరు దొంగగా, ఒకరు పోలీస్ ఆఫీసర్గా మారతారు. ఇద్దరూ కలుసుకోవాల్సిన రోజు వస్తుంది. ఆ సమయంలో వచ్చే పాట ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’. ఈ పాటను ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యంలతో పాడించాలనుకున్నారు కోదండపాణి. అయితే ఎవరికి ఎవరు పాడాలి అనే విషయంలో పెద్ద చర్చ జరిగింది. కృష్ణకు ఘంటసాల, శోభన్బాబుకి బాలసుబ్రహ్మణ్యంతో పాడిస్తే బాగుంటుందని దర్శకుడు, సంగీత దర్శకుడు అనుకున్నారు. అప్పటికి బాలసుబ్రహ్మణ్యం కొత్త సింగర్. ఘంటసాల పాడితేనే తనకు బాగుంటుందని కృష్ణ, శోభన్బాబు ఇద్దరూ అనుకున్నారు. చివరికి దర్శకనిర్మాతలు, సంగీత దర్శకుడు అనుకున్నట్టుగానే కృష్ణకు ఘంటసాల, శోభన్బాబుకి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ విషయంలో శోభన్బాబు కాస్త నిరాశ చెందారు. తన వెర్షన్కి ఘంటసాలతోనే పాడించుకోవాలని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ, కుదరలేదు. ఎట్టకేలకు పాట రికార్డ్ అయింది. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. సినిమాలో అదే హైలైట్గా నిలిచింది. ఆరోజుల్లో రేడియోలో ఈ పాట మారుమోగిపోయింది. ఆ పాట వింటుంటే ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. పాట విషయంలో కృష్ణ, శోభన్బాబు పోటీ పడినప్పటికీ అది వారి స్నేహానికి ఎలాంటి ఆటంకాన్ని కలిగించలేదు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.
Apr 22, 2026మహానటి సావిత్రి.. ‘దేవదాసు’, ‘మిస్సమ్మ’ వంటి క్లాసిక్స్ చేయడానికి రీజన్ భానుమతి.. ఎలాగంటే..?
ఎన్నో అద్భుతమైన సినిమాలు, క్లాసిక్స్ను నిర్మించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. ఈ బేనర్లో నిర్మించిన తొలి సినిమా ‘షావుకారు’ విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన పాతాళభైరవి, అప్ప్పుచేసి పప్ప్పుకూడు వంటి సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. విజయ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఎందుకంటే ఆ బేనర్లో విభిన్నమైన కథలతో, ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించే సినిమాలు వస్తాయని ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ తాము చేసే ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డి. వీరి బేనర్లో వచ్చిన ఆరో సినిమా ‘మిస్సమ్మ’. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. అప్పటికి ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్కి పాతాళభైరవి పెద్ద హిట్ సినిమా. ‘మిస్సమ్మ’ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తే.. ఎఎన్నార్ డిటెక్టివ్ రాజు అనే కామెడీ క్యారెక్టర్ చేశారు. ఆ సమయంలో అలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఎఎన్నార్ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ను తమిళ్లో జెమినీ గణేశన్ పోషించారు. ఎఎన్నార్ చేసిన పాత్రలో తంగవేలు నటించారు. ఈ సినిమాలో మొదట ఫిక్స్ అయిన హీరోయిన్ భానుమతి. సినిమాలోని మేరీ క్యారెక్టర్ ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్కి భానుమతి అయితే పూర్తి న్యాయం చెయ్యగలదని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఈ క్యారెక్టర్ని భానుమతితో కాకుండా సావిత్రితో చేయించడం వెనుక పెద్ద కథ ఉంది. ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ చేసేందుకు మొదట భానుమతి కాస్త సందేహించినా కథపై ఉన్న నమ్మకం వల్ల ఒప్ప్పుకున్నారు. ఎన్టీఆర్, భానుమతి, రేలంగి, రమణారెడ్డిలపై వచ్చే సీన్స్ని ముందుగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో మేరీ చెల్లెలు సీతగా మొదట సావిత్రి నటించారు. షూటింగ్ సజావుగా సాగుతోంది. సినిమా బాగా వస్తోందని దర్శకనిర్మాతలు సంతప్తిగా ఉన్నారు. అప్పటికి నాలుగు రీళ్ళు షూటింగ్ జరిగింది. ఒకరోజు ఉదయం ఏడున్నరకి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. నటీనటులతోపాటు యూనిట్ సభ్యులు కూడా లొకేషన్కి వచ్చేసారు. భానుమతి మాత్రం రాలేదు. చాలా సేపు ఎదురుచూసిన తర్వాత నిర్మాత చక్రపాణి ఒక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తున్న సావిత్రిని పిలిచి మేరీ కాస్ట్యూమ్ వేసుకొని రమ్మన్నారు. సావిత్రికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. చక్రపాణి చెప్పినట్టుగానే కాస్ట్యూమ్ వేసుకొని వచ్చారు. అలా సావిత్రి హీరోయిన్గా ‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలు పెట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భానుమతి సెట్కి వచ్చారు. ‘నేను మధ్యాహ్నం వస్తానని చెప్పాను కదా.. నాకోసం ఎందుకు ఎదురుచూశారు. మా ఇంట్లో వరలక్క్ష్మీ వ్రతం ఉంది. నేను మధ్యాహ్నం నుంచి వస్తానని మేనేజర్కి చెప్పాను. మా అసిస్టెంట్తో లెటర్ కూడా పంపించాను’ అన్నారు. అయితే భానుమతికి తెలియనిది ఏమిటంటే.. మిస్ కమ్యూనికేషన్ వల్ల తను లేట్గా వస్తానన్న విషయం చక్రపాణికి చేరలేదు. అయితే అవేవీ పట్టించుకోని చక్రపాణి ‘నువ్వు ఇంట్లో హాయిగా వ్రతాలు చేసుకో.. సినిమా ఎందుకు’ అని ఎగతాళిగా అన్నారు. దాంతో భానుమతి బాగా హర్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. ఆ తర్వాత సీత పాత్ర కోసం జమునను తీసుకున్నారు. అప్పటివరకు షూటింగ్ చేసిన నాలుగు రీళ్లను తగలబెట్టేశారు చక్రపాణి. అప్పటికే ‘దేవదాసు’ వంటి అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన సావిత్రిని మరింత దగ్గర చేసిన సినిమా ‘మిస్సమ్మ’. నిజానికి ‘దేవదాసు’లో కూడా మొదట అనుకున్న హీరోయిన్ భానుమతే. కొన్ని కారణాల వల్ల సావిత్రిని ఎంపిక చేశారు. అలా సావిత్రి కెరీర్లో రెండు క్లాసిక్స్ చేసేందుకు భానుమతి కారణమయ్యారు.
