Top Stories

dummy

political-news-img

కవిత బీఆర్ఎస్.. వైసీపీలో గుబులు, తెలుగుదేశం కూటమిలో జోష్!.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది. అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే. ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో.. టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ.. కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ.. ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు. ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: May 2, 2026 11:57AM

political-news-img

మాజీ ఎమ్మెల్యే కొడుకుకు షాక్ ఇచ్చిన పోలీసులు.. రాహెల్ విదేశీ ప్రయాణానికి బ్రేక్

హైదరాబాద్ నగరంలో మూడు సంవత్సరాల క్రితం నమోదైన హిట్ అండ్ రన్ కేసు మరోసారి సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహా రంలో తాజాగా నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు రాహెల్ ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌లో భాగంగా విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి లేకుండా విదేశా లకు వెళ్లకూడదనే కీలక షరతు కూడా ఉన్నది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాహెల్ మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడం కేసులో కొత్త అనుమానాలకు తావి చ్చింది. విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు. మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కేసుపై మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. విచారణలో ఇంకా ఏయే అంశాలు బయటకు వస్తాయో, కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Publish Date: May 2, 2026 11:29AM

political-news-img

పెనుగాలుల బీభత్సం.. వెయ్యి ఎకరాల్లో పంటనష్టం

మొన్నటివరకు కనీస మద్దతు ధర లేక చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేక పశువులకు వదిలేసి కుదేలు అయిన రైతన్నలు.. ఇప్పుడైనా అయినా పరిస్థితులు దారిలోకి వస్తాయి అని ఆశిస్తే.. పెనుగాలి, అకాలవర్షాలు వారి ఆశలను అడియాశలు చేశాయి. పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, ఈ.కొత్తపల్లి, కనంపల్లె, మొట్నూతల పల్లి, నల్లగొండూవారి పల్లి, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో సుమారు 520 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. అలాగే.. లింగాల మండల పరిధిలో గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచిం తలతో పాటు పలు గ్రామాల్లో 500 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బంది. ఒక్కసారిగా వీచిన రాకాసి గాలులు అరటి చెట్లను నేలకూల్చడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటను కోత దశకు తీసుకువచ్చిన రైతులకు ఈ నష్టం తేరుకోలేని విధంగా దెబ్బతీసింది. అధికారులు దెబ్బతిన్న తోటలను పరిశీలించి ప్రాథమిక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి, నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన రైతులు మాత్రం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కోరుతున్నారు. సాగులో పెట్టిన పెట్టుబడులు, అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వాపోతు న్నారు. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా గాలికి పడిపోవడం చాలా బాధాకరమనీ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆదుకోవాలి అని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Publish Date: May 2, 2026 11:22AM

political-news-img

మీకు తెలుసా.. ఇండియా మూడో అతి పెద్ద స్టార్ట‌ప్ కంట్రీ!

