జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్...!

Publish Date:Sep 8, 2026

Advertisement

గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!

మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టుల నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని   జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు భారీగా పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలివచ్చాయి. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించిన కార్యకర్తలు.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను బీఆర్‌ఎస్‌ నాయకులు దగ్ధం చేశారు. దీనికి పోటీగా కాంగ్రెస్‌ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్రమంగా తోపులాటకు దారితీసింది. 

పరిస్థితి అదుపుతప్పడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం చెప్పులు, కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

(High tension at Jawaharnagar police station, BRS Party, KCR, KTR, Congress Party, Gajwel, Siddipet district, CM Revanth reddy, Telugu News, Telugu One) 


 

By
en-us Political News

  
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.