Top Stories

political-news-img

నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదు.. డీజీపీ షాకింగ్ కామెంట్స్..!

తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..! తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పనితీరు, ప్రవర్తనపై రాష్ట్ర పోలీస్ బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు విభాగంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారుల తీరుపై డీజీపీ సీవీ ఆనంద్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. శాఖలోని నలుగురు అధికారుల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని డీజీపీ వ్యాఖ్యానించారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శిస్తున్న సదరు అధికారులకు ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా, అంతర్గతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశామని ఆయన వెల్లడించారు. అనేకసార్లు మందలించినప్పటికీ, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపట్ల డీజీపీ తీవ్ర అసంతృప్తి చెందారు. ఇప్పటికైనా వారు తమ పనితీరును, ప్రవర్తనను మెరుగుపరచుకోకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ బాస్ నుంచి నేరుగా ఇలాంటి గంభీర హెచ్చరిక రావడంతో తెలంగాణ పోలీస్ శాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. డీజీపీ వేలెత్తి చూపిన ఆ నలుగురు అధికారులు ఎవరు, వారిపై ఏయే అంశాల్లో ఫిర్యాదులు లేదా ఆరోపణలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం తీవ్రమైన ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయడం, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉన్నతాధికారులు పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు అనివార్యమని పోలీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల సహనం వహించేది లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. గతంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన సీవీ ఆనంద్, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడరనే పేరుంది. ఈ నేపథ్యంలోనే శాఖలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు, అధికారుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించేందుకు ఈ తరహా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పాలనలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులు గట్టి సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీనియర్, జూనియర్ అధికారులనే తేడా లేకుండా బాధ్యతారాహిత్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటేనే మిగతా వారికి హెచ్చరికగా ఉంటుందని చెబుతున్నారు. డీజీపీ తాజా తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో సదరు నలుగురు అధికారులు తమ వైఖరిని మార్చుకుంటారా లేదా వారిపై త్వరలోనే బదిలీలు, విచారణలు వంటి కఠినమైన చర్యలు ఉంటాయా అనేది వేచి చూడాలి. ఈ పరిణామం రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో మరిన్ని మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. Telangana DGP CV Anand, Telangana Police Department, Warning to Police Officials, CM Revanth reddy

Publish Date: Aug 10, 2026 9:43PM

political-news-img

మనోభావాల పేరిట వేధింపులు.. ఏపీలో సామాన్యుడి గొంతు నొక్కేస్తున్న రాజకీయం.. !

ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..! ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇవాళ ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. వీధుల్లో రాజకీయం వేడిగా, రచ్చరచ్చగా కనిపిస్తున్నప్పటికీ... అది ప్రజల కడుపు నింపేది కాదు, వారి సమస్యలను తీర్చేది అంతకన్నా కాదు. ఒకప్పుడు అభ్యుదయ భావాలకు, పోరాటాలకు, చైతన్యవంతమైన మేధో చర్చలకు నిలయమైన ఆంధ్ర నేలలో... ఈరోజు భయం, నిస్తేజత, ఒకరకమైన అచేతన నిశ్శబ్దం ఆవహించాయి. ఊళ్లలో, నగరాల్లో సగటు సామాన్యుడి మనస్సులో మెదులుతున్న అతి పెద్ద ఆందోళన.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టివి తెరలు తెరుచుకుంటే చాలు... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రాజకీయ సర్కస్, రాత్రికి ఛానళ్లలో వేడివేడి చర్చలు. ప్రజలకు వినోదం పంచే రంగుల వెలుగుల వెనుక దాగిన చేదు నిజం ఏమిటంటే... అధికారం, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ప్రధాన శక్తులు పైకి కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, తెర వెనుక మాత్రం ఎంతో కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాయి. నాటకీయ విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి. ఇటు యువతకు ఉద్యోగాలు లేక, రైతులకు గిట్టుబాటు ధర దొరక్క, సామాన్యుడిపై ధరల భారం పడుతుంటే... ఈ నిత్య నాటకాలు ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పాత్రే మాయమైపోతే, సామాన్యుడు తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? మరోవైపు భయానకమైన పత్రికా స్వేచ్ఛా హరణం జరుగుతోంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించే స్వతంత్ర జర్నలిస్టులు, యూట్యూబర్లు ఇవాళ తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు. ఏదైనా నిజం చెబితే ఎక్కడ తప్పుడు కేసులు పెడతారో, ఎప్పుడు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతారో అనే భయంతో వణికిపోతున్నారు. బహిరంగంగా నడిచే అక్రమాలు, సహకార సంస్థల నాయకులపై జరిగే రాజకీయ ఒత్తిళ్లు, బలవంతపు రాజీనామాల వార్తలను కూడా ప్రధాన పత్రికలు నిర్భయంగా ప్రచురించలేకపోతున్నాయి. సత్యాన్ని నిలబెట్టాల్సిన పత్రికలు, ఛానళ్లు భయంతోనో, ఒత్తిళ్లతోనో వార్తలను లోపలి పేజీలకు పరిమితం చేస్తుంటే... బాధితుడికి న్యాయం ఎక్కడ దక్కుతుంది? అన్నింటికంటే గుండెను పిండేసే విషయం ఏమిటంటే... ఎన్నడూ లేని విధంగా మన సమాజంలోకి మతపరమైన ద్వేషం, అసహనం విషంలా ఇంకిపోతున్నాయి. శతాబ్దాలుగా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించిన ఆంధ్ర సమాజంలో, ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా మతమత్తు వ్యాపింపజేస్తున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులు, పక్కపక్కనే జీవించే పౌరుల మధ్య కూడా అనుమానాలు, అపోహలు పెంచే కుట్రలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలాంటి సౌభ్రాతృత్వాన్ని ఈ విద్వేషం దెబ్బతీస్తోంది. ఈ నిశ్శబ్దం, ఈ నిస్తేజత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శుభసూచకం కాదు. ప్రజాస్వామ్యం మనకు ప్రసాదించిన హక్కులను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి పౌర సమాజం, మేధావులు, సామాన్య ప్రజలు మళ్లీ జాగృతం కావాలి. భయాన్ని వీడి ప్రశ్నించకపోతే, రేపు మన గొంతుకలను పూర్తిగా నొక్కేసే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ చైతన్యాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. AB Venkateswara Rao,Andhra Pradesh Politics, Freedom of Speech AP, AP Journalist Cases, TDP YCP Politics, AP Media Freedom, Andhra Democratic Rights

Publish Date: Aug 10, 2026 9:25PM

political-news-img

ఘనంగా అక్కన్న మాదన్న మహంకాళి ఘటం ఊరేగింపు..!

పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఘటం ఊరేగింపు ను ప్రారంభించారు. అంత కుముందు ఆలయాన్ని సందర్శించిన సీపీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విశిష్ట చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో పవిత్రమైన ఘటం ఊరేగిం పును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు, వరదల సమయంలో ప్రజలను కాపాడిన మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఘటం ఊరేగింపు జరిగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా, అవాం ఛనీయ సంఘటనలకు తావులేకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వ యంతో విస్తృత బందో బస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. హరిబౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఘటం ఊరేగింపు గౌలిపురా, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా సాగి నయాపూల్ వద్ద ముగి యనుంది. గత నెల రోజులుగా గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని సీపీ సజ్జనర్ తెలిపారు. బోనాల ఉత్స వాలను విజయవంతం చేసిన ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులకు హైదరాబాద్ నగర పోలీసుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ టాస్క్‌ఫోర్స్ వైభవ్ గైక్వాడ్, ఐపీఎస్, డీసీపీ చార్మినార్ జోన్ ఖారే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఆర్. వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ, సలహాదారు రాజారత్నం తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Akkanna madanna, old city, Laldarwaja, Nayapool, CP Sajjanar, CM Revanth reddy

Publish Date: Aug 10, 2026 9:07PM

political-news-img

మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు..!

