లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.. జగన్ సంగతేంటి?

Publish Date:Aug 17, 2026

Advertisement

ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టినా.. మండిలిలో ఆ పార్టీ సభ్యులు హాజరయ్యారు.   ఈ క్రమంలో రాష్ట్రంలో  మెగా డీఎస్సీ-2025 నిర్వహణ, ఫలితాలు, వైసీపీ విమర్శలు, ఆరోపణలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.  అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ, పరీక్షల నిర్వహణ, ర్యాంకింగ్ విధానం, క్రీడల కోటా కేటాయింపులపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.  అర్హులైన అభ్యర్థులకు  అన్యాయం జరిగే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. 

 మండలిలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సాంకేతిక సందేహాలకు సాంకేతిక ఆధారాలతోనే సమాధానం ఇచ్చారు.   ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోందని, నిరుద్యోగుల్లో అనవసర అయోమయాన్ని సృష్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

అదే సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరును దుయ్యబట్టారు.  అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడే ధైర్యం లేక జగన్ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ లేదా ఇతర అభివృద్ధి, సంక్షేమ అంశాలపై నిజంగా చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే అసెంబ్లీ వేదికగా ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాకులు చెబుతూ సభను బహిష్కరించి పారిపోవడం  ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. 

వైసీపీ  హయాంలో నిరుద్యోగులను ఏ విధంగా వంచించారో ప్రజలందరికీ తెలుసని   లోకేష్ విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో  ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటన చేసి, రికార్డు స్థాయిలో పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అభ్యర్థులకు త్వరితగతిన నియామక పత్రాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ ఉద్ఘాటించారు.  

సభావేదికగా లోకేష్ మోగా డీఎస్సీ విషయంలో వైసీపీ ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టారు. అదే సమయంలో జగన్ కు సవాల్ విసిరారు. లోకేష్ డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీ తనంపై క్లారిటీ ఇచ్చారు. ఇక మిగిలింది జగన్.. ఆయన సభకు హాజరై గళమెత్తుతారా?  లేక ఇదే పలాయన వాదంతో సభకు ఆవల విమర్శలకు పరిమితమౌతారా తేల్చుకోవాలి. 

Nara Lokesh,  Jagan, MegaDSC,  AP Legislative Council, AP Assembly Sessions, Clarity, Challange

By
en-us Political News

  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.