Apr 22, 2026మీకు తెలుసా.. చరిత్ర సృష్టించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రానికి స్ఫూర్తి రాఘవేంద్రరావు సినిమా!
1973లో ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన దాసరి నారాయణరావు 2014 వరకు 150కి పైగా సినిమాలు చేశారు. విభిన్నమైన కథాంశాలతో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్ప్పుకోవాల్సిన సినిమా ‘ప్రేమాభిషేకం’. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రన్ పరంగా అప్పటికి, ఎప్పటికీ క్రాస్ చెయ్యలేని రికార్డును ఈ సినిమా సాధించింది. ఇదిలా ఉంటే.. 1976లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతి’ చిత్రం ఆధారంగానే దాసరి ‘ప్రేమాభిషేకం’ చిత్ర కథను అల్లారనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే అందులో నిజానిజాలు ఎంత, ఆ సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొని ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని రూపొందించారా, ఆ సినిమాకి, ఈ సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది తెలుసుకుందాం. 1976లో నవలా రచయిత్రి సి.ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ నవలను సినిమాగా తెరకెక్కించాలని నిర్మాత క్రాంతికుమార్ భావించారు. ‘జ్యోతి’ పేరుతో ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ సినిమాలో రవిగా మురళీమోహన్, జ్యోతిగా జయసుధ, రాజయ్యగా గుమ్మడి, విశాలగా కృష్ణకుమారి ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. బావామరదళ్లయిన రవి, జ్యోతి ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రవికి విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్ రావడంతో అతను అమెరికా వెళ్లిపోతాడు. అతను వెళ్లిన తర్వాత జ్యోతికి జబ్బు చేస్తుంది. హాస్పిటల్లో చేరిన జ్యోతికి అక్కడే చికిత్స తీసుకుంటున్న విశాల పరిచయమవుతుంది. ఇద్దరూ అకాచెల్లెళ్లులా కలిసిపోతారు. తన గురించి పూర్తిగా చెబుతుంది విశాల. త్వరలోనే చనిపోబోతున్న ఆమె.. తన చివరి కోరిక తీర్చమని జ్యోతిని అడుగుతుంది. దానికి జ్యోతి ఒప్ప్పుకుంటుంది. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన జ్యోతి.. తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసుకుంటుంది. తను కూడా ఎక్కువ కాలం బ్రతకదు. తను చనిపోతే రవి భరించలేడు. అందుకే అతను విదేశాల నుంచి వచ్చేలోపు విశాల కోరిక ప్రకారం తన కంటే వయసులో ఎంతో పెద్దవాడైన విశాల భర్త రాజయ్యను పెళ్లి చేసుకుంటుంది జ్యోతి. అతనికి శశి అనే కూతురు కూడా ఉంటుంది. విషయం తెలుసుకున్న రవి.. జ్యోతిని నానా మాటలు అంటాడు. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని నిందిస్తాడు. ఆమెను అసహ్యించుకుంటాడు. అయితే ఆ తర్వాత జ్యోతి ఎక్కువ కాలం బ్రతకదు అనే విషయం రవికి తెలుస్తుంది. రవి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడమే తన చివరి కోరిక అని చెబుతుంది జ్యోతి. అలా రవికి, రాజయ్య కుమార్తె శశికి పెళ్లి జరుగుతుంది. ఆ మరుక్షణమే జ్యోతి కన్నుమూస్తుంది. ఇదీ ‘జ్యోతి’ చిత్ర కథ. ఇక ‘ప్రేమాభిషేకం’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాజేష్గా అక్కినేని నాగేశ్వరరావు, దేవిగా శ్రీదేవి నటించారు. తొలి చూపులోనే దేవిని ప్రేమిస్తాడు రాజేష్. ఆమె వెంట పడి ప్రేమించమని వేధిస్తుంటాడు. ఆ క్రమంలో రాజేష్ను ఎన్నోసార్లు అవమానిస్తుంది దేవి. రాజేష్ది నిజమైన ప్రేమ అని తెలుసుకున్న దేవి అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. పెళ్లికి మంచి ముహూర్తం పెడతారు. శుభలేఖలు కూడా అందరికీ పంచిపెడతారు. సిగరెట్లు విపరీతంగా తాగే రాజేష్కి ఆరోగ్య సమస్య వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే కొన్ని టెస్టులు చేస్తారు. అతనికి క్యాన్సర్ అని తేలుతుంది. ఈ విషయం రాజేష్ కంటే ముందు దేవి అన్నయ్యకు తెలుస్తుంది. దీంతో పెళ్లి వాయిదా వేయిస్తాడు. ఆ తర్వాత తనకు క్యాన్సర్ అనే విషయం తెలుసుకుంటాడు రాజేష్. ఇక అప్పటి నుంచి దేవిని దూరం పెట్టడం మొదలుపెడతాడు. పెళ్లి చేసుకొని ఆమెకు అన్యాయం చెయ్యకూడదనుకుంటాడు. దేవి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే తనకు ఎన్నో దుర్వసనాలు ఉన్నాయని ఆమెను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. దాని కోసం స్నేహితులతోపాటు తన తండ్రి సహాయం కూడా తీసుకుంటాడు. తను జయంతి అనే వేశ్య ఇంట్లో ఉన్నాడనే సమాచారం రాజేష్ తండ్రి దేవికి చెబుతాడు. జయంతితో కలిసి ఆడిపాడడాన్ని కళ్లారా చూసిన దేవి తట్టుకోలేకపోతుంది. ఒకరోజు జయంతి ఇంటి వెళ్లి రాజేష్ని నిలదీస్తుంది. అయితే