తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు.. ఏబీవీ వ్యూహమేంటి?

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ఒక  సంచలనం.  వైసీపీ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ వేధింపులు అన్నీఇన్నీ కావు. డిప్యూటీ జనరల్ ర్యాంక్ అధికారి అయిన ఏబీవీని 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు ఎలాంటి ప్రధాన పోస్టింగ్ ఇవ్వకుండా.. తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.  ఆయనను సర్వీస్ నుండి సస్పెండ్  చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఏబీవీ సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్  , హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు.

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ పొడిగించలేరని,  2022 ఏప్రిల్ 22న దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా హైకోర్టులో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను 2024 మే 31న న్యాయస్థానం కొట్టివేసింది. ఇలా ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఏబీవీ, సహజంగానే అప్పట్లో ఎన్డీయే కూటమికి నైతిక మద్దతుగా నిలిచారు.

అయితే, ఇటీవల రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏబీవీ..   చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలను, కొన్ని పోలీస్ చర్యలను ఏబీవీ బాహాటంగా విమర్శిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.   వేదికపై  వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఏబీవీ..  ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా  అన్న సందేహాలు కూడా వెల్లువెత్తాయి. 

అయితే తాను వైపీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారానని ఏబీ వెంటటేశ్వరరావు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు.  తనకు  వ్యక్తిగత నైతిక విలువలు, మర్యాదలు ఉన్నాయన్న ఆయన.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికపై అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటను కూడా తాను వినలేదన్న ఏబీవీ..  అంబటి రాంబాబు వేదికపైకి రాగానే  తాను వేదికపై నుంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే కూర్చున్నానని వివరించిన ఏబీవీ..   వైసీపీ ప్రభుత్వం   అణచివేయాలని చూసిందని..  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే తప్పులను పునరావృతం చేయకూడదనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. దీంతో ఏబీవీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో కొన్ని పాలనాపరమైన విబేధాలు ఉండొచ్చు కానీ,  ఆయన ఆ కారణంతో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏ మాత్రం లేవనీ, ఏబీవీ కుండబద్దలు కొట్టినట్లుచెప్పినట్లైంది.  

ABV IPS, Ambati Rambabu, AP Politics, NDA Government Criticism, YCP Ecosystem

By
en-us Political News

  
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.