తెలంగాణలో ‘కౌరవ సభ’.. అసెంబ్లీలో రగడకు అసలు కారణమేంటి..?

Publish Date:Sep 12, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న దూకుడు.. అసెంబ్లీ వేదికగా సాగుతున్న మాటల యుద్ధంపై టోన్ న్యూస్  ప్రత్యేక చర్చ జరిగింది. రాజకీయ విమర్శలు క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గతంలో అసెంబ్లీ చర్చలు ఎలా ఉండేవి.. ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోయాయన్న అంశంపైనా విశ్లేషణ జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జైపాల్‌రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల హయాంలో శాసనసభ చర్చలు ప్రధానంగా విధానాలు, ప్రజా సమస్యలు, అంశాల ఆధారంగా సాగేవని గుర్తుచేశారు. భాషలో సంస్కారం, చర్చల్లో హుందాతనం కనిపించేవని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు, పరస్పర దూషణలు పెరిగిపోతున్నాయని విశ్లేషించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలోనే రాజకీయ రగడకు ప్రాధాన్యత పెరగడం ఆందోళన కలిగించే పరిణామమన్న అభిప్రాయం వ్యక్తమైంది.

అంతేకాదు.. అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వీధుల్లోకి వచ్చి పోరాటాలకు సిద్ధమవడం కూడా చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినా.. వాటిని శాసనసభలోనే చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న భాష, పెరుగుతున్న అగ్రెసివ్‌ పాలిటిక్స్‌.. అసెంబ్లీ చర్చల తీరుపై ఆసక్తికరమైన విశ్లేషణ జరిగింది.

 

 

 

 

[ Telangana Politics, Telangana Assembly, KCR, Revanth Reddy, Telangana Assembly Ruckus, KCR vs Revanth Reddy, Telangana Political Crisis, Assembly Debate, Telangana Political War, Telangana Politics ]

By
en-us Political News

  
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
వంద రోజుల్లో హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ వ్యంగ్యాస్త్రాలు..!
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.