రాష్ట్రంలో హఠాత్తుగా ఇసుకకు కొరత ఏర్పడింది. ఈ కొరత ఇసుక సిండికేట్లకు వరంగా మారింది. రాష్ట్ర హైకోర్టు ఇసుకతవ్వకాలను నిలిపివేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. అయితే ఇసుక సిండికేట్లు ఈ ఇసుక నిషేధాలను తెలివిగా తమకు అనుకూలంగా ఉపయోగించు కున్నారు. హైకోర్టు ఉత్తర్వ్యుఅలు అమలులోకి రావటానికి నెలరోజుల ముందునుంచే ఈ సిండికేట్లు పెద్దఎత్తున ఇసుకను నిల్వచేసుకుని శ్యాండ్ బ్యాంక్ లు ఏర్పాటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో అనేకచోట్ల ఖాళీస్థలాల్లో ఇసుకను గుట్టలు, గుట్టలుగా నిల్వ ఉంచారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా తవ్వకాలు నిలిచిపోయాక ఇసుకసిండికేట్లు ఇసుకధారాలను హఠాత్తుగా పెంచేశారు. ప్రస్తుతం వీరు పది టైర్ల లారీ ఇసుకను రూ. 30వేల రూపాయలకు, టిప్పర్ ఇసుకను రూ. 20వేలకు, ట్రాక్టర్ ఇసుక ఆరువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. సిమ్మెంటు బస్తాలో పట్టేంత ఇసుకను రూ. 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో నిర్మాణరంగంలో ఉన్నవారు ఇసుక ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు కూడా నిలిపివేశారు. మరో నెల వరకూ ఇసుక తవ్వకాలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/insufficient-of-sand-24-13777.html
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.