తెలంగాణ సీఎం మార్పు?

Publish Date:Aug 22, 2026

Advertisement

తెలంగాణ అధికార కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా ఆలపిస్తున్న అసమ్మతి రాగాలూ.. సీఎం మార్పుదిశగా పడుతున్న అడుగులకు సంకేతాలంటూ రాజకీయవర్గాలలో చర్చ ఆరంభమైంది.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ సీనియర్ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి పట్ల  సొంత పార్టీలో కొందరు సీనియర్లు, మంత్రులూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.   రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గం ఆయనను పదవి నుంచి తప్పించేందుకు అధిష్ఠానం వద్ద తీవ్రస్థాయిలో పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను  సీనియ నాయకుడు బాహాటంగానే  బహిరంగంగానే ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులలో  కూడా అయోమయానికి కారణమౌతోంది.

గతంలో కూడా రేవంత్ రెడ్డి శైలిపై అసమ్మతి వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం వ్యక్తమౌతున్నంత స్థాయిలో లేదని అంటున్నారు.  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పట్ల వ్యక్తమౌతున్న అసంతృప్తి, అసమ్మతి.. అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిందంటున్నారు. 

మరో వైపుబిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు  రేవంత్ రెడ్డి సోదరులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ చేస్తున్న ఆరోపణలు విమర్శలూ కూడా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.   ప్రస్తుత పరిస్థితిని కర్నాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యపై ఒకే సమయంలో చుట్టుముట్టిన విమర్శలు, ఆరోపణలతో తెలంగాణలో రేవంత్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను పోలుస్తున్నారుర పరిశీలకులు.  సిద్దరామయ్యకు లాగా రేవంత్  పదవికి   ఈ ఆరోపణలు, విమర్శలుఇది ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయంటున్నారు. 

కాగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటి అగ్రనేతలతో  కూడా రేవంత్ రెడ్డికి విభేదాలు పొడసూపాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మమేష్ కుమార్ గౌడ్, భట్టిలు నిరంతరం కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదంపులు జరుపుతున్నారంటున్నారు.  ఈ నేపథ్యంలోనే పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.  మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్   రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఏ మంత సంతృప్తిగా లేదన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, హైకమాండ్ రేవంత్ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నదనడానికి సంకేతంగా చెబుతున్నారు.  ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ..  సొంత పార్టీలోని నాయకుల అసంతృప్తి, ప్రతిపక్షాల   ఆరోపణల నడుమ తెలంగాణలో పొలిటికల్ హీట్  ఓ రేంజ్ లో పెరిగిందనడం మాత్రం వాస్తవం. 

Telangana political heat, Revanth Reddy news, Telangana Politics,Telangana Congress Dissidence, KTR Allegation,  Konda  Comments Telangana CM Change Rumors

By
en-us Political News

  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.