బొద్దింకల పార్టీ అధినేతకి ఎన్డీయే ఆఫర్.. ప్రలోభాల పర్వం మొదలైనట్లేనా?
Publish Date:Aug 18, 2026
Advertisement
కేంద్రంలోని మోడీ సర్కార్ మెడలు వంచి.. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించేలా చేసిన బొద్దింకల పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ) అధినేత అభిజిత్ దీప్కేకి ఇప్పుడు ఎన్డీయే గాలం వేస్తోంది. అంబేడ్కర్ పేరు చెప్పి.. కలిసి సాగుదాం రమ్మని ఆహ్వానం పలుకుతోందా? అంటే తాజాగా రిపబ్లికల్ పార్టీఆఫ్ ఇండియా(ఏ) అధినేత రామదాస్ అధవాలే మాటలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కేకు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షమైన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే బంపర్ పొలిటికల్ ఆఫర్ ఇచ్చారు. బీహార్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పిఐ(ఎలో చేరాలని బహిరంగ ఆహ్వానం పలికారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మరియు విద్యా శాఖల పరిధిలో సాగిన విద్యార్థుల భారీ ఆందోళనల్లో అభిజీత్ దీప్కే కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పోరాటం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది. అభిజిత్ దీప్కే , రాజకీయ పార్టీలపై, ప్రస్తుత ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని బలంగా నమ్ముతున్నారు.బాహాటంగా చాటుతున్నారు. అటువంటి ఉద్యమ కారుడికి రామ్ దాస్ అధవాలే తమ పార్టీలోకి ఆహ్వానించడం సంచలనంగా మారింది. గత నెల 30న అభిజీత్ దీప్కే తానను బీజేపీలో చేరాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. తనపైనే కాకుండా, తన కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. ఆ తర్వాత ఆగస్టు 2న, సూరత్కు చెందిన ఒక ఆర్టిఐ కార్యకర్త అభిజీత్ విదేశీ విద్యార్హతలు, ఎడ్యుకేషన్ లోన్, ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన అభిజీత్ దీప్కే.. , ఆగస్టు 3న తన రుణ పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన విద్యార్హతల డిగ్రీని బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రావడంపై అభిజీత్ దీప్కే స్పష్టమైన వైఖరి చాటుతున్నారు. కాక్రోచ్ జనతాపార్టీ.. ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందని, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే ప్రజా గొంతుకగా ఉంటుందని విస్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన సొంత గ్రామం నుంచి "స్కూల్ థీక్ కరో" ప్రచారాన్ని ప్రారంభించి, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై పరిమితి వంటి సమస్యలపై పోరాడుతున్నారు. పాలక పక్షంలో చేరి ప్రజల కోసం పనిచేయాలని రామ్దాస్ అథావలే ఆహ్వానాన్ని ఒత్తిడుల నుంచి ఎన్డీయే ప్రలోభాలకు దిగడంగా అభివర్ణిస్తున్నారు. Abhijeet Dipke, CJP Founder, Ramdas Athawale, NDA Offer, RPI A, School Thik Karo Campaign
http://www.teluguone.com/news/content/abhijeet-dipke-45-229202.html




