రాహుల్ గాంధీ పర్యటనకి తెదేపా ప్రచారం?

Publish Date:Jul 15, 2015

Advertisement

 

ఇంతకు ముందు తెలంగాణాలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈనెల 24న ఆంధ్రాలో (అనంతపురం జిల్లాలో) పాదయాత్ర చేయడానికి వస్తున్నారు. కానీ ఆయనని ఆంధ్రాలో అడుగుపెట్టనీయమని జిల్లాకు చెందిన కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినందుకు ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, వి.హనుమంతరావు వంటి వీరవిధేయులు గట్టిగా జవాబిస్తున్నారు. ఈవాదోపవాదాల వలన రాహుల్ గాంధీకి, ఆయన పాదయత్రకి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే సంగతి తెదేపా నేతలు విస్మరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయం బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే వారు మరింత ధీటుగా తెదేపా నేతలకు బదులిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్, తెదేపా నేతల మధ్య ఎంత వాగ్వాదాలు జరిగితే అంత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలకి అర్ధమయింది. కానీ తెదేపా నేతలకి ఇంకా అర్దమయినట్లు లేదు.

 

ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చక్కగా వ్యవహరించారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గాంధీలు వస్తుంటారు వెళుతుంటారు. వారిని పట్టించుకోనవసరం లేదు,” అని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ జిల్లా పర్యటనకి తను ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. అంతే కాదు తెరాస నేతలెవరూ కూడా ఆయన పర్యటన గురించి అసలు పట్టించుకోకుండా చేసారు. దానితో కేసీఆర్ చెప్పినట్లే ‘రాహుల్ గాంధీ వచ్చేరు..వెళ్ళేరు అంతే!” అన్నట్లు చాలా చప్పగా పూర్తయింది ఆయన పాదయాత్ర.

 

కానీ ఆంధ్రాలో తెదేపా నేతలు రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఆయన పర్యటనకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఆయన పర్యటనకి వారే ఉచిత ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఆయన పర్యటనపై పడేలా చేస్తున్నారు. కానీ తెదేపా నేతలు కూడా ఆయన పాదయత్రని పట్టించుకోకుండా ఊరుకొంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా రాహుల్ గాంధీ మారధన్ రేసులో పాల్గొంటున్నట్లు హడావుడిగా జిల్లాలో పాదయాత్ర చేసినంత మాత్రాన్న జీవచ్చవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బ్రతికి బట్ట కడుతుందని ఎవరూ కూడా అత్యాశకి పోవడం లేదు.

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.