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..! కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న గిరిజనుడి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా అడవి తల్లి ఒడిలోనే పేదరికంతో, రోగాలతో, సరైన ఉపాధి లేక అలమటిస్తున్న మన్యం బిడ్డల కన్నీటి గాథ ఇది. అపరిమిత సంపద ఉన్న ప్రాంతంలో పుట్టి కూడా, దిక్కులేని బతుకులు ఈడుస్తున్న వారి స్థితిగతులు నేటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పలు అంశాలపై తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, ఏపీ మాజీ గనుల డైరెక్టర్ డాక్టర్ వి.డీ రాజగోపాల్ మధ్య ఆసక్తికర విశ్లేషణ జరిగింది దళారుల దోపిడీ నుంచి కట్టెల మోపుల వరకు... ఆరని ఆవేదనతరతరాలుగా కొండల్లో లభించే అటవీ ఉత్పత్తులను మోసుకొచ్చి వారపు సంతల్లో అమ్ముకోవడమే మన్యం ప్రజల ప్రధాన బతుకు దెరువు. గతంలో దళారులు ఆ అమాయక గిరిజనులను ఏ స్థాయిలో దోచుకున్నారో అందరికీ తెలిసిందే. పది రూపాయల విలువైన వస్తువును కేవలం పది పైసలకే కొట్టేసి, వారి రెక్కల కష్టాన్ని నట్టేట ముంచేవారు. ఆ తర్వాత గిరిజన సహకార సంస్థ (GCC) వంటివి అందుబాటులోకి వచ్చి కొంతవరకు మద్దతు ధర అందించినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో రావాల్సిన పూర్తిస్థాయి ఆర్థిక విప్లవం ఇంకా రాలేదు. నేటికీ 70 ఏళ్ల వయసొచ్చిన పసితనం చావని తాతలు, అవ్వలు కొండల్లో కట్టెల మోపులు తలపై పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బతుకీడుస్తున్న దృశ్యాలు మన్యంలో గుండెలను పిండేస్తుంటాయి. మైనింగ్ భయాలు vs ప్రగతి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని బాక్సైట్ నిల్వలను సమర్థవంతంగా, పర్యావరణానికి భంగం వాటిల్లకుండా వినియోగిస్తే అక్కడ అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి. మైనింగ్ అనగానే కేవలం పర్యావరణ విధ్వంసమనో, గిరిజనులను వెళ్లగొడతారనో భయపెట్టే రాజకీయాలే తప్ప... పర్యావరణ పరిరక్షణతో పాటు వారి బతుకుల్లో వెలుగులు నింపేలా ఆలోచించే నాయకత్వం కరువైంది. బాక్సైట్ వంటి రా మెటీరియల్ ఆధారంగా స్థానికంగానే అల్యూమినియం కేబుళ్లు, విండో ప్యానెళ్లు, ఫాయిల్స్ తయారు చేసే సమగ్ర పరిశ్రమలను నెలకొల్పితే, మన గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి అక్కడే ఉపాధి కల్పించవచ్చు. అంతేకాకుండా, మైనింగ్ నిర్వహించే కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (CSR) నిధులతో గిరిజన గూడేలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు నిర్మించవచ్చు. శారీరక కష్టం చేయలేని వయోవృద్ధులకు ప్రతి నెలా గౌరవప్రదమైన పెన్షన్లు అందించే వెసులుబాటు కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణ జల వనరులుమైనింగ్ పూర్తయిన తర్వాత రీఫారెస్టేషన్ (అడవుల పెంపకం) చేయడం ఏర్పడే పెద్ద గుంతలను నీటి నిల్వ జలాశయాలుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చు. గతంలో విజయనగరం ప్రాంతంలో అబాండన్డ్ మ్యాంగనీస్ గనుల్లో పడిఉన్న నీటిని పంపింగ్ చేసి పంట పొలాలకు అందించినట్లే, సరైన ప్రణాళిక ఉంటే మైనింగ్ తర్వాత ఏర్పడే జల వనరులను చుట్టుపక్కల వ్యవసాయానికి, తాగునీటికి వినియోగించుకోవచ్చు. మన్యం బిడ్డలు కేవలం ఎన్నికలప్పుడు వాడుకునే ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదు. అమాయక గిరిజనులకు నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో వివరించి, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే వారిని ప్రగతి బాట పట్టించాల్సిన బాధ్యత మన పాలకులు, సమాజంపై ఉంది. ఆ పచ్చటి కొండల వెనుక దాగివున్న సంపద ఫలితాలు మన్యం గూడేలలోని ప్రతీ ఇంట చిరునవ్వులు పూయించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. AP Bauxite Mining, AP Tribal Development, Agency Area Bauxite Wealth, AP Mineral Resources, Tribal Livelihood AP, Tone News Intellectual Talks, Tribal CSR Funds, Visakhapatnam Agency Bauxite

