మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాల చోరీ.. నలుగురు అరెస్ట్..!

Publish Date:Sep 11, 2026

Advertisement

చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?

హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ కేసులో మద్రాస్ రెజిమెంట్ నుంచి రిటైర్ అయిన ఓ ఆర్మీ అధికారి కీలక సూత్రధారిగా ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. చోరీకి సంబంధించిన ఆయుధాలను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఆర్మీ అధికారి నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ విశ్రాంత ఆర్మీ అధికారి పాత్రపై దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ చోరీ సాధారణ దొంగతనం కాదన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. మద్రాస్ రెజిమెంట్‌లోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఆయుధాలు బయటకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌చార్జి సహకారంతోనే ఆయుధాల చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సైనికులకు బుల్లెట్లు అందించే అమ్యునిషన్ సెక్షన్ ఇన్‌చార్జి కూడా ఈ వ్యవహారంలో సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అంటే.. రెజిమెంట్‌లోని ఆయుధాల నిల్వ, వాటి కదలికలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతోనే ఈ చోరీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి సూత్రధారిగా వ్యవహరించగా.. రెజిమెంట్‌లోని కొందరి సహకారంతో ఆయుధాలు బయటకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా?  వాటిని ఎవరికి విక్రయిం చేందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతున్నది. 

ఈ కేసులో నలుగురు పట్టుబడటంతో దర్యా ప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బొల్లారం నుంచి ప్రారంభమైన ఈ ఆయుధాల చోరీ కేసు.. ఇప్పుడు మహబూబ్‌ నగర్, నాగర్‌కర్నూల్ వరకు విస్తరించడం, రిటైర్డ్ ఆర్మీ అధికారి పేరు తెరపైకి రావడం, అంతేకాకుండా రెజిమెంట్‌లోని కీలక విభాగాల సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు రావడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది.

 

 

[ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన వ్యవహారం హైదరాబాద్ సచివాలయంలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.