ఢిల్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

Publish Date:Sep 10, 2026

Advertisement

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీ, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి ఢిల్లీకి బయలుదేరారు. మొన్న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు.

అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా కలిసి అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు బయల్దేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

[ BRS MLAs leave for Delhi, Sunitha Lakshma Reddy, Sabitha Indra Reddy, Kova Lakshmi, Jagadish Reddy, Palla Rajeshwar Reddy, BRS Party, KCR, KTR, CM Revanth reddy ]

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన వ్యవహారం హైదరాబాద్ సచివాలయంలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.