Publish Date: Aug 10, 2026 8:31PM

political-news-img

తెలుగు మాటలతో వల.. లోన్ పేరుతో బురిడీ.. ఢిల్లీ ఫేక్ కాల్ సెంటర్ల గుట్టురట్టు..!

హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది”.. అంటూ తెలుగులో మధురంగా పలకరింపు. మాటల్లో నమ్మకం కలిగించి.. ఆ తర్వాత ఒక్కో ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి చేతులు దులుపుకోవడం. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ సైబర్ మోసాల దందాకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) చెక్ పెట్టింది. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్ల పై టీజీసీఎస్బీ అధికారులు దాడులు చేసి 21 మంది మహిళా టెలీకాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు. ఈ కాల్ సెంటర్ల వెనుక కీలకంగా వ్యవహరి స్తున్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలిస్తు న్నారు.ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దందాలో తెలుగు మాట్లాడే మహి ళలే ప్రధాన ఆయుధంగా మారారు. తెలంగాణకు చెందిన 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని బాధితులకు ఫోన్లు చేయించేవారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే మహిళలతో ఫోన్ చేయించడం ద్వారా బాధితుల నమ్మకాన్ని సులభంగా పొందేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధు లమంటూ పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లతో వల విసిరేవారు. లోన్ కావా లంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫి కేషన్ ఛార్జీలు, డాక్యుమెం టేషన్ ఫీజు, బీమా ప్రీమియం తదితర రుసుములు చెల్లించా లంటూ నమ్మించి వరుసగా డబ్బులు వసూలు చేసేవారు. బాధితుడు డబ్బులు చెల్లించిన తర్వాత మరింత మొత్తం అడగడం లేదా ఫోన్‌కు స్పందించకుండా తప్పించు కోవడం చేసేవారు. మోసపోయామని గ్రహించి డబ్బులు తిరిగి అడిగిన వారిని కూడా వదిలిపెట్ట లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించడంతో పాటు వ్యక్తిగత వివరాలు, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని హెచ్చరించే వారు. టీజీసీఎస్బీ దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ ముఠాకు తెలంగాణలో నమోదైన 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మూడు కాల్ సెంటర్ల వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ముఠా వెనుక ఉన్న మరిన్ని వివరాలు, ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారు? ఎంత మొత్తం కొల్లగొట్టారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. TGCSB, Lalit Singh, Kuldeep Singh, Anil, Delhi Fake Call Centers, cyber crime case

Publish Date: Aug 10, 2026 7:45PM

political-news-img

మహా వరుణయాగం సంపూర్ణం.. సీఎం రేవంత్‌ దంపతులు ప్రత్యేక పూజలు..!

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య నాగార్జునసాగర్‌లో ఈ యాగాన్ని నిర్వహించారు. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన మహా వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మంత్రి ఉత్తమ్ దంపతులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తున్నామని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యేలా వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరుణదేవుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకోవాలని కోరుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ప్రార్థించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మహా వరుణయాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Maha Varuna Yagam, Varuna Yagam, Rainfall, Telangana Rains, Telangana Government, Nagarjuna Sagar, Vijay Vihar, Krishna River, CM Revanth reddy, Minister Uttam kumar reddy

Publish Date: Aug 10, 2026 6:45PM

MOVIE NEWS