తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ

Publish Date:Jul 16, 2015

Advertisement

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి తను తానే నిందించుకోవలసి ఉంటుంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఏడాదిగా రెండు రాష్ట్రాలలో తమ పార్టీని దానితో ముడిపడున్న తమ నేతల రాజకీయ భవిష్యత్ ని కూడా వారి అధిష్టాన దేవతలు పట్టించుకోలేదు. అందుకే రెండు రాష్ట్రాలలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీని విడిచి పెట్టి వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు రాహుల్ గాంధీ మేల్కొని రెండు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులని, సీనియర్ నేతలని డిల్లీకి పిలిపించుకొని పార్టీ పరిస్థితిని సమీక్షించారు.

 

రెండు రాష్ట్రాలలో పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని, సభ్యత్వనమోదు ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల నేతలని ఆయన ఆదేశించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పార్టీ నేతలు చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రగిలించిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆ అంశాలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనుకొంటున్నట్లు తన నేతలకు తెలిపారు. ఆ తరువాత పార్టీలో సీనియర్ నేతలయిన బొత్స, డి.యస్ తదితరుల నిష్క్రమణ గురించి చర్చిస్తున్నప్పుడు జానారెడ్డిని ఉద్దేశ్యించి “మీరు పార్టీలో ఉంటున్నారా లేక త్వరలోనే వెళ్ళిపోతున్నారా?” అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంటే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలుసుకోలేని పరిస్థితిలో రాహుల్ ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ ఇప్పటికయినా ఆయన చొరవ తీసుకొని పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం పార్టీ నేతలకి కూడా సంతృప్తి కలిగించింది.

 

తెలంగాణా ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ప్రజలు ఆదరించవచ్చును. కానీ అక్కడా ఆ పార్టీ గెలవలేకపోగా కనీసం అధికార తెరాస ధాటికి నిలబడి గట్టిగా పోరాటం చేసే పరిస్థితిలో లేదు. పార్టీ నేతలని తెరాసలోకి ఆకర్షిస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ “వాళ్ళు పోయినంత మాత్రాన్న పార్టీకి ఏమీ నష్టం లేదు” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవలసి వస్తోంది. ఎంతో కొంత అనుకూలతలున్న తెలంగాణాలోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలద్రొక్కుకోలేనప్పుడు ఇక నేటికీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో తన పార్టీని బలపరుచుకోవాలని రాహుల్ గాంధీ ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు.

 

ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తప్పితే చిరంజీవి అన్నట్లు తయారయింది. మిగిలిన వారందరూ ప్రజలకి మొహం చాటేసి తమతమ వ్యాపారాలు చక్క బెట్టుక్కొంటున్నారు. ఉన్న ఆ ఇద్దరిలో చిరంజీవి తన 150వ సినిమా నిర్మాణంపై కనబరుస్తున్న శ్రద్ధ పార్టీని బలోపేతం చేయడం చూపడం లేదనే మాట వాస్తవం. మరి ఇటువంటి దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఏవిధంగా రక్షించుకొంటారో చూడాలి.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.