జయంతి ముందే దేవిని అవమానించి పంపిస్తాడు రాజేష్. దాంతో అతనంటే దేవికి అసహ్యం ఏర్పడుతుంది. ఆ కోపంతోనే తన అన్నయ్య స్నేహితుడైన ప్రసాద్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత రాజేష్కి క్యాన్సర్ అనీ, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటుంది దేవి. అతన్ని చూసేందుకు తన భర్త, కుటుంబసభ్యులతో బయల్దేరుతుంది. అలాగే రాజేష్ కుటుంబ సభ్యులు కూడా జయంతి ఇంటికి చేరుకుంటారు. ప్రసాద్, దేవిలను పెళ్లి దుస్తుల్లో చూసి ఎంతో సంతోషిస్తాడు రాజేష్. ఆ ఆనందంతోనే కన్నుమూస్తాడు. ఇదీ ‘ప్రేమాభిషేకం’ కథ. జ్యోతి, ప్రేమాభిషేకం చిత్రాలకు సంబంధించిన మూల కథ ఒకటే అనిపిస్తుంది. అయితే కథనాల్లో, బ్యాక్డ్రాప్లో ఎంతో తేడా ఉన్నప్పటికీ క్యాన్సర్ అనే అంశం రెండు సినిమాల్లోనూ ఒకేలా ఉంటుంది. జ్యోతి చిత్రంలో తనకు క్యాన్సర్ అని తెలిసి, ఎక్కువ రోజులు బ్రతకదని తెలిసి హీరో తనని అసహ్యించుకునేలా చేస్తుంది. ప్రేమాభిషేకం చిత్రంలో తనకు క్యాన్సర్ అని తెలుసుకున్న హీరో తన ప్రేమను త్యాగం చేసి హీరోయిన్ తనను అసహ్యించుకొని వేరే పెళ్లి చేసుకునేలా చేస్తాడు. చివరికి జ్యోతి చిత్రంలో హీరోయిన్, ప్రేమాభిషేకం చిత్రంలో హీరో కన్నుమూయడంతో సినిమా ముగుస్తుంది. నిజానికి ఈ రెండు కథలూ ఒకటే. కానీ, రెండు సినిమాల్లోని పాత్రల తీరు తెన్నులు వేరుగా ఉండడం, కథనంలో ఎంతో వ్యత్యాసం ఉండడంతో ప్రేక్షకులు దాన్ని గుర్తించే అవకాశం లేకుండాపోయింది. అయితే ఎలా చూసినా జ్యోతి కంటే ప్రేమాభిషేకం పెద్ద విజయం సాధించిన సినిమాగా చెప్ప్పుకోవాలి.
Apr 18, 2026ఎస్.వి.ఆర్ని అవమానించిన గుమ్మడి.. అప్పుడా మహానటుడు ఏం చేశారో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రలో ఎస్వీ రంగారావు అంటే ఒక శిఖరం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ఒక పాఠం. అయితే ఆయన వ్యక్తిత్వం, క్రమశిక్షణ విషయంలో అప్పట్లో కొన్ని చర్చలు నడిచేవి. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఆయన మద్యం సేవించి వస్తారనే విమర్శలు ఉండేవి. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సూపర్ స్టార్ కృష్ణ 'పండంటి కాపురం' సినిమా కోసం ఎస్వీఆర్ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఉత్కంఠభరిత సంఘటన గురించి తెలుసుకుందాం. 'పండంటి కాపురం' సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎస్వీఆర్ అయితేనే బాగుంటుందని కృష్ణ భావించారు. అయితే ఆయన వల్ల షూటింగ్కు ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది చెప్పినా, కృష్ణ మాత్రం "ఆ పాత్రను ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు" అని ఖచ్చితంగా చెప్పేశారు. ఒకరోజు శివాజీ గార్డెన్స్లో షూటింగ్ జరుగుతుండగా, ఎస్వీఆర్ మద్యం మత్తులో రాలేని స్థితిలో ఉన్నారని తెలిసింది. కృష్ణ చెప్పడం వల్ల ప్రభాకర్ రెడ్డి, మాధవరావు కలిసి ఎస్వీఆర్ను తీసుకు రావడానికి వెళ్లారు. కానీ ఆయన మాత్రం "నేను రాలేనురా.. నన్ను వదిలేయండి" అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తోటి నటుడు గుమ్మడి, కృష్ణతో మాట్లాడుతూ.. "ఎందుకు ఈయనతో ఈ ఇబ్బందులు? ఈయన్ని పక్కన పెట్టి వేరే ఎవరినైనా చూసుకోవచ్చు కదా" అని సలహా ఇచ్చారు. కానీ కృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ మాటలు విన్న ఎస్వీఆర్ మేకప్ మేన్, వెంటనే వెళ్లి ఆయనకి విషయం చెప్పారు. తన గురించి యూనిట్లో ఇలా అనుకుంటున్నారని తెలిసి ఎస్వీఆర్ రోషం ఉడికిపోయింది. మరుసటి రోజు నేరుగా కృష్ణకి ఫోన్ చేసి, అప్పటివరకు తీసిన రష్ (ఫుటేజ్) చూస్తానని చెప్పారు. సినిమా చూసి బయటకు వచ్చాక కృష్ణతో ఒకే ఒక మాట అన్నారు.. "ఇప్పటివరకు తాగిన రంగారావుని చూశారు.. ఇప్పుడు తాగకుండా చేసే రంగారావు విశ్వరూపం చూస్తారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు నన్ను తలుచుకుంటూ వెళ్లకపోతే అడగండి" అని సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే ఎస్వీ రంగారావు ఆ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా జమునతో ఉన్న సీన్స్, సెంటిమెంట్ పండించడంలో ఆయన చూపిన ప్రతిభ అమోఘం. తాగి ఉన్నా లేకపోయినా, కెమెరా ముందుకు వస్తే ఆయన పరకాయ ప్రవేశం చేస్తారని తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్తుంటారు. తనపై కృష్ణ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ పండంటి కాపురం చిత్రంలోని ఆ పాత్రకు జీవం పోసారు ఎస్వీఆర్. నటన పరంగా ఆయన కెరీర్లో ఈ సినిమా ఒక మైలు రాయి అని చెప్పొచ్చు.
Apr 14, 2026‘దేవదాసు’ను తలపించే కథతో ఎన్టీఆర్ చేసిన సినిమా గురించి మీకు తెలుసా?