ఇండియా ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్... అని మీకు తెలుసా? ఉద్యోగాల‌ను వెత‌క‌డం మాత్ర‌మే కాదు.. ఉద్యోగాల సృష్టి చేస్తోంది మ‌న‌ యువత. 2026 నాటికి మ‌న వాళ్ల అత్యంత విజ‌య‌వంత‌మైన స్టార్ట‌ప్స్ ఏవ‌ని చూస్తే.. క్విక్ కామ‌ర్స్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో జెప్టో- ఆదిత్య పాలిచ‌, కైవ‌ల్య వోహ్రా త‌మ 19వ ఏట ప్రారంభించిన ఈ స్టార్ట‌ప్ ప‌ది నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివ‌రి అనే కాన్సెప్ట్ తో సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం ఇది భార‌త దేశ‌పు అతి పెద్ద క్విక్ కామ‌ర్స్ కంపెనీల్లో ఒక‌టిగా ఎదిగి ఐపీఓ దిశ‌గా దూసుకెళ్తోంది. తిల‌క్ మెహ‌తా అనే యువ‌కుడు త‌న ప‌ద‌మూడో ఏట ముంబై డ‌బ్బా వాలాల సాయంతో ప్రారంభించిన కొరియ‌ర్ స‌ర్వీస్.. పేప‌ర్స్ అండ్ పార్శిల్స్.. ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అంత‌రిక్షంలోనూ స‌త్తా చాటిన భార‌తీయ స్టార్ట‌ప్స్. స్కై రూట్ అనే సంస్థ‌ను ప‌వ‌న్ కుమార్ చంద‌న‌, భర‌త్ దాకా అనే ఇద్ద‌రు స్థాపించారు. ఈ సంస్థ ప్రైవేట్ రాకెట్ ను విజ‌య‌వంతంగా ప్రారంభించిన తొలి స్పేస్ స్టార్ట‌ప్. అలాగే.. అగ్నికుల్ కాస్మోస్ అని శ్రీనాథ్ ర‌విచంద్ర‌న్, మోయిన్ ఎస్పీఎం ప్రారంభించిన ఈ స్టార్ట‌ప్ త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ల‌ను త‌యారు చేస్తూ అంత‌ర్జాతీయ దృష్టిని ఆక‌ర్షించింది. దిగంత‌ర‌. అనిరుధ్ శ‌ర్మ‌, రాహుల్ రావ‌త్.. త‌మ విద్యార్ధి ద‌శ‌లోనే ప్రారంభించిన ఈ సంస్థ అంత‌రిక్ష వ్య‌ర్ధాల‌ను ట్రాక్ చేసే స్పేస్ గూగుల్ మ్యాప్స్ లాంటి సాంకేతిక‌త‌ను ఇంప్రూవ్ చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ విభాగంలో స‌ర్వం ఏఐ స్థాపించారు వివేక్ రాఘ‌వ‌న్. భార‌తీయ భాష‌ల కోసం ప్ర‌త్యేకంగా ఏఐ మోడ‌ళ్ల‌ను రూపొందిస్తోందీ సంస్థ‌. ఇక అనిరుధ్ మిశ్రా స్థాపించిన ఆగ‌స్ట్ ఏఐ అనే స్టార్ట‌ప్ డిజిట‌ల్ హెల్త్ కేర్ రంగంలో ఏఐ ద్వారా విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తోంది. ఓలా ఫౌండ‌ర్ అయిన భ‌విష్ అగ‌ర్వాల్ కృట్రిమ్ అనే స్టార్ట‌ప్ పెట్ట‌గా ఇది భార‌త‌దేశ‌పు సొంత ఏఐ మోడ‌ల్ ని త‌యారు చేస్తోంది. ఇక ఫిన్ టెక్ రంగానికి వ‌స్తే.. రాజోర్ పే- హ‌ర్షిల్ మాథుర్, శ‌శాంక్ కుమార్ స్థాపించిన సంస్థ ఇప్పుడు భార‌త్ డిజిట‌ల్ పేమెంట్స్ లో వెన్నుముక‌గా నిలుస్తోంది. ఫిజిక్స్ వాలా- అల‌క్ పాండే ప్రారంభించిన ఈ ఎడ్ టెక్ స్టార్ట‌ప్ త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన విద్య‌ను అందిస్తూ.. లాభాల్లో ఉన్న యూనికార్న్ గా నిలుస్తోంది. ఓయో రూమ్స్ రితీష్ అగ‌ర్వాత్ అతి చిన్న వ‌య‌స్సులోనే హోటల్ ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త విప్ల‌వం సృష్టించి ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న బ్రాండ్ విస్త‌రించారు. పైసామే ఆటో బీమా.. రేష్మిత స‌ర్వేప‌ల్లి, జ‌య‌రామ్ స‌ర్వేప‌ల్లి అనే ఇద్ద‌రు అక్కా త‌మ్ముళ్లు.. స్థాపించ‌బోయే ఈ ఇన్ స్యూరెన్స్ స్టార్ట‌ప్ ఎలాంటిదంటే.. ఒక క‌స్ట‌మ‌ర్ ఏ వ‌స్తువు కొన్నా అందులోంచి ఒక శాతం మొత్తం తీసి.. దాన్నే అత‌డి జీవిత బీమా ఖాతాలో జ‌మ చేసి.. వారి మ‌ర‌ణానంత‌రం వారి కుటుంబానికి అంద జేయాల‌నుకుంటున్నారు. స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.

Publish Date: May 2, 2026 11:02AM

political-news-img

మెబైల్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్!

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఒక ప్రత్యేక అలర్ట్ జారీ అయ్యింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ పనితీరును పరీక్షించేందుకు శనివారం (మే 2) ట్రయల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం (మే 2)అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది. ఈ డ్రిల్‌ దేశరాజధాని నగరం ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాల్లో జరుగుతుంది. అయితే సరిహద్దు ప్రాంతాలు, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఈ పరీక్షకు మినహాయింపుగా ఉంటాయని అధికారులు తెలిపారు.ఈ సందేశం కేవలం పరీక్ష కోసం మాత్రమేనని, ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలర్ట్ వచ్చినప్పుడుభయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ముఖ్య సమాచారం వేగంగా ప్రజలకు చేరేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Publish Date: May 2, 2026 10:51AM

political-news-img

ఇక ఏ దుష్టశక్తీ అమరావతిని అడ్డుకోలేదు.. బాలకృష్ణ

అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్మాణానికి ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేశారు. రాజధాని అమరావతిలో రూ.750 కోట్లతో నిర్మిస్తున్న 1000 పడకల బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా అమరావతి మహిళలు బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ అరాచక పాలనలో తాము పడిన ఇబ్బందులను మహిళలు బాలయ్యకు వివరించారు. బాలకృష్ణ స్పందిస్తూ పార్లమెంటులో చట్టం అయినందున ఇక ఏ దుష్టశక్తి అమరావతి రాజధానిని అడ్డుకోలేదని అన్నారు. మీ త్యాగాల వల్లే ఈరోజు అమరావతి రాజధాని కల సాకారమవుతుందని బాలకృష్ణ కొనియాడారు.

Publish Date: May 2, 2026 10:41AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img