సంజూ విశ్వరూపం.. ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం
Publish Date:May 5, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు చేసింది. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ అజేయ అర్ధసెంచరీతో చెలరేగడంతో.. చెన్నై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులు, , ఉర్విల్ పటేల్ 17 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ చేరారు. అయితే సంజూశాంసన్, కార్తీక్ శర్మను సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ ను కుదుట పరిచారు. మొదట మెల్లిగా మొదలెట్టినా ఆ తరువాత సంజూ శాంసన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే ఏడు ఫోర్లు, అరడజను సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు చక్కిటి సహకారం అందించిన కార్మీక్ శర్మ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికేట్ కు అజేయంగా 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది.
http://www.teluguone.com/news/content/sanju-masterclass-innings-36-219032.html





