గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం.!

Publish Date:Sep 17, 2026

Advertisement

గణేష్  నిమజ్జన వేడుకలో   విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాలతో సాగాల్సిన సంబరాల్లో జరిగిన అపశ్రుతి విషాదాన్ని నింపింది. . వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  

సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి సమీపంలో ఉన్న నేరేడు చెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కొంతమంది విద్యార్థులు బృందంగా వెళ్లారు. అయితే..  చెరువులో మట్టి తవ్వకాల కారణంగా ఏర్పడిన లోతైన గుంతలను వారు ముందుగా గుర్తించలేకపోయారు. విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లే క్రమంలో  వారు గుంతలో పడి మునిగిపోయారు.  సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు స్థానిక శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన వారిగా   గుర్తించారు. మృతులలో నర్సింహా రాజు (బీటెక్), సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్), గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్), శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్) అలాగే పదవ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

 

ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్  శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  పలువురు ప్రముఖులు   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు  విచారణ చేపట్టారు. ట్రస్ట్ నిర్వాహకులను విచారించడం తోపాటు చెరువుల వద్ద భద్రతా లోపాలపై ఆరా తీస్తున్నారు. 

ఉత్సవాల సమయంలో తగినంత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద నిమజ్జన వేడుకల సమయంలో స్థానిక యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమని అంటున్నారు.  

[Ganesh immersion tragedy, six students dead, Shirisha Charitable Trust, Sangareddy District, Telugu One]

By
en-us Political News

  
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.