సందిగ్థంలో కొండా సురేఖ ...!

Publish Date:Apr 11, 2012

Advertisement

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకురాలు, పరకాల నియోజకవర్గ శాసనసభ్యురాలు (తాజామాజీ) కొండా సురేఖ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్థంలో వున్నట్టు తెలుస్తోంది. వై ఎస్ ఆర్ కు వీర అభిమాని అయిన సురేఖ, వై ఎస్ ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీలో కీలక నాయకురాలిగా మారారు. అనర్హత వేటు కారణంగా సురేఖ కూడా శాసన సభ్యత్వం కోల్పోవడంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పరకాల కూడా వుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఇతర శాసన సభ్యులకంటే ఈమె పరిస్థితి భిన్నంగా వుంది. 18 నియోజకవర్గాలలో 17 కోస్తాంధ్రలో వుండగా ఈమెకు చెందిన వరంగల్ జిల్లాలోని పరకాల మాత్రమే తెలంగాణలో వుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం వల్ల తెలంగాణ ప్రాతంవారు జగన్ ను సమైక్యవాదిగానే భావిస్తారు. దాంతో ఉప ఎన్నికల్లో వై ఎస్ ఆర్ పార్టీ తరపున పోటీలో నిలిస్తే తన పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ లో నాగం జనార్థనరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్టు తాను కూడా స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేస్తే ఎలా వుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ లో నాగంకు టి.ఆర్.ఎస్ మద్దతు ప్రకటించింది. నాగం కూడా తెలంగాణ కోసమే పదవిని వదులుకున్నారు. దాంతో స్థానికులు నాగంను తెలంగాణ వాడిగా గెలిపించుకున్నారు.

పరకాలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. సురేఖ ప్రత్యేక తెలంగాణ కోసం పదవి త్యాగం చేయలేడు. కేవలం జగన్ కోసం పదవి త్యాగం చేశారనే భావన ప్రజలలో వుంది. దీనికి తోడు సురేఖకు టి.ఆర్.ఎస్. మద్దతు ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే పరకాల నుంచి పోటీ చేయడానికి టి.ఆర్.ఎస్. అభ్యర్థిని కూడా సిద్ధం చేసింది. ఈ పరిస్థితి వస్తుందనే ముందుగా ఊహించే సురేఖ తెలంగాణ ఏర్పాటు కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రజలలో గుర్తింపు పొందడానికి ప్రయత్నించినా స్పీకర్ నిర్ణయం అందుకు అనుకూలంగా లేకుండా పోయింది. ఆమెపై ప్రత్యేక తెలంగాణ కోసం కాకుండా పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేశారు. దాంతో తాను తెలంగాణ కోసం పదవి త్యాగం చేశానని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ స్థితిలో తాను వై.ఎస్,ఆర్. పార్టీ తరపున పోటీ చేయాలా? లేక స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలా అసలు పోటీ చేయకుండా టి.ఆర్.ఎస్. అభ్యర్థికి మద్దతు తెలపాలా? అనే సందిగ్థంలో సురేఖ వున్నారని తెలుస్తోంది.

By
en-us Political News

  
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.