పరకాల కాంగ్రెస్ టిక్కెట్టు తన భార్య గండ్ర జ్యోతికి ఇవ్వనందుకు నిరసనగా ఆమె భర్త, వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన గండ్ర వెంటకరమణారెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సమయంలో తాను, తన భార్య ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని పార్టీ కోసం త్యాగాలు చేశామనీ, కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా పరకాలకు పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గండ్ర జ్యోతి కాంగ్రెస్ పార్టీ తరపున పరకాల నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే పార్టీ అధినాయకత్వం ఇటీవలే టిడిపి నుంచి వచ్చిన సాంబారి సమ్మారావుకు టిక్కెట్టు ఇచ్చింది. తన సతీమణికి పరకాల టిక్కెట్టు ఇచ్చినా ఇవ్వక పోయినా తానేమీ పట్టించుకోనని, కానీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం పనిచేసిన తనకు మాట మాత్రమైనా చెప్పకుండా టిడిపి నుంచి వచ్చిన సమ్మారావుకు టిక్కెట్టు ఇవ్వాల్సిన ఖర్మ ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేయటంతో ఇంతకాలం డిసిసి అధ్యక్షపదవిలో ఉండటం భావ్యం కాదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేస్తే కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందనటంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warangal-dcc-chief-ready-to-resign-24-13871.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!