వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు జలసమాధి..!

Publish Date:Sep 16, 2026

Advertisement

వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది. మేళతాళాలు, డ్యాన్సులు, జైజైకారాలతో ప్రారంభమైన నిమజ్జన వేడుక.. కాసేపటికే ఆరు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కంచర్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వినాయక చవితి వేడుకల్లో భాగంగా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులు నిమజ్జనం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. విగ్రహ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా చెరువు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆరుగురు విద్యార్థులు మాత్రం బయటకు రాకపోవడంతో అనుమానం మొదలైంది.

విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికులతో కలిసి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు క్షేమంగా బయటపడాలని అందరూ ఆశించినప్పటికీ.. చివరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు.

మృతుల్లో నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్దార్థ్ ఉన్నారు. వీరిలో సుమంత్, గణేష్ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్ కిరణ్ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్ కుమార్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. సిద్దార్థ్ పదో తరగతి విద్యార్థిగా గుర్తించారు.

చదువులు పూర్తి చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని కలలు కంటున్న విద్యార్థుల జీవితాలు ఒక్కసారిగా విషాదాంతమయ్యాయి. నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థులు మృతి చెందారన్న వార్త తెలియడంతో కంచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు విషాద వార్త వినాల్సి వచ్చింది.

ఒక్కసారిగా ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ రోజు పిల్లలతో ఆనందాన్ని పంచుకోవాల్సిన కుటుంబాలు.. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

[ sangareddy news, patancheru tragedy, ganesh immersion accident, six students drowned, telangana news, vinayaka chavithi tragedy, cm revanth reddy, cp sajjanar,DGP C,V, Anand ]

By
en-us Political News

  
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.