పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అగ్రరాజ్యం అమెరికా సైనికుల్లో ఆందోళన నింపుతోంది. ఇరాన్తో ముంచుకొస్తున్న పోరు నేపథ్యంలో అక్కడ మోహరించిన అమెరికా బలగాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా సైనికులు తమ భయాలను అధిగమించేందుకు క్లబ్బులను ఆశ్రయిస్తున్నట్లు సదరు ఇన్ఫ్లుయెన్సర్ వెల్లడించారు. సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న వినోద కేంద్రాలకు సైనికులు పోటెత్తుతున్నారని, అక్కడ వారు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ సేదతీరుతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. ముఖ్యంగా తక్కువ వయసున్న సైనికులు కూడా ఈ యుద్ధ భయంతో కలత చెందుతున్నారనీ, మేము యుద్ధానికి వెళ్తున్నాం" అంటూ వారు తనతో పంచుకున్న మాటలను ఇన్ఫ్లుయెన్సర్ వివరించారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న ఒత్తిడిని చూస్తుంటే బాధగా అనిపించింద వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో రక్షణ ఏర్పాట్లను అమెరికా పెంచుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ వ్యక్తం అవుతోంది.
యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సైనికుల కదలికలు, వారి మానసిక స్థితిపై ఇలా బహిరంగంగా వీడియోలు రావడం పట్ల అమెరికా మాజీ సైనికాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బులు, పబ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో సైనికులు చేసే సాధారణ సంభాషణలు శత్రువులకు కీలక సమాచారాన్ని అందించే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నది. సైనిక గోప్యత దెబ్బతినడం పెను ముప్పుకు దారితీసు ప్రమాదం ఉందని అమెరికా రక్షణ అధికారులు సైతం అంటున్నారు.
ఈ తరుణంలో సైనికుల మానసిక ఆరోగ్యం మరియు భద్రతపై అగ్రరాజ్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. కాగా ఆ ఇన్ ఫ్లుయెన్సర్ వీడియో ద్వారా ట్రంప్ ప్రపంచంపైనే కాదు, అమెరికాపైనా, అమెరికా సైన్యంపైనా కూడా యుద్ధాన్ని బలవంతంగా రుద్దుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/war-fear-in-america-soldiers-36-216619.html
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.