political-news-img

ఓపెన్ ఏఐ సీటీవోగా ఉదయ్ రుద్రరాజు.!

ఓపెన్ ఏఐ సీటీవోగా హైదరాబాద్ టెక్కీ నియమితుడయ్యారు. ఐఐటీ, ఎన్ఐటీ చదివితేనే.. గ్లొబల్ టెక్ దిగ్గజ సంస్థలలో అగ్రపీఠం సాధ్యమనే అపోహలకు ఈ కుర్రోడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. హైదరాబాద్ చైతన్య భారతి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఐబీటీ)లో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది. సీబీఐటీలో సీఎస్ఈ చదువుతూనే ఏడబ్ల్యూఎస్ లో ఇంటర్న్‌షిప్ సాధించి, మిన్నెసోటా వర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈబే, రాబిన్ హుడ్, అలాగే ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఎఎల్ లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఉదయ్ రుద్రరాజు.. 2025 జులైలో ఓపెన్ ఏఐలో చేరి జిపిటి-5.6 వంటి నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. Uday Ruddaraju, OpenAI CTO, CBIT Hyderabad, GPT 5.6, xAI Infrastructure, Indian Tech Leaders

Publish Date: Jul 20, 2026 6:42PM

political-news-img

అయోధ్యవిరాళాల చోరీ కేసులో రాజకీయ జోక్యంపై సుప్రీం అసహనం.!

అయోధ్య రామమందిర విరాళాల చోరీ వివాదంపై సీబీఐ దర్యాప్తు లేదా కాగ్ (CAG) ఆడిట్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం (జులై 20) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావంటూ.. పిటిషనర్లకు, రాజకీయ పక్షాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోయేలా, నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేలా చూడడమే తమ పరిధి అని వెల్లడించింది. ఇదలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తును కేవలం స్థానిక పోలీసులకే పరిమితం చేయకుండా, పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక అక్రమాలను ఛేదించడంలో అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) పునర్వ్యవస్థీకరించాలని యూపీ సర్కార్ ను ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు ఐజీ రేంజ్ స్థాయి అధికారిని ఈ సిట్‌లో నియమించాలని సూచించింది. Ayodhya Ram Mandir, Donation Theft Case, Supreme Court Status Report, Shri Ram Janmabhoomi Trust, SIT Probe

Publish Date: Jul 20, 2026 6:30PM

political-news-img

ఏపీ చేజార్చుకున్న గోల్డెన్ ఆపర్చునిటీ

తెలుగు పారిశ్రామిక రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన అమర రాజా బ్యాటరీస్ ప్రస్థానం రెండు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా నుంచి మాతృభూమిపై ఉన్న ప్రేమతో తిరిగి వచ్చిన రామచంద్ర నాయుడు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఈ భారీ పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి. రామారావు పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై భూములు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాణం పోశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన వేలాది మంది మహిళలకు స్వయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అమర రాజా ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక విప్లవానికి అప్పట్లోనే తెరలేపింది. అయితే జగన్ హయాంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తన విస్తరణను తెలంగాణ వైపు మళ్లించాల్సి వచ్చింది. అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు. మరోవైపు, ఐటీ, హెవీ ఇండస్ట్రీ రంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, సాఫ్ట్‌వేర్ కంపెనీల మాదిరిగా ప్రతికూల పరిస్థితులు రాగానే లాజిస్టిక్స్‌ను సులభంగా తరలించడం భారీ తయారీ రంగానికి ఏ మంత సులభం కాదు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా సంస్థ ప్రపంచ స్థాయి గిగా ఫ్యాక్టరీ, భారీ బ్యాటరీ తయారీ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆధునిక ప్లాంట్ ప్రారంభోత్సవం తెలంగాణ అభివృద్ధి పథంలో మరొక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. గ్లోబల్ టెక్నాలజీని స్థానిక ఉద్యోగావకాశాలతో సమన్వయం చేస్తూ వేలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందించే దిశగా అమర రాజా అడుగులు వేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గతంలో అమర రాజా విషయంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాష్ట్రం తరఫున పారిశ్రామికవేత్తలకు సానుకూల సందేశాన్ని ఇచ్చారు. పరిశ్రమలకు ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భవిష్యత్తులో అమర రాజా మళ్లీ తమ సొంత రాష్ట్రంలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, మళ్లీ కొత్త కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతోందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒక సంస్థ పుట్టుక నుంచి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించిన ప్రభావం, ఆర్థిక ప్రగతి పరిణామాలు పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. అటువంటి అమరరాజా విషయంలో కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ ఆడిన క్రూర క్రీడ వల్లే ఏపీ అమరరాజా ఏపీకి దూరం అయ్యిందని సువేరా ఆవేదన వ్యక్తం చేశారు. Amara Raja Batteries, Divitipally Giga Factory, Amara Raja AP to Telangana, Ramachandra Galla, Revanth Reddy Amara Raja, Nara Lokesh Industrial Policy

