జిల్లాల పర్యటన ముగించుకుని వారం తరువాత అమరావతి చేరుకున్న చంద్రబాబు.!

Publish Date:Jul 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వారం రోజుల జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు నాలుగు జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసిన చంద్రబాబునాయుడు.. ఈ సందర్భంగా  పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే  వేల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులకు అంకురార్పణ చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సీబీఎన్ సాగించిన ఈ పర్యటన..  క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు  తెలుసుకుంటూనే..  రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే  పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

ఈ  పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలో  పేదల సేవలో కార్యక్రమంలో  పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో త్వరలోనే భారీ మెగా ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన ఆయన అలాగే..  దశాబ్దాలుగా నలుగుతున్న వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక తిరుపతి జిల్లా సత్యవేడులో పర్యటించి..  ప్రఖ్యాత హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు  శంకుస్థాపన చేశారు.

 రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ పథకం వీబీ జీ రామ్ జీ ని ఘనంగా ప్రారంభించారు. తిరుపతిలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొని, భవిష్యత్ పాలనలో డేటా అనలిటిక్స్,  డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు.

ఇక కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో   రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.  

చివరిగా  తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు బస చేసిన చంద్రబాబు..  స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' కార్యక్రమంలో  9 వేల 322 కోట్ల విలువైన 30కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో గ్లోబల్ బ్రాండ్ అడిడాస్ ఫుట్‌వేర్,  నుంచి పారిశ్రామిక విమానాల తయారీ ప్రాజెక్టు వరకు  భిన్న  పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 40 వేల  మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.  అలాగే.. 118 కోట్ల రూపాయలతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా.. ఆరు దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న కంగుంది భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేశారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు.  

AP CM District Tour, Swarna Kuppam Investments, JSW Rayalaseema Steel Plant, AP Economic Regions, Andhra Pradesh News

By
en-us Political News

  
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో  25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.