మైసూరాతో జగన్ మంతనాలు

Publish Date:May 1, 2012

Advertisement

కడపజిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశంపార్టీకి పెద్దదిక్కుగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు మైసూరారెడ్డితో జగన్ ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైసూరారెడ్డి వై.ఎస్. హయాంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత రెండేళ్ళుగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనటం లేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు కోసం ఆయన ప్రయత్నిచి విఫలమయ్యారు. దీంతో ఆయనలో అసంతృప్తి మరికాస్త పెరిగింది.

 

 

ఈ విషయాన్ని గమనించిన జగన్ మైసూరారేడ్డితో ఇటీవల టెలిఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. తమ పార్టీలో వస్తే భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉన్న పదవి ఇస్తానని మైసూరాకు జగన్ వాగ్దానం చేసినట్లు తెలిసింది. పాట విషయానాలు మరిచిపోయి తమ పార్టీలో చేరాలని జగన్ కోరినట్లు తెలియవచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా కమలాపురం, పెద్దచెట్ పల్లి ఆలయ ఆవరణలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందుకు మైసూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, మైసూరారేడ్డితో కొద్దిసేపు మంతనాలు జరిపారు. వీరిద్దరి కలయిక జిల్లాలో చర్చలకు దారితీసింది.

By
en-us Political News

  
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.