Publish Date: Jul 20, 2026 5:46PM

political-news-img

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగింది? ఏం జరుగుతోంది?

తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్ నిన్న మొన్నటి వరకూ ఒక సెలబ్రిటీగా మీడియా, యువత గొప్పగా చెప్పిన ఉదయ్ కృష్ణారెడ్డి.. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సస్పెండ్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ ఆయనను పెంచి పెద్ద చేసింది. అత్యంత పేదరికంలో పెరిగిన ఉదయ్, 2013లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఒక సీఐ ద్వారా ఎదురైన తీవ్ర అవమానమే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఎలాగైనా అంతకంటే ఉన్నతమైన సివిల్ సర్వెంట్‌గా మారాలనే దృఢ సంకల్పంతో 2018వ సంవత్సరంలో తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సాధన చేసి ఐపీఎస్ సాధించారు. అటువంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడి నేపథ్యం గురించి తెలుగువన్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ అనలిస్ట్ కందుల రమేష్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ఉదయ్ కృష్ణారెడ్డి.. ఐపీఎస్ సాధించడానికి చేసిన ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం చదువు కావడంతో మొదటి మూడు ప్రయత్నాలలో ఉదయ్ కృష్ణారెడ్డికి నిరాశే ఎదురైంది. నాలుగో ప్రయత్నంలో వేరే సర్వీస్ వచ్చినప్పటికీ.. ఆశించిన ఐపీఎస్ మాత్రం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా.. రోజుకు 10 నుండి 12 గంటల పాటు కష్టపడి చదివి, ఐదో ప్రయత్నంలో ఆల్ ఇండియా 365వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ కావాలని కన్న కలలను సాకారం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతున్నారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో, ఆయన జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటకకు చెందిన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. తనను గదిలో బంధించి, కత్తితో బెదిరించాడని, లైంగికంగా వేధించాడని, ప్రైవసీకి భంగం కలిగించాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై సెక్షన్ 74, 75, 77 (వైరిజం), 78 (స్టాకింగ్), 79, 127(2) (అక్రమ బంధనం), 115(2), 351(2) తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E మరియు 67A కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీస్ అకాడమీలో పని ప్రదేశాల్లో మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఉన్నప్పటికీ, ఫిర్యాదులో తీవ్రమైన క్రిమినల్ అంశాలు ఉండటంతో ఈ కేసు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక ఆదర్శవంతమైన ప్రేరణాత్మక కథగా నిలిచిన యువ ఐపీఎస్ అధికారి ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం, ఆత్మహత్యా యత్నం చేసి ఆస్పత్రి పాలవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. Uday Krishna Reddy IPS, Trainee IPS Officer, NPA Hyderabad, Attapur Police Case, Uday Krishna Reddy Suicide Attempt

