హరీష్ రావు తీరును తప్పు పట్టిన స్పీకర్!
Publish Date:Sep 8, 2026
Advertisement
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు మంగళవారం (సెప్టెంబర్ 8) వాడీవేడి వాదనలతో మొదలైంది. సభ మొదలైన క్షణం నుంచే నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తొలి రోజు అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలు, ఆందోళనలు సభలో మాటల మంటలకు దారి తీశాయి. మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, సునీత చీర లాగడం మరియు సబితా ఇంద్రారెడ్డి మెడ పట్టుకోవడం వంటి ఘటనలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాతా మధు ఇప్పటికే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ, ఆయనను అరెస్ట్ చేయడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ఎమ్మెల్యేలంటే సభకు ఎంత గౌరవం ఉందో తనకూ అంతే గౌరవం అని చెప్పిన ఆయన ఈ ఘటనలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన వెంటనే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభలో హరీష్ రావు వ్యవహరిస్తున్న తీరును, ఆయన ఆవేశాన్ని స్పీకర్ తప్పుబట్టారు. సభలో అనవసరమైన ఆవేశం ప్రదర్శిస్తున్నారంటూ హరీష్ రావును ఆయన నేరుగా తప్పుపట్టారు. నిజానికి తన కన్నతల్లిని దూషించినప్పుడు తనకు ఆవేశం రావాలి కానీ, అసలు సంబంధం లేని విషయాలపై ఎందుకంతగా ఆవేశపడుతున్నావంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హరీష్ ను నిలదీశారు. తన తల్లిని దూషించిన దానికి హరీష్ రావు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ దశలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు. అదలా ఉంటే హరీష్ రావు సభలో స్పీకర్ను బెదిరించేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. [War Of Words B etween ruling and opposition Mmembers, Telangana Assembly, Speaker Gaddam Prasad, Harish Rao, BRS, Congress, Sridhar Babu, Telangana Poliyics, Telugu One]
http://www.teluguone.com/news/content/war-of-words--b-etween-ruling-and-opposition-mmembers-24-230952.html





