political-news-img

అంబటి రాంబాబు ఇంటిముట్టడి.. తీవ్ర ఉద్రిక్తత

ఏపీ సీఎం చంద్రబాబుపై.. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి తెలుగుదేశం శ్రేణులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కాగా తాను చంద్రబాబును దూషించలేదనీ, తనను అడ్డగించి దుర్భాషలాడుతున్న వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశాననీ అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. తాను అలా మాట్లాడి ఉండకూడదని కూడా చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చి అంబటి రాంబాబు నివాసం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారును, ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ముక్కలయ్యాయి. అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇక్కడి నుండి కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు.దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తెలుగుదేశంశ్రేణులను నియంత్రించారు. మరో వైపు అంబటి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఫైర్ అయ్యారు. మంత్రి పార్థసారథి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అంబటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తక్షణమే అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Publish Date: Jan 31, 2026 5:50PM

political-news-img

కేసీఆర్ పై రాజకీయ వేధింపులు.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

తెలంగాణ మాజీ సఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 1) భారీ స్థాయిలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరి స్తున్న అప్రజాస్వామిక, రాజ కీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను రాజకీయంగా వేధిస్తోందని, ఆయనను అవమానించేలా అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు ప్రజలే తగిన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

Publish Date: Jan 31, 2026 5:37PM

political-news-img

ఈ- సైకిళ్ల పంపిణీలో చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డ్

చిత్తూరు కుప్పం న నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ ఈ-సైకిళ్ల తయారీ, పంపిణీ ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. కుప్పం నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ- మెటరాడ్ అనే సంస్థ పెద్ద ఎత్తునఈ-సైకిల్స్ తయారు చేసింది. అలా తయారు చేసిన 5555 ఈ- సైకిళ్లను ఒకే రోజు పంపిణీ చేయడం ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది దేశంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఈ-సైకిల్స్ తయారు చేసి పంపిణీ చేయలేదు. 5555 ఇ-సైకిళ్ల పంపిణీని విజయవంతంగా పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన చిత్తూరు జిల్లా అధికారుల్ని సీఎం చంద్రబాబు శనివారం (జనవరి 31) అభినందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కు అందజేశారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. కాగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ పై రావడం విశేషం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్లకు పైగా చంద్రబాబు లబ్ధిదారులతో కలిసి సైకిల్ తొక్కారు.

Publish Date: Jan 31, 2026 5:01PM

political-news-img

అక్రమ సంబంధం.. ప్రియుడి భార్య హత్య

అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని హరించిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. కేతేపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. కాగా నగేష్ మీసాల సుజాత అనే మహిళతో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాతకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం విషయం నగేష్ భార్య మమతకు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నగేష్ ను తన వద్దనే ఉండిపోవాలని సుజాత్ ఒత్తిడి చేయడం, అందుకు నగేష్ అంగీకరించకపోవడంతో గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే.. సుజాత నగేష్ ఇంటికి వెళ్లి అతడి భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో మమత అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో మమత ఒడిలో ఉన్న ఆరు నెలల పసికందుకు తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. ఆ పసికందును ఆస్పత్రికి తరలించిన పోలీసులు సుజాతను అదుపులోనికి తీసుకున్నారు. అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ సంబంధాల వల్ల కుటుం బాలు ఎలా నాశనం అవుతాయన్న విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టిందని స్థానికులు అంటున్నారు.

Publish Date: Jan 31, 2026 4:36PM

political-news-img

వాట్ టు డు?.. సిట్ నోటీసులపై ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక నేతల మంతనాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసు విషయంలో ఎలా స్పందించాలి? ఏం చేయాలి అన్న విషయంపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అగ్రనేతలు విస్తృతంగా చర్చించారు. కేసీఆర్ సిట్ ఎదుట హాజరు కావాలా? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అన్న విషయంపై ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సిట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేయాలా? లేక సిట్ పేర్కొన్న ప్రదేశానికి హాజరై విచారణకు సహకరించాలా? అనే అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నంది నగర్ నివాసంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తామనీ, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో స్టేట్మెంట్ రికార్డు చేయలేమని సిట్ అధికారులు తేల్చిచెప్పడంపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సిట్ వైఖరిని చట్టపరంగా ప్రశ్నించాలా? లేదా సమయం కోరుతూ నోటీసులకు స్పందించాలా? అనే అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. పార్టీ నేతలంతా భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సిట్ నోటీసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కోర్టును ఆశ్రయించే అవకాశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ రాజకీయంగా కీలక కేంద్రంగా మారగా, పార్టీ అగ్రనేత తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Publish Date: Jan 31, 2026 3:57PM

political-news-img

కేసీఆర్ హ్యాట్రిక్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హ్యాట్రిక్ కొట్టారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్బావం తరువాత రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వరుసగా మూడు కేసులలో నోటీసులు అందుకుని హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణలో బిఆర్ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకున్న ఈ రెండేళ్ల కాలంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు కేసులలో నోటీసులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి మూడు కేసుల విషయంలో అధికారుల నుండి నోటీసులు అందుకుని హైట్రిక్ కొట్టారనే చెప్పాలి. మొదటగా బిఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కి విాచారణకు హాజరు కావాల్సిందిగా టీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కేసీఆర్ హైకోర్టు ను ఆశ్రయించి విచారణకు హాజరు కాలేదనుకోండి అది వేరే సంగతి. ఇక రెండో నోటీసు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో కేసీఆర్ అందుకున్నారు. విచారణకు హాజరయ్యారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా ఫోన్ టాపింగ్ కేసు విచారణ నిమిత్తం కేసీఆర్ సిట్ నోటీసులు అందుకున్నారు. ఈ విధంగా కేసీఆర్ మూడు కేసుల్లో మూడు నోటీసులు అందుకుని హ్యాట్రిక్ సాధించారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.

Publish Date: Jan 31, 2026 3:38PM

News Videos

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img