రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా మద్యం అమ్మకాల్లో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2011 ఏప్రిల్ నుంచి 2012 మార్చి వరకూ ఈ జిల్లాలో సుమారు 815 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంలో 540 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. అంటే ఈ రెండేళ్ళలో కృష్ణాజిల్లా వాసులు 1,355 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారన్నమాట. నిజానికి ఈ రేట్లన్నీ ఎం.ఆర్.పి. ధరల ప్రకారం అంచనా వేసినవే. కానీ, గత రెండేళ్ళుగా ఎం.ఆర్.పి.పై 35 నుంచి 40 శాతం ఎక్కువ రేటుకు జిల్లాలో మద్యం విక్రయించారు.
దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే మద్యం అమ్మకాలు రూ.1800 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది జనవరిలో రూ.53 కోట్ల రూపాయల విలువైన మద్యం, ఫిబ్రవరిలో రూ.57 కోట్ల రూపాయల మద్యం, మార్చిలో రూ. 76 కోట్ల విలువైన మద్యం, ఏప్రిల్ లో రూ.79 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కృష్ణాజిల్లాలో విక్రయించారు. నాలుగు సంవత్సరాల్లో జిల్లాలో ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు అయ్యింది. మద్యం అమ్మకాల్లో ఈ జిల్లా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కన్నా ఎంతో ముందు నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sales-of-liquor-in-krishna-district-increased-24-13776.html
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.