జనం మధ్య జగన్ ... పోలీస్ రక్షణలో సిబీఐ అధికారులు

Publish Date:Apr 10, 2012

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు సిబీఐ దాఖలు చేసిన కేసులో జగన్ ను ఎ1 ముద్దాయిగా పేర్కొంది. అయినప్పటికీ అరెస్టు చేయడంలో తాత్సారం చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల రూపాయలలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఛార్జి షీట్ లలో రెండవ ముద్దాయిగా వున్న విజయసాయి రెడ్డికి, అరెస్టు అయిన సీనియర్ ఐఎఎస్ అధికారులకు బెయిల్ మంజూరు కాకుండా చేస్తున్న సిబీఐ అధికారులు మొదటి ముద్దాయిగా వున్న జగన్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభించడంపట్ల దాని విశ్వసనీయతపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న చిన్న చీటింగ్ కేసులకే ముద్దాయిలను అరెస్టు చేసే పోలీసులు వేల కోట్ల రూపాయలకు సంబంచించి అనేక ఆధారాలతో ఛార్జి షీటు దాఖలు చేసి కూడా అరెస్టు చేయకపోవడం చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతోందనే భావన కలుగుతోంది., ఎన్ని కబుర్లు చెప్పినా రాజకీయ నాయకులందరూ ఒకటేననే భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. తాజాగా లెటరోగేటరీ పేరుతొ విదేశాలలో ఆధారాలు సంపాదించడం కోసం సిబీఐ అధికారులు వెళ్ళడం చూస్తుంటే జగన్ ను అరెస్టు చేసే ఉద్దేశ్యం వున్నట్టు కనిపించడం లేదని ప్రజలు చెప్పుకొంటున్నారు. అయితే ఇదే సమయంలో సిబీఐ కేసును అంత తేలికగా తీసివేయడానికి వీలులేదని, చర్య తీసుకోవడం జాప్యం కావచ్చునేమోకాని ఎవరినీ వదలడాని, గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్, సుఖ్ రామ్, కనిమొళి, దయానిధి మారన్ వంటి అగ్రనేతలను కూడా వదలలేదని ... జగన్ ను వదిలివేస్తారనుకోవడం అయాకత్వం అవుతుందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎ - 1 ముద్దాయిగా ముద్రవేసుకున్న జగన్ దర్జాగా జనం మధ్యలో తిరుగుతుంటే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన సిబీఐ అధికారులు సాయుధ పోలీసుల రక్షణలో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాము ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి జగన్ కేసును దర్యాప్తు చేస్తున్నామని సిబీఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట చెబుతున్నారు. అయితే మీరు మరీ అంతటి త్యాగాలు చేయనక్కరలేదని ప్రాణాలు త్యాగాలు చేసేకన్నా ఉద్యోగాలు మానుకుంటే మంచిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో సిబీఐ సిబ్బంది వెర్రిచూపులు చూడాల్సివచ్చింది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.