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో ఓ మైల్ స్టోన్లాంటి సినిమా ‘దేవదాసు’. ఈ చిత్ర నిర్మాణం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. 1953లో విడుదలైన ఈ చిత్రాన్ని వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ నిర్మించారు. ఇదే కాంబినేషన్లో మూడు సంవత్సరాల తర్వాత 1956లో ఆ సినిమాను పోలిన మరో సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.రామారావు హీరోగా నటించారు. ఆ సినిమా పేరు ‘చిరంజీవులు’. ఈ సినిమా దేవదాసు తరహాలోనే ఉందని చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కథాగమనం కూడా దేవదాసులాగే సాగుతుంది. 1940 దశకంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించిన డి.ఎల్. నారాయణ అతి తొందరలోనే ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. అతని సిన్సియారిటీ నచ్చి భానుమతి, నాగయ్య వంటి వారు తమ సంస్థల్లో ప్రొడక్షన్ మేనేజర్గా తీసుకునేవారు. అలా కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత తనే సొంతంగా సినిమా నిర్మించాలనుకున్నారు డి.ఎల్. అయితే సినిమాను నిర్మించేంత బడ్జెట్ తన దగ్గర లేకపోవడంతో డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్, రచయిత సముద్రాలను వర్కింగ్ పార్టనర్స్గా చేర్చుకొని చిత్ర నిర్మాణం ప్రారంభించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన స్త్రీ సాహసం, శాంతి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత దేవదాసు చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ముగ్గురు పార్టనర్స్ నిర్మాణం నుంచి తప్ప్పుకున్నారు. అయితే సినిమాకి టెక్నీషియన్స్గా పనిచేశారు. నిర్మాత డి.ఎల్. నమ్మకాన్ని నిలబెడుతూ ‘దేవదాసు’ పెద్ద విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో గొప్పగా చెప్ప్పుకునే సినిమా అయింది. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు డి.ఎల్. ఆ క్రమంలోనే ‘చిరంజీవులు’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కథను మొదట ఎఎన్నార్కు చెప్పారు. చిన్న పిల్లల నుంచి కథ మొదలై హీరో, హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, అనుకోకుండా పెళ్లి ఆగిపోవడం, హీరో కళ్లు కోల్పోవడం, ఆ తర్వాత హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, కొన్ని పరిణామాల తర్వాత చివరికి కలుసుకున్న హీరో, హీరోయిన్ ఒకేసారి చనిపోవడం.. ఇదీ కథ. ఈ కథ దేవదాసు కథలాగే ఉందన్న కారణంతో సినిమా చేసేందుకు ఎఎన్నార్ ఒప్ప్పుకోలేదు. అప్ప్పుడు ఈ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు డి.ఎల్. కథ విన్న ఎన్టీఆర్ తనకు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఓకే చెప్పారు. ఈ కథను దేవదాసు చిత్రాన్ని రూపొందించిన వేదాంతం రాఘవయ్య తెరకెక్కించడం విశేషం. ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా కమర్షియల్గా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమాలోని కొన్ని పాటలు మాత్రం జనాదరణ పొందాయి. అదే క్రమంలో తన దగ్గరకు డి.ఎల్. తీసుకొచ్చిన రెండు కథలను ఎఎన్నార్ రిజెక్ట్ చేశారు. ఆ కథలను వేరే హీరోలతో నిర్మించారు డి.ఎల్. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావు తను చేసే సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఈ మూడు సినిమాలు ప్రూవ్ చేశాయి.
Apr 09, 2026ఆ రెండు సినిమాల రికార్డు కోదండరామిరెడ్డికే సొంతం!
పాతరోజుల్లో హీరోలు సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. ఈ విషయంలో కృష్ణకు ఒక రికార్డు ఉంది. 1972 సంవత్సరంలో ఆయన నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సంవత్సరం ఒకే నెలలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఒకేరోజు రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అలా ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ, ఒక డైరెక్టర్ చేసిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం అనేది అంతకుముందు, ఆ తర్వాత కూడా జరగలేదు. ఆ రికార్డు దర్శకుడు కోదండరామిరెడ్డి పేరు మీదే చెక్కు చెదరకుండా ఉంది. చిరంజీవి హీరోగా, సుహాసిని, రాధ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం, కమల్హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ చిత్రం 1986 అక్టోబర్ 2న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఇవే టైటిల్స్తో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా రూపొందడం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒక దర్శకుడు రూపొందించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం అనేది ఎప్ప్పుడూ జరగలేదు. అయితే ఈ రెండు సినిమాలూ సూపర్హిట్ అయ్యాయి. ఆ తర్వాత చాలా కాలానికి నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల విషయంలో ఇదే జరిగింది. బాలకృష్ణ, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘నిప్ప్పురవ్వ’, బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి రూపొందించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రాలు 1993 సెప్టెంబర్ 3న విడుదలయ్యాయి. బంగారుబుల్లోడు కంటే ముందుగానే నిప్ప్పురవ్వ చిత్రాన్ని ప్రారంభించారు. బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో కొన్నాళ్లు షూటింగ్ను నిలిపివేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆ కేసు పరిష్కారం అయిన తర్వాత రిలీజ్ డేట్ని ఎనౌన్స్ చేశారు. అదే డేట్కి బంగారు బుల్లోడు కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేశారు. బంగారు బుల్లోడు పెద్ద హిట్ అవ్వగా, నిప్ప్పురవ్వ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల నిప్ప్పురవ్వ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.
Apr 07, 2026‘శివ’ పరమ బోర్ సినిమా.. పావుగంట కూడా చూడలేకపోయాను
(ఏప్రిల్ 7 రామ్గోపాల్వర్మ పుట్టినరోజు సందర్భంగా..) తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగార్జున, రామ్గోపాల్వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ ఎలాంటి చరిత్ర సష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా దశను, దిశను మార్చిన ఈ సినిమా ఎంతో మంది దర్శకులకు ఇన్స్పిరేషన్. తెలుగు సినిమాకి ఒక కొత్త అర్థం చెప్పిన ‘శివ’ చిత్రం విడుదలై 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవలి కాలంలో రీరిలీజ్ల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే. సూపర్హిట్ అయిన సినిమాలు రీరిలీజ్లోనూ మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ క్రమంలోనే ‘శివ’ చిత్రాన్ని కూడా గత ఏడాది నవంబర్ 14న రిలీజ్ చేశారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘శివ’ చిత్రాన్ని 4కె ఫార్మాట్లో డాల్బీ అటమాస్ సౌండ్తో ‘శివ’ కొత్త వెర్షన్ను రిలీజ్ చేశారు. ఒకప్ప్పుడు థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం రీరిలీజ్లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే.. దర్శకుడు రామ్గోపాల్వర్మ ఇటీవల తన మొదటి సినిమా ‘శివ’ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ‘శివ నిర్మాణంలో ఉన్నప్ప్పుడు సినిమాపై ఒక్కరికి కూడా నమ్మకం లేదు. యూనిట్లోని వారే సినిమా ఏవరేజ్ అవుతుంది అన్నారు. నా విషయానికి వస్తే ఒక మంచి సినిమా అవుతుందని అనుకున్నాను తప్ప బ్లాక్బస్టర్ అవుతుందని ఊహించలేదు. శివ చిత్రంలోని సీన్స్ అన్నీ నా కాలేజ్ టైమ్లో చూసిన ఘటనల ఆధారంగానే క్రియేట్ చేశాను. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్, సన్ని డియోల్ హీరోగా వచ్చిన అర్జున్.. ఇంకా కొన్ని సినిమాల ఇన్స్పిరేషన్తో కొన్ని సీన్స్ చేశాను. శివ తర్వాత సర్కార్, కంపెనీ, సత్య వంటి మాఫియా సినిమాలు చేశాను. ఈ సినిమాల ముందు నాకు శివ అనే సినిమా ఏమాత్రం శాటిస్ఫ్యాక్షన్ ఇవ్వలేదు. శివ రిలీజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ సినిమా చూడలేదు. ఆమధ్య ఈ సినిమా 25 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. ఆ సమయంలో సినిమా చూసినపుడు నాకు చాలా బోర్ కొట్టింది. 15 నిమిషాలు కూడా సినిమా చూడలేకపోయాను. ఎందుకంటే శివ చేసే టైమ్కి నా మెంటల్ కండిషన్ వేరు, ఇప్ప్పుడు నా ఆలోచనలు వేరు. అందుకే సినిమాను చాలా బోర్గా ఫీల్ అయ్యాను. అయితే నేను చేసిన సినిమాల్లో సత్య నాకు ఇష్టమైన సినిమా. ఇందులోని సీన్స్ అన్నీ ఎంతో రియలిస్టిక్గా ఉంటాయి. అందుకే ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు’ అంటూ వివరించారు రామ్గోపాల్వర్మ.
