అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారు. మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డికి బంధువైన దీపక్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఇలా డబ్బున్న వ్యక్తికీ టిక్కెట్టు ఇవ్వడం వల్ల అతను ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ళలా ఖర్చుపెడతాడని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించారు. అయితే దీపక్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ఖర్చు విషయంలో చాలా పొదుపు పాటిస్తుండటమే కాక చాలా నిఖచ్చిగా ఉండటం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రచారానికి వెళ్ళే పదిమంది కార్యకర్తలకు ఒక వాహనం, రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఈ డబ్బు తమ భోజనం ఖర్చులకు కూడా చాలటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఉప ఎన్నికల్లో కార్యకర్తలకు, నాయకులకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని పత్రికలకు కూడా ప్రకటనలు ఇవ్వనని దీపక్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. దీంతో నాయకులతో పాటు విలేఖరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీపక్ రెడ్డి వ్యవహారశైలిపై కొందరు నాయకులు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదులు పంపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rayadurgam-constituency-of-anantapur-district-24-13863.html
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి