ఆయనకు తిక్కుంది... దాని వెనుక అర్థం కాని లెక్కుంది!

Publish Date:Feb 13, 2017

Advertisement

 

సుబ్రమణియన్ స్వామి... ఈయన పేరు చెబితే దాదాపు అన్ని పార్టీల వారు భయపడిపోతారు! అలా భయపడే వారి లిస్ట్ లో ఆయన స్వంత పార్టీ బీజేపి నేతలు కూడా వుంటారు! స్వామివారికి ఆగ్రహం వస్తే ఎంతటి వారిపైనైనా స్వారీ చేసేస్తారు! సుబ్బుతో పెట్టుకుంటే సబ్బు పెట్టి కడిగేస్తాడని ప్రతీతి!

 

తమిళనాడులో జరుగుతోన్న రాజకీయ జల్లికట్టులో బీజేపి పార్టీదీ, కేంద్ర ప్రభుత్వానిది, ఒక విధంగా .. మోదీది మద్దతు ఎవరికో అందరికీ తెలిసిందే! పన్నీర్ కే పట్టం కట్టాలని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, సుబ్రమణియన్ స్వామి మాత్రం రివర్స్ రూటులో వెళుతున్నాడు. ఆయన శశికళ కోసం రంగంలోకి దిగాడు. నేరుగా తనకు అలవాటున్న కోర్టు మెట్లెక్కి పీటీషన్ వేసేశాడు! తమ కేంద్ర ప్రభుత్వమే నియమించిన తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేత శశికళకు ఆహ్వానం పంపాలని కోర్టును కోరాడు! అసలు సుప్రీమ్ కోర్టులో అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తోన్న శశికళ సీఎంగా ఎలా పనికి వస్తుంది? పోనీ సుబ్రమణియన్ స్వామికి సదరు కేసు గురించి తెలియదా అంటే... ఆ కేసు వేసి జయలలితను, శశికళను జైల్లో పెట్టించిందే ఆయన! కాని, ఇప్పుడు మాత్రం తప్పు చేసిందని ఆయన గతంలో తిట్టిపోసిన మన్నార్ గుడి మాఫియా మహారాణి శశికళే... సీఎం అవ్వాలంటున్నాడు!

 

సుబ్బు లాజిక్ చాలా సింపుల్ అనే చెప్పాలి శశికళ విషయంలో! ఆమెకు అవసరానికి తగినంత మద్దతు ఎమ్మెల్యేల నుంచి వుంది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఆమె సీఎం అవ్వటం ఖాయం. గవర్నర్ ఎన్ని రోజులు ఆపినా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే. కాబట్టి ఆమెకు మద్దతుగా నిలిచి అందరి ముందు తాను న్యాయం వైపు వుంటానని నిరూపించుకోవటం ఆయన ఉద్దేశం. అలాగే, రేపు శశికళ సీఎంగా పీఠంపై స్థిరంగా కూర్చోగలిగితే ఆమెను కేంద్రానికి, బీజేపికి దగ్గర చేసే ఛాన్స్ కూడా ఆయనకు వుంటుంది. అంటే, తమిళ పాలిటిక్స్ లో ఢిల్లీ నుంచీ చక్రం తిప్పవచ్చన్నమాట!

 

సుబ్రమణియన్ స్వామి తిక్క, దాని వెనుక వున్న లెక్కా ఎలా వున్నా.... ఇప్పడు మాత్రం బీజేపికి ఆయన కంటిలో నలుసులా మారాడు! తమిళనాడులో బలంగా స్థిరపడాలని చూస్తూ, అందుకోసం పన్నీర్ ను తమ పాస్ పోర్ట్ గా భావిస్తున్న కమలనాథులు తమ స్వంత నేత వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతున్నారు! ఒకవైపు వెంకయ్య తమిళనాడులో సీఎం పదవి ఖాళీ లేదంటూ శశికళకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే... సుబ్బూ మాత్రం కొందరు కేంద్ర మంత్రులు చెన్నై రాజకీయాల్లో అతిగా కలగజేసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నాడు! చివరికి స్వామి సహకారం శశికి ఎంత మేర ఉపయోగపడుతుందో... చూడాలి!

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.