Apr 07, 2026ఎన్టీఆర్తో 15 సార్లు పోటీ పడిన కృష్ణ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి?
ఎన్టీఆర్, ఎఎన్నార్ తర్వాత మూడో స్థానంలో నిలబడిన హీరో కృష్ణ. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కృష్ణ.. ఎఎన్నార్కి ఉన్న పాపులారిటీని ప్రత్యక్షంగా చూసిన తర్వాత తను కూడా హీరో అవ్వాలనుకున్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు కృష్ణ. తన అభిమాన హీరో ఎన్టీఆర్తో కలిసి నటించాలనేది ఆయన చిరకాల కోరిక. స్త్రీజన్మ చిత్రంతో ఆయన కోరిక నెరవేరింది. ఆ సినిమాలో ఎన్టీఆర్కు తమ్ముడిగా నటించారు కృష్ణ. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 6 సినిమాల్లో నటించారు. విశేషం ఏమిటంటే.. ఆ ఆరు సినిమాల్లోనూ ఎన్టీఆర్కి తమ్ముడిగానే నటించారు కృష్ణ. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే సినిమాల పరంగా మాత్రం ఇద్దరి మధ్య పోటీ బాగా నడిచేది. 15 సార్లు వీరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి పోటీ పడ్డాయి. వాటిలో కొన్నిసార్లు ఎన్టీఆర్ విజయం సాధించగా, కొన్ని సార్లు కృష్ణవిజయాల్ని అందుకున్నారు. వాటిలో రెండు సినిమాల విషయంలో మాత్రం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 1977 సంక్రాంతికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దానవీరశూర కర్ణ, కృష్ణహీరోగా నటిస్తూ నిర్మించిన ‘కురుక్షేత్రం’ విడుదలయ్యాయి. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే రెండూ మహాభారతం నేపథ్యంలో చేసిన కథలని ఎన్టీఆర్కి తెలిసింది. వెంటనే కృష్ణకు కబురు పంపారు. ఆయన వచ్చిన తర్వాత ‘బ్రదర్ మేం దానవీరశూరకర్ణ సినిమా చేస్తున్నాం. మీరు కూడా మహాభారత కథనే తెరకెక్కిస్తున్నారని తెలిసింది. దాని వల్ల ఇద్దరం ఇబ్బంది పడతాం. కాబట్టి మీ సినిమాను ఆపెయ్యండి’ అన్నారు ఎన్టీఆర్. దానికి కృష్ణసమాధానమిస్తూ.. ‘మేం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 10 లక్షలు ఖర్చుపెట్టాం. ఇప్ప్పుడు వెనక్కి తగ్గలేం’ అని చెప్పి వచ్చేశారు కృష్ణ. అంతకుముందు అల్లూరి సీతారామరాజు చేస్తున్న సమయంలో కూడా కృష్ణను పిలిచి ఆ సినిమా తియ్యొద్దు అన్నారు ఎన్టీఆర్. కానీ, కృష్ణ పట్టుదలగా ఆ సినిమాను పూర్తి చేసి ఘనవిజయాన్ని, మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇక దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం 1977 జనవరి 14న విడుదలయ్యాయి. దానవీరశూరకర్ణ ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించగా, కురుక్షేత్రం చిత్రానికి పరాజయం తప్పలేదు. ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం పాతాళభైరవి ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించి ఆయన్ని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహబలుడు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 50 ఏళ్ళ కెరీర్లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క జానపద చిత్రమది. ఈ సినిమా చేస్తున్నసమయంలోనే కృష్ణ, గిరిబాబు హీరోలుగా సింహగర్జన సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకి గిరిబాబు నిర్మాత. తనకు పోటీగా దాదాపు అదే టైటిల్తో కృష్ణ సినిమా చేస్తున్నారనే విషయాన్ని ఎన్టీఆర్కు చేరవేశారు ఆయన సన్నిహితులు. అయినా ఎన్టీఆర్ ఈ విషయంలో స్పందించలేదు. గిరిబాబుకి ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఉదయమే ఎన్టీఆర్ ఆఫీస్కి వెళ్లారు గిరిబాబు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. కుశల ప్రశ్నల తర్వాత ‘నేను చేస్తున్న సింహగర్జన, మీరు చేస్తున్న సింహబలుడు ఒకే కథతో రూపొందుతున్నాయని అందరూ చెప్ప్పుకుంటున్నారు. ఈ విషయం మీ వరకు వచ్చిందని తెలిసింది. అందుకే మీరు నాకు సమయం ఇస్తే మా సినిమా కథ చెబుతాను’ అన్నారు గిరిబాబు. ఆ సినిమా సినాప్సిస్ చెప్పారు గిరిబాబు. ఓపికగా అంతా విన్న ఎన్టీఆర్.. ‘ఈ రెండు కథలు వేరు కదా. మరి నాకు అలా చెప్తున్నారేంటి?’ అని ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్. విషయం అర్థం చేసుకొని గిరిబాబును అభినందించి ‘సినిమా బాగా తియ్యండి బ్రదర్.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వొద్దు’ అని చెప్పారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలనూ భారీ బడ్జెట్తోనే నిర్మించారు. సింహబలుడు విడుదలైన 15 రోజుల తర్వాత సింహగర్జన రిలీజ్ అయింది. ఈ రెండింటిలో సింహగర్జన విజయం సాధించగా, సింహబలుడు పరాజయాన్ని చవిచూసింది.
