తుమ్మల రాజీనామా తెదేపాకు మేల్కొలుపు?

Publish Date:Aug 30, 2014

Advertisement

 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన తుమ్మల నాగేశ్వరరావు నిన్నపార్టీకి రాజీనామా చేయడంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీ తెలంగాణా నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు. అటువంటి సమర్దుడయిన సీనియర్ నేతను పోగొట్టుకోవడం తెదేపాకు చాలా నష్టం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన పార్టీ వీడకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయిన తెదేపా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. ‘తెదేపా నాయకుల మీద కాక కార్యకర్తల అండతోనే బలంగా ఉందని, ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకొంటామని’ అని చెప్పుకొంది. అయితే ఇదివరకు కడియం శ్రీహరి, దాడి వీరభద్ర రావు వంటి సీనియర్ నేతలు పార్టీని వీడినప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా స్పందించింది తప్ప వారి స్థానాలలో మళ్ళీ అంతటి సమర్దులయిన నాయకులను ఏర్పాటు చేసుకోవడంలో అశ్రద్ధ వహించిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః ఇప్పుడు కూడా అదే ఉదాసీనత కనబరచవచ్చును.

 

పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నపుడు, ఆంధ్రాలో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు ఎంతో జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడిన తరువాత పార్టీ నుండి నేతలు ఒకరొకరుగా జారిపోకుండా జాగ్రత్తపడలేక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, ఆయన పని ఒత్తిడి కారణంగా ఇదివరకులా పార్టీ తెలంగాణా శాఖపై దృష్టి పెట్టలేకపోవడం వలననే ఈవిధంగా జరుగుతోందని భావించవచ్చును.

 

అసలు తెలంగాణాలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు అధికార తెరాస పంచన ఎందుకు చేరుతున్నారు? అనే ప్రశ్నకు జవాబు అందులోనే కనబడుతుంది. రాజకీయ నేతలందరూ తాము కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి ఉన్నామని ఎన్ని కధలు చెప్పినా వారి లక్ష్యం అధికారం, పదవులు చెప్పట్టడమేననేది ఎవరికీ తెలియని విషయం కాదు. అందుకు తుమ్మల కూడా మినహాయింపు కాదు. అందుకే ఆయన కేసీఆర్ మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేసుకొని గోడ దూకేసారని వార్తలు వినిపిస్తున్నాయి. తుమ్మలను పార్టీలోకి ఆకర్షించి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న తెరాసను బలోపేతం చేసుకోవాలని తెరాస అధ్యక్షుడి ఆలోచన కావచ్చును. వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణాలో తెదేపాను ఖాళీ చేసేస్తామని తెరాస నేతలు చెప్పిన మాట తెదేపా అధిష్టానం సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. కానీ తెరాస మాత్రం సీరియస్ గానే చెప్పిందని తుమ్మల రాజీనామా రుజువు చేసింది.

 

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో తలమునకలవక ముందే తెలంగాణాకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షుడిని, పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారిలో ఐఖ్యత, సమన్వయం లోపించడంతో పార్టీలో నేతలందరూ ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తరువాత ఒక్క మహానాడు సమావేశంలో తప్ప ఆ తరువాత పార్టీ నేతలందరూ ఒక్క వేదికపైకి వచ్చి గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పవచ్చును. తెదేపా-తెలంగాణా నేతలందరూ మంచి రాజకీయ అనుభవజ్ఞులే కానీ వారిలో ఐఖ్యత లోపించడంతో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. దీనితో పార్టీలో చాల స్తబ్ధత, నిరుత్సాహ వాతావరణం నెలకొని ఉంది.

 

ఇటువంటి సమయంలో వారందరికీ పార్టీ అధినేత అండదండలు, ప్రోత్సాహం, మార్గదర్శనం, వారి భవిష్యత్ కు భరోసా చాలా అవసరం ఉంది. కానీ అదే వారికి దొరకడంలేదని చెప్పవచ్చును. తెదేపా పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను చైతన్యంగా ముందుకు నడిపిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఏవిధంగా ముందుకు నడిపించారో ఇప్పుడు కూడా అదేవిధంగా చేయగలిగితే బహుశః ఇటువంటి పరిస్థితి తలెత్తదు. కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక క్లిష్టమయిన బాధ్యతలు తలకెత్తుకొన్న చంద్రబాబు నాయుడు, తన తెలంగాణ శాఖపై ఇది వరకులా దృష్టి పెట్టగలరా? లేదా? లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేస్తారు? అవి ఎంతవరకు ఫలిస్తాయి? అనే దానిపైనే పార్టీ మరియు నేతల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.