వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో యలమంచిలి రవి!

Publish Date:Apr 26, 2012

Advertisement

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి రవి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయనాయకునిగా కాకుండా రైతువారి పద్ధతిలో వుండే రవి అంటే ప్రజలలో మంచి గుర్తింపు వుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసి రవి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి మాజీ ఎంపి గద్దె రామమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ (రాజశేఖర్)లను ఓడించారు.

 

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటం వల్ల మాజీ మంత్రి దేవినేని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వున్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన నేపథ్యంలో యలమంచిలి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం నియోజకవర్గంలో శాసనసభ్యుడే ఇన్ ఛార్జిగా వుంటారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించే ప్రభుత్వపరమైన సమీక్షా సమావేశాల సందర్భంగా, పిసిసి అధ్యక్షులు బొత్స నిర్వహించే సమీక్షాసమావేశాల సందర్భంగా తూర్పు నియోజకవర్గం తనపై ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూను కూడా ఆహ్వానించడాన్ని తనకు అవమానంగా భావిస్తున్నారు.

 

 

వాస్తవంలో కూడా ప్రభుత్వం యలమంచిలి పట్ల సవితి ప్రేమనే చూపిస్తోందనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థితిలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీనుంచి యలమంచిలికి ఆహ్వానం లభించినట్టు తెలిసింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన వంగవీటి రాధా ఇటీవల వరకు విజయవాడ సెంట్రల్ నుంచి కాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే భావనలో వున్నారు. కాని రాధా 2014 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి కాకుండా సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

 

 

 

ఈ స్థితిలో యలమంచిలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరితే మరల 2014నుచి కూడా విజయవాడ తూర్పు నుంచే పోటీ చేయవచ్చునని ఆయనకు వివరించినట్టు తెలిసింది. యలమంచిలికి దేవినేని నెహ్రూతో ఎంతోకాలం రాజకీయవైరం వుంది. తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ లో వుంటూ నెహ్రూతో వున్న వైరంతో ఇబ్బంది పడేకంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమమనే నిర్ణయానికి యలమంచిలి వచ్చినట్టు తెలిసింది.

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.