Apr 06, 2026రాజబాబు మానవత్వానికి కంటతటి పెట్టుకున్న పద్మనాభం!
నవరసాల్లో ఏది ఇష్టపడకపోయినా హాస్యాన్ని ఆస్వాదించనివారు ఎవ్వరూ ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాస్యానికి ఆదరణ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంతేకాదు, హాస్యాన్ని పండించిన నటీనటులు నవరసాల్లోని ఏ రసాన్నయినా అద్భుతంగా అభినయించగలరు అనేది జగమెరిగిన సత్యం. హాస్యనటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన నటుడు రాజబాబు. అలాగే విషాదం నిండిన పాత్రలను కూడా ఆయన ఎంతో సమర్థవంతంగా పోషించేవారు. నటుడిగా స్థిరపడేందుకు రాజబాబు ఎన్నో కష్టాలను అనుభవించారు. 1960లో వచ్చిన ‘సమాజం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన రాజబాబు.. 20 సంవత్సరాల కెరీర్లో 600కిపైగా సినిమాల్లో నటించారు. ఒక దశలో రాజబాబు లేని సినిమా ఉండేది కాదు. ఆరోజుల్లో రాజబాబు, రమాప్రభ కాంబినేషన్కి మంచి క్రేజ్ ఉండేది. కమెడియన్గా మంచి పేరు, డబ్బు సంపాదించిన రాజబాబుకి దాన గుణం చాలా ఎక్కువ. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున తనకంటే సీనియర్ కమెడియన్స్ని సత్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలాగే రాజమండ్రిలోని పారిశుధ్య కార్మికుల కోసం అదే ఊరిలో భూమి ఇచ్చారు. కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించారు. అంతేకాదు, ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. తను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును దాన ధర్మాలకే ఉపయోగించారు రాజబాబు. అయితే ఒక దశలో సొంతంగా సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. కొన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టినా, ఎక్కువ శాతం పరాజయాన్ని చవిచూశాయి. దాంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అదే సమయంలో పద్మనాభం కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. పద్మనాభం నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కోసం ర్పుాబాబు దగ్గర అప్ప్పు చెయ్యాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా సినిమాల వల్లే నష్టపోయారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడం, నిర్మాతగా కూడా నష్టాలు రావడంతో రాజబాబుకి కొంత డబ్బు అవసరం పడింది. ఆ సమయంలో పద్మనాభం దగ్గరకు వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగారు ర్పుాబాబు. అప్పటికే పద్మనాభం సినిమాల కోసం తన ఆస్తులను కూడా అమ్మేశారు. అయినప్పటికీ రాజబాబుకి ఇవ్వాల్సిన డబ్బు కోసం తన పేరు మీద ఉన్న ఓ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ రాజబాబుకి ఇచ్చి, దాన్ని తాకట్టుపెట్టి డబ్బు తీసుకోమని చెప్పారు పద్మనాభం. అంత కష్టంలోనూ తన మానవత్వాన్ని మర్చిపోలేదు రాజబాబు. అలా తాకట్టుపెట్టి డబ్బు తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ‘నీ ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకునే స్థితికి నేను దిగజారలేదు. నీ దగ్గర ఉన్నప్ప్పుడే ఇవ్వు అన్నయ్యా’ అంటూ ఎంతో సున్నితంగా చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు రాజబాబు. తను కష్టాల్లో ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి రాజబాబు ఇచ్చిన గౌరవాన్ని చూసి పద్మనాభం కంటతడి పెట్టుకున్నారు. అంతటి మానవత్వం కలిగిన కమెడియన్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతో గర్వపడ్డారు.
Apr 06, 2026ఆ సినిమా వల్ల కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.. ఎందుకని?
సినిమా అనేది ఎంతో ప్రభావవంతమైన మాధ్యమం అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో నెగెటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయనే వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఒక సినిమా వల్ల కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడడం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారిన విషయం. అసలేం జరిగింది? ఆ సినిమాకి, ఆ పెళ్ల్లిళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపుýర్ అయిన ‘దేవదాసు’ కథ గురించి అందరికీ తెలిసిందే. బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన ఈ నవల మొదటిసారి 1917లో పబ్లిష్ అయింది. ఈ కథ ఆధారంగా 1935 నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో 20 సినిమాలు రూపొందాయి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘దేవదాసు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చివరిసారిగా 2002లో షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో హిందీలో ‘దేవ్దాస్’ పేరుతో ఈ కథ తెరపైకి వచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవ్దాస్’ చిత్రం షూటింగ్ 2001లో ప్రారంభించారు. ఆరోజుల్లోనే భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్గా ద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని చంద్రముఖి పాత్రకు సంబంధించిన కోట సెట్ను ఎంతో భారీగా నిర్మించారు. దాదాపు కిలోమీటరు మేర ఈ సెట్ ఉంటుంది. ఆరోజుల్లో ఆ సెట్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ సెట్ ఎఫెక్టివ్గా కనిపించేందుకు 2,500 పవర్ఫుల్ లైట్స్ను ఏర్పాటు చేశారు. వాటి కోసం పెద్ద మొత్తంలో జనరేటర్స్ తెప్పించారు. ముంబాయిలో ఉన్న జనరేటర్స్ అన్నీ ‘దేవ్దాస్’ సెట్లోనే ఉన్నాయని చెప్ప్పుకున్నారు. దాదాపు 30 రోజుల పాటు ఆ సెట్లో షూటింగ్ జరిగింది. అది పెళ్లిళ్ల సీజన్. చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడ లైటింగ్ కోసం జనరేటర్స్ అవసరం అయ్యాయి. కానీ, అవన్నీ ‘దేవ్దాస్’ షూటింగ్లో ఉండిపోయాయి. దాంతో ఆ నెలలో కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయని అప్పట్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. 50 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘దేవ్దాస్’ 2002 జూలై 12న విడుదలై ఘనవిజయం సాధించింది. దాదాపు 168 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సష్టించింది. మొదట 2002 మే 23న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ‘దేవ్దాస్’ చిత్రానికి ప్రశంసలు లభించాయి.