Publish Date: Jul 20, 2026 4:27PM

political-news-img

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరగదు : సీఎం చంద్రబాబు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు) ఏర్పాటు చేస్తున్నామని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ... పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా సేవలు మరింత సులభతరం అవుతాయని, ప్రజల్లో అపోహలు తొలగించే బాధ్యత అధికారులదేనని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. దీపం-2.0 లబ్ధిదారులకు సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని పౌర సరఫరాల, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో లిటిగెంట్ పిటిషనర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రజా ప్రయోజనం లేకుండా వరుసగా ఫిర్యాదులు చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం ఉన్న ఫిర్యాదులను మాత్రమే ప్రాధాన్యంతో పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం 49 శాతం లోటుగా ఉందని పేర్కొన్న సీఎం... రైతులను డ్రై క్రాప్స్ వైపు ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీబీజీ–రామ్‌జీ, జలధార పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రజాభిప్రాయాలను నిరంతరం తెలుసుకుంటూ పరిపాలనను మెరుగుపరచాలని, సమస్యలు తలెత్తిన తర్వాత కాకుండా ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు Sub-Registrar Offices, No Privatization, False Propaganda, RSC, Citizen-Centric Services, Passport Seva Kendra Model, Easier Registration Process,Document Writers, RTGS Review CM N. Chandrababu Naidu, Litigant Petitioners

Publish Date: Jul 20, 2026 4:26PM

political-news-img

ఆక్వా, పొగాకు రంగాలకు కేంద్రం చేయూత ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. రొయ్యల మేత తయారీకి అవసరమైన జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి, అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, ఫిష్ మీల్ ఎగుమతులను క్రమబద్ధీకరించడం, ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు, ఆక్వా ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గింపు వంటి పలు కీలక అంశాలను లేఖల్లో ప్రస్తావించారు. కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు రాసిన లేఖలో రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో మేత తయారీ వ్యయం పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం వివరించారు. దేశీయంగా ముడిసరుకు కొరతను అధిగమించేందుకు జన్యుమార్పిడి చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లో కూడా పరిమిత స్థాయిలో ఇలాంటి అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దిగుమతుల వల్ల జీవ వైవిధ్యానికి లేదా దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని, నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి రావడంతో ఉత్పత్తి వ్యయం తగ్గి లక్షలాది మంది రైతులు, కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈక్వెడార్ నుంచి పెరిగిన రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల కారణంగా అమెరికా, చైనా, యూరప్ వంటి మార్కెట్లలో భారతీయ రొయ్యలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయని కూడా వివరించారు. ఆక్వా రంగ అభివృద్ధికి అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో కోరారు. జూన్ 5న విశాఖపట్నంలో జరిగిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో ఇచ్చిన హామీ మేరకు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. అక్కడ ప్రాంతీయ కార్యాలయం, శిక్షణా కేంద్రం, అక్వేరియం, ప్రజల సందర్శన కోసం పార్కును ఏర్పాటు చేసి 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో ఫిష్ మీల్ ఎగుమతులను డీజీఎఫ్‌టీఏ ద్వారా క్రమబద్ధీకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల దేశీయ రొయ్యల ఫీడ్ తయారీదారులు అధిక ధరలకు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. దేశీయ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతే ఫిష్ మీల్ ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రాసెస్ చేయని ఎఫ్‌సీవీ పొగాకును రోడ్‌టెప్ (RoDTEP) పథకం పరిధిలోకి తీసుకువచ్చి ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. జింబాబ్వే, టాంజానియా వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు రాయితీలు కల్పిస్తుండగా భారతీయ ఎగుమతిదారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఆక్వా ఏరియేటర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఆక్వా రైతులకు రూ.5 లక్షల వరకు వన్‌టైమ్ టాప్-అప్ రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. దేశీయ మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు అందించి రొయ్యల ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేయని పొగాకు (హెచ్‌ఎస్‌ఎన్ కోడ్–2401)పై ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరారు. జీఎస్టీ భారం తగ్గితే రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గి ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి తన లేఖల్లో పేర్కొన్నారు

Publish Date: Jul 20, 2026 4:16PM

MOVIE NEWS