తిరుపతిలో ఎన్నికల ప్రచారం చాలా హాట్ గురూ ...

Publish Date:May 15, 2012

Advertisement

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలతో వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాకతో తారాస్థాయికి చేరిన ప్రచారం ఘాటైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే దిశగా సాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు ఎవరికీ తీసిపోని స్థాయిలో ఒకరిపై ఒకరు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఘాటైన పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నాయి.

 

 

సిఎం కిరణ్ ను, పీసీసీ చీఫ్ బోత్సాని, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు మంటెక్కే మాటల తూటాలతో విమర్శించారు. ఈ విమర్శల్లో జగన్ ను నేరరాజకీయా చరిత్ర ఉన్న నేతగా చూపేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కృషి చేశాయి. అలానే సిఎం కిరణ్ కు జగన్ కు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయనీ, అందుకే జగన్ ను మాటలతోనే విమర్శిస్తున్నారానీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.

 

 

సామాజిక న్యాయం పేరిట ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీకి తాకట్టుపెట్టిన చిరంజీవి తిరుపతి కోసం చేసిందేమీ లేదనీ ఆయన అంటున్నారు. గాంధీభవన్ ను బ్రాందీభవన్ గా మార్చిన ఘనుడు బొత్సా అంటూ ఆయనకు గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ లిక్కర్ డాన్ పాత్ర ఉందని ముద్దు తన మాటల తూటాలను వదిలారు. ఈయనతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి కూడా అసలు చిరంజీవికి మానవత్వమే లేదన్నారు. దీనికి ముందు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ తిరుపతిలో చదలవాడను గెలిపిస్తే అస్సలు అందుబాటులో ఉండే సమస్యే లేదన్నారు. జగన్ ఎంతకైనా తెగిస్తాడని సిఎం కిరణ్ తిరుపతి ఓటర్లను హెచ్చరించారు.

 

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను నమ్మరాదన్నారు. వారిద్దరి వల్లే తిరుపతి అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. రోజుకో ఘాటైన విమర్శలతో తమకు ఇక రేపే ఎన్నికలన్నట్లు వాతావరణం కనిపిస్తోందని ఓటర్లు అంటున్నారు. కాంగ్రెస్ నేతలే కాకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మరికొందరు నేతలు అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్, లక్ష్మీపార్వతి తదితరులు పర్యటనలు పూర్తయినందున ఎన్నికల వేడి తమను తాకుతోందని వారు తెలిపారు. కొత్త కొత్త విమర్శలకు పార్టీలు కసరత్తులు చేస్తున్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరేమంటారో అన్న ఆసక్తి నియోజకవర్గంలో నెలకొందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.