Mar 31, 2026దాసరిపై కోపంతో సెట్ నుంచి వెళ్లిపోయిన ఎస్.వి.రంగారావు.. అసలేం జరిగింది?
1973లో విడుదలైన ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దాసరి నారాయణరావు తొలి సినిమాతోనే ఇండస్ట్రీలోని ప్రముఖుల దష్టిని ఆకర్షించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆత్రేయ వంటి గొప్ప రచయిత దాసరి భుజం తట్టి ప్రశంసించారంటే దాసరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప డైరెక్టర్ని పరిచయం చేసిన ఘనత నిర్మాత కె.రాఘవకు దక్కుతుంది. దాసరిని డైరెక్టర్గా పరిచయం చేయడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ‘తాత మనవడు’ ఘనవిజయం సాధించడంతో దాసరితోనే రెండో సినిమా ప్రారంభించారు రాఘవ. ఆ సినిమా పేరు ‘సంసారం సాగరం’. ఈ చిత్రంలో కూడా ఎస్.వి.రంగారావు ముఖ్యపాత్ర పోషించారు. తాత మనవడు చిత్రంలో దాసరి రాసిన డైలాగులు తన గాత్రంలో ఎంతో అద్భుతంగా పలికించిన ఎస్వీఆర్.. ఈ సినిమాకి వచ్చే సరికి అలాంటి డైలాగులే చెప్పేందుకు అభ్యంతరం చెప్పారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జయంతి గురించి, ఆమె గొప్ప తనం గురించి ప్రస్తావిస్తూ చెప్పే డైలాగుల పేపర్ను ఎస్వీఆర్కి ఇచ్చారు దాసరి. ఆ డైలాగులు చదువుకున్న ఎస్వీఆర్.. అంత పెద్ద డైలాగు అవసరం లేదని, తగ్గించి చెప్పినా ఏమీ తేడా ఉండదని, అందులో నుంచి రెండు లైన్లు కట్ చేసి చెబుతానన్నారు. కానీ, దాసరి దానికి ఒప్ప్పుకోలేదు. తనలాంటి సీనియర్ నటుడు చెప్పిన మాట ఒక కొత్త దర్శకుడు వినకపోవడం ఎస్వీఆర్కి బాగా కోపం తెప్పించింది. ఆ సీన్ చెయ్యను అంటూ పేపర్లు విసిరి కొట్టి, కాస్ట్యూమ్ కూడా తీసేసి సెట్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న నిర్మాత రాఘవ.. కారులో వెళుతున్న ఎస్వీఆర్ను మరో కారులో ఫాలో అయ్యారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మనసు మార్చుకొని తిరిగి సెట్కి వచ్చారు ఎస్వీఆర్. మారు మాట్లాడకుండా దాసరి ఇచ్చిన డైలాగును యధాతథంగా చెప్పి సింగిల్ షాట్లో సీన్ ఓకే చేశారు. ఒక మంచి దర్శకుడ్ని, రచయితను అవమానించినందుకు ఎస్వీఆర్ ఎంతో బాధపడ్డారు. ‘డైరెక్టర్ అంటే నీలా ఉండాలి. నేను చెప్పాను కదా అని డైలాగు మార్చలేదు. నువ్వు తప్పకుండా గొప్ప దర్శకుడివి అవుతావు’ అంటూ దాసరిని ఆశీర్వదించారు ఎస్వీఆర్. ఆరోజు సెట్లో దాసరి, ఎస్వీఆర్ మధ్య జరిగిన వాగ్వాదం యూనిట్ మెంబర్స్ అందర్నీ కలవరపరిచింది. ఇకపై షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా వారికి కలిగింది. అయితే ఎస్వీఆర్ అంత గొప్ప నటుడైనా ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా తిరిగి సెట్కి వచ్చి తను ఇచ్చిన డైలాగ్ను ఏమాత్రం మార్చకుండా చెప్పి, ఆ తర్వాత అభినందించడం నిజంగా తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పలు సందర్భాల్లో చెప్పారు దాసరి.
Mar 31, 2026రజినీకాంత్ అలా దూసుకెళ్లారు.. చిరంజీవి మాత్రం మధ్యలోనే ఆగిపోయారు!
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 1970వ దశకంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజినీకాంత్ల గురించి ప్రత్యేకంగా చెప్ప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తమ టాలెంట్తో నటులుగా పరిచయమై స్టార్స్గా ఎదిగారు చిరంజీవి, రజినీకాంత్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక దశలో తెలుగులో చిరంజీవి టాప్ హీరో అయితే, తమిళ్లో రజినీకాంత్ టాప్ హీరోగా చక్రం తిప్పారు. ఈ ఇద్దరు స్టార్స్కి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అయితే మొదట రజినీకాంత్ని ఆ ఛాన్స్ వరించింది. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అశోక్ అమత్రాజ్ హాలీవుడ్లో సినిమాలు చేస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సోదరుడు విజయ్ అమత్రాజ్ జేమ్స్బాండ్ సిరీస్లో వచ్చిన ‘ఆక్టోపస్సీ’ చిత్రంలో రోజర్ మూర్తో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇండియన్ బ్యాక్డ్రాప్లో ఒక హాలీవుడ్ మూవీ తియ్యాలనుకున్నారు అశోక్. అప్పటికే సూపర్స్టార్గా వెలిగిపోతూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రజినీకాంత్ హీరోగా ఆ సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. రజినీ కూడా సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాలీవుడ్ నుంచి దాదాపు 25 మంది టెక్నీషియన్స్ని ఇండియా తీసుకొచ్చి 1987లో ‘బ్లడ్ స్టోన్’ పేరుతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు విజయ్ అమత్రాజ్. ఈ సినిమాలో రజినీకాంత్ టాక్సీ డ్రైవర్గా నటించారు. 1 మిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించి 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన ఇండియన్ హీరోగా రజినీకాంత్కి మంచి పేరు తెచ్చింది ‘బ్లడ్ స్టోన’. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. 1940లో విడుదలైన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ పేరుతో ఇంగ్లీష్లో, తెలుగులో అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆరోజుల్లోనే ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ నిర్ణయించారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 500 కోట్లు అని చెప్పాలి. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ని రప్పించారు. సెకండ్ యూనిట్ డైరెక్టర్గా సురేష్ కష్ణను ఎంపిక చేశారు. 1998 సెప్టెంబర్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇంగ్లీష్ వెర్షన్ గంటన్నరగా, తెలుగు వెర్షన్ రెండున్నర గంటలుగా నిర్ణయించారు. తెలుగు వెర్షన్లో 5 పాటలు, కొన్ని కామెడీ సీన్స్ని కూడా జోడించారు. ఎ.ఆర్.రెహమాన్కి సంగీతాన్ని చేసే బాధ్యత అప్పగించారు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత మూడు నిమిషాల నిడివి వుండే ఒక ట్రైలర్ను రిలీజ్ చేశారు. అది చూసిన తెలుగు బయ్యర్లు పోటీ పడ్డారు. ఆరోజుల్లో చిరంజీవి సినిమాకి 8 కోట్లు బిజినెస్ జరిగేది. ఈ సినిమాకి 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇది ఇస్లామిక్ మతానికి సంబంధించిన కథ. ఖురాన్ అనేది వారికి ఎంతో పవిత్రమైంది. కథ ప్రకారం ఖురాన్ పాతగా కనిపించడం కోసం దానిపై కాఫీని ఒలికించారు. ఇది ఆ మతస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ సినిమా షూటింగ్ ఆపెయ్యాలంటూ ఆందోళన చేపట్టారు. చిత్ర నిర్మాతలు ముగ్గురి మీదా కేసులు పెట్టారు. దీంతో షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ కేసుల వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ గొడవలతో సినిమాను పక్కన పెట్టేశారు. అలా చిరంజీవికి వచ్చిన హాలీవుడ్ సినిమా అవకాశం చేజారిపోయింది. ఆ అనుభవంతో కొత్త నిర్మాతలతో సినిమా చెయ్యకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడు అనే ఘనత చిరంజీవికి దక్కి ఉండేది.
