జగన్ గెలుపు ధీమా పట్ల వైసీపీలోనే కనిపించని విశ్వాసం.!

Publish Date:Jul 7, 2026

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదు.. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్.. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే గడిచిపోయాయి, మళ్లీ ఎన్నికలు వస్తాయి, మనమే గెలుస్తాం అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన ఈ రెండేళ్లూ దాదాపుగా కళ్లు మూసుకునే ఉన్నారు. మరో మూడేళ్లు ఇలా గడిపేస్తే.. ఎన్నికలు వస్తాయి విజయం సాధించేస్తామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెబుతున్నారు. మధ్యమధ్యలో మావిగన్ వంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మనపని మనం చేసేస్తున్నాం అని తన జబ్బలు తానే చరిచేసుకుని.. గెలుపు కలలు కంటున్నారు. అంతా బానే ఉంది కానీ తమ పార్టీ అధినేత గెలుపు ధీమా పై వైపీపీ నేతలలో కానీ, క్యాడర్ లో కానీ ఇసుమంతైనా విశ్వాసం కలగడం లేదు. 

పార్టీ అధినేత తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో విజయంపై ఆశలు వదిలేసుకోవలసిందేనన్న చర్య వైసీపీ నేతలలో జోరుగా జరుగుతోంది. మావిగన్ వంటి ప్రతిపాదనల వల్ల మరింతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.  వీటిని వేటినీ ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు కూడా.. వచ్చే ఎన్నికలలో జగన్ విజయం అంత వీజీ కాదని విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా తెలుగుదేశం కూటమి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా..  వచ్చే ఎన్నికలలో విజయం కోసం కూడావ్యూహం ప్రకారం ముందుకు సాగుతోందంటున్నారు.ఆ వ్యూహమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూటమికి మరోసారి అధికార పగ్గాలు అప్పగిస్తాయని అంటున్నారు.  అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్.. ఐదేళ్లలో ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తే తనను గెలిపిస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని చెబుతున్నారు. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సర్వే (సర్) జరుగుతోంది. తద్వారా దొంగ ఓట్లు తొలగిపోనున్నాయి  ఈ విషయంలో  వైసీపీ ఆందోళన ఆ పార్టీ గతంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించిందన్న అభిప్రాయాన్ని జనబాహుల్యంలో కలిగిస్తోంది.  అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి అజెండా   ప్రభుత్వంపై సానుకూలతకు దోహదం చేస్తున్నదనీ, రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తుండటంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం.. కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం..  పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన,  రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.

అంతే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున  పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతకు దోహదపడుతున్నాయి. 

 వీటన్నిటికీ తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయం కూటమిని మరింత బలోపేతం చేస్తున్నది.   క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. తలెత్తినా వాటిని ఎక్కడికక్కడే సద్దుమణిగించేలా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తుండటం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కలిసివస్తోంది.   ఈ నేపథ్యంలో వారాంతపు ప్రెస్ మీట్లకే పరిమితమౌతున్న జగన్ తీరు వల్ల వైసీపీకి రాజకీయంగా కోలుకోలేనంతగా నష్టం వాటిల్లుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధినేతే రాష్ట్రాలనికి వారంలో ఓసారి చుట్టపు చూపుగా వస్తూ, పార్ట్ టైమ్ పాలిటిక్స్ కు పరిమితమౌతుండటంతో వైసీపీ నేతలూ, కార్యకర్తలూ కూడా సైలెంటైపోయారని పరిశీలకులు అంటున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వైసీపీ కనిపించడం లేదని చెబుతున్నారు. 

AP Politics, NDA Alliance AP, Voter Survey AP, YSRCP Fear, Andhra Pradesh Elections

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.