మద్యానికి రెక్కలు

Publish Date:Aug 27, 2012

Advertisement

ప్రభుత్వానికి ఆదాయవనరులను సమకూరే ప్రతి వనరునీ ఉపయోగించు కుంటుంది. అలాంటి ఆదాయవనరుల్లో మద్యం తిరుగులేనిది.రాష్ట్రంలోని 6596 మద్యం దుకాణాలకు 637 మద్యం దుకాణాలు 2012-13 ఎక్సైజ్‌ సంవత్సరంలో మిగిలాయి. దీంతో ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయలను లైసెన్సు రూపంలో కోల్పోయింది. వీటితో ఎలాగైనా ఖజానాకు డబ్బులు రాబట్టాలన్న ప్రభుత్వం ప్రీమియం మద్యంపై అదనపు ప్రివిలేజ్‌ పన్నును 12.5 శాతం పెంచింది. తాజాగా ఎపిబిసిఎల్‌ కు మద్యం సరఫరా చేసే తయారీ దారులనుండి ఒప్పందం ముగియటంతో త్వరలో మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. అలాగే సోమవారం నుండి మద్యం పైనుండే చిల్లరను సమీప రూపాయలకు రౌండప్‌ చేసి అమ్మనున్నారు.ఆంద్రప్రదేశ్‌ బ్రెవరేజస్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే మద్యం ధరలు కూడా రౌండిరగ్‌ కారణంగా పెరగనున్నాయి. వ్యాపారులకు ఇష్యూ ప్రైజ్‌స్‌గా పిలిచే ఈ స్ధిర ధరలను చిల్లరపేరుతో మధింపు చేసారు. అంటే చిల్లరి తర్వాతి అధిక రూపాయితో సమానం చేస్తారు. దీంతో వ్యాపారులకు మద్యం సరఫరాచేసే రేట్లు పెరిగి మద్యం మరింత ప్రియం కానుంది. ఈ రెండు పద్దతుల్లో పెరుగుదల అంతిమంగా మందుబాబులపైనే పడుతుంది. అంటే 49.14 రూపాయలున్న బాటిల్‌ ధర ఇకపై 50 రూపాయలవుతుంది.అదేవిధంగా 47రూపాయలున్న బాటిల్‌ ఖరీదు 50 రూపాయలుగా మారుతుంది. అంటే గరిష్టంగా ఒక్కో బాటిల్‌ ఖరీదు 20శాతం పెరగనుంది. దీంతో ప్రతి లిక్కర్‌ కేస్‌కు 200 రూపాయలు పెరగనుంది. దీంతో మద్యం ధరలు పెరిగి మందుబాబులకు జెలక్‌ ఇస్తుంది. దీని ద్వారా ఏడాదికి 1000 కోట్లు ఖజనాకు చేరనుంది.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.