Mar 30, 2026శ్రీరామదాసు చిత్రానికి 20 ఏళ్లు.. వైరల్గా మారుతున్న నాగ్ ఫ్యాన్స్ డిమాండ్!
- భక్త రామదాసుగా నాగార్జున విశ్వరూపం - మళ్ళీ థియేటర్లలోకి ‘శ్రీరామదాసు’? - అన్నమయ్య తర్వాత నాగార్జునకు అంతటి పేరు తెచ్చిన శ్రీరామదాసు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. అయితే ఆయన చేసిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి భక్తిరస చిత్రాలు ప్రేక్షకులకు అందించిన అనుభూతి అద్వితీయం. ముఖ్యంగా 2006లో విడుదలైన ‘శ్రీరామదాసు’ చిత్రంలోని దృశ్యాలు, పాటలు ప్రతి తెలుగు లోగిలిలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భద్రాచల రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. నాగార్జున తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాల్లో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు. గోపన్నగా ఆయన చూపించిన ఎమోషన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో నాగార్జున పలికించే హావభావాలు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం. ‘అంతా రామమయం’, ‘అదిగో అదిగో భద్రగిరి’, ‘పలుకే బంగారమాయెనా’ పాటలతోపాటు సినిమాలోని అన్ని పాటలూ ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అప్పట్లో ఈ పాటల ఆల్బమ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం పాటల కోసమే థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. శ్రీరామదాసు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు కబీర్ దాసు పాత్రలో నటించడం ఒక విశేషం. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ ఆధ్యాత్మిక కావ్యం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు 18 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నాగార్జునకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘శ్రీరామదాసు’ చిత్రాన్ని 4K వెర్షన్లో థియేటర్లలోకి తీసుకురావాలని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి క్లాసిక్ సినిమాల జ్ఞాపకాలు ఆయన స్టార్డమ్ను ఎప్పుడూ పదిలంగా ఉంచుతాయి. అప్పట్లో టెక్నాలజీ పరిమితంగా ఉన్నా, రాఘవేంద్రరావు చూపించిన విజువల్స్ ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తాయి. మరి అక్కినేని అభిమానులు చేస్తున్న రీరిలీజ్ డిమాండ్పై నాగార్జునతో సహా రాఘవేంద్రరావు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తే అది ఏ మేర సంచలనం సృష్టిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Mar 30, 2026.webp)
ఒక్క స్టార్ హీరో కూడా లేని రావుగోపాలరావు అంతిమయాత్ర.. ఎందుకలా చేశారు?
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప నటులు వున్నారు. వారిలో రావుగోపాలరావు ప్రత్యేకం అని చెప్పాలి. తన విలక్షణమైన గొంతుతో, డైలాగ్ డెలివరీతో విలనిజానికే కొత్త అర్థం చెప్పారు. తెరపై గంభీరంగా కనిపించే ఈ మహానటుడి వ్యక్తిగత జీవితం మరియు ఆయన చివరి రోజులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన భార్య కమల కుమారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రావుగోపాలరావు షూటింగ్ సమయంలో చాలా క్రమశిక్షణతో ఉండేవారు. పని పట్ల ఆయనకు ఉన్న గౌరవం అపారం. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం ఇచ్చేవారు. ఆయన ఆహారపు అలవాట్లు కూడా చాలా సాదాసీదాగా ఉండేవి. బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఇంట్లో మాత్రం చాలా సరళంగా ఉండేవారని ఆమె తెలిపారు. రావుగోపాలరావుకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండేవని, చివరి రోజుల్లో అవి తీవ్రమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన తన వృత్తి పట్ల ఉన్న మక్కువతో పనులను కొనసాగించే ప్రయత్నం చేసేవారు. చివరికి ఆ అనారోగ్యమే 1994 ఆగస్టు 13న ఆయనను మనకు దూరం చేసింది. రావుగోపాలరావు చనిపోయిన సమయంలో ఆయన అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కూడా హాజరు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు రాకపోవడం తమను ఎంతో బాధించింది అన్నారు. అంతేకాదు, ఒక్క నిర్మాత కూడా అంతిమ యాత్రలో లేరు. అల్లు రామలింగయ్య, పి.ఎల్. నారాయణ, రేలంగి నరసింహారావు వంటి కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అంతటి మహానటుడికి జరగాల్సిన గౌరవం ఆ సమయంలో సరిగ్గా జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు శాశ్వతం. తరం మారినా రావుగోపాలరావు డైలాగులు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన భార్య పంచుకున్న ఈ విషయాలు ఆ మహానటుడి జీవితం వెనుక ఉన్న మరో కోణాన్ని మనకు తెలియజేస్తోంది.
Mar 30, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



