అందుకేనా తెరాస మళ్ళీ కేంద్రంతో కటీఫ్?

Publish Date:Jul 17, 2015

Advertisement

 

ఆ మధ్యన కేసీఆర్ కుమార్తె (నిజామాబాద్ యంపీ) కవిత ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొని తమ పార్టీ మోడీ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలుగుతోందనే సంకేతాలు పంపారు. అంతకు ముందు “మోడీలేదు...గీడీలేదు...” అని అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని హడావుడిగా మొదలుపెట్టేసారు. తన కుమార్తె కవితకు కేంద్రమంత్రిగా చేసేందుకే ఆయన తన వైఖరి మార్చుకొన్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి ఆరోపణలు కేవలం ఊహాగానాలని మొదట కొట్టిపారేసిన కవిత, మళ్ళీ కొన్ని రోజుల తరువాత “మోడీ ఆహ్వానిస్తే కేంద్రంలో మంత్రిగా చేరేందుకు తాను సిద్దమే”నని ప్రకటించడంతో వారి ఆరోపణలు, అనుమానాలు నిజమేనని ద్రువీకరించినట్లయింది.

 

మోడీ ప్రభుత్వం నేటికీ నిలకడగానే వ్యవహరిస్తోంది కానీ తెరాస నేతల వైఖరి మాత్రం మళ్ళీ అకస్మాత్తుగా మారిపోయింది. బహుశః కవితకు కేంద్రమంత్రి మంత్రి ఇవ్వకపోవడం వలననే వారు తమ వైఖరి మార్చుకొన్నారేమో తెలియదు కానీ, ఇంతకు ముందు మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొన్న కవిత కూడా ఇప్పుడు ఆయనపై నిప్పులు కక్కుతున్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలంగాణా పట్ల వ్యతిరేకత, సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని కానీ ఆంధ్రా పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఏడాది గడిచినా ఇంకా హైకోర్టు విభజించకపోవడం, పుష్కరాలలో తెలంగాణా కంటే ఆంధ్రాకు ఎక్కువగా నిధులు కేటాయించడం, తమ అనుమతి తీసుకోకుండా బేగంపేట విమానాశ్రయాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని నిర్ణయించుకోవడం వంటి అనేక కారణాలు ఆమె చూపుతున్నారు. ఆమె కేంద్రంపై నేరుగా విరుచుకుపడటంచూస్తే, బహుశః అందుకే మొన్న డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దుమ్మ కొట్టి ఉంటారని అనుమానించవలసి వస్తుంది.

 

కానీ హైకోర్టు విభజనలో ఉన్న న్యాయపరమయిన అంశాల గురించి తెలిసి కూడా ఆమె కేంద్రాన్ని తప్పుపట్టడం అనుచితమేనని చెప్పకతప్పదు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నిర్మించుకొనే వరకు హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్న రాజధాని అమరావతి నగరంలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. రాజధాని నిర్మాణం మొదలయ్యి అందులో హైకోర్టుకి శాశ్విత భవనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ కల్పించే వరకు ఉమ్మడికోర్టు కొనసాగక తప్పదని స్వయంగా హైకోర్టు ధర్మాసనమే స్పష్టం చేసింది. అంతవరకు ఎవరూ ఆందోళనలు చేయడానికి వీలులేదని, చేస్తే చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించింది.

 

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక అవరోధం గమనించిన తరువాతనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయింది. లేకుంటే మూడు నెలల్లోనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయశాఖామంత్రి సదానంద గౌడ ఇదివరకే ప్రకటించారు. ఇవన్నీ తెరాస ఎంపీ కవితకు తెలియవని భావించలేము. కానీ తెలియనట్లు ఆమె మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంటే ఆమె అక్కసుకి వేరే ఇతర కారణాలున్నాయని అనుమానించవలసి వస్తుంది. ఆమెకు కేంద్రమంత్రి ఇవ్వకపోవడం, ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8 అమలు తదితర అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం చెంది ఉండటం అందుకు ప్రధాన కారణాలు కావచ్చును.

 

కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కూడా కాని తెరాస, కేంద్రమంత్రి పదవిని ఏవిధంగా ఆశిస్తోందో తెలియదు. ఒకవేళ ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకొంటే అందులో మొట్టమొదట తన పార్టీకి చెందిన నేతలకు, ఆ తరువాత ఎన్డీయే కూటమిలో భాగస్వామి పక్షాలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చుకొంటారే కానీ తెరాసని, కేసేఆర్ ని మంచి చేసుకోవడానికి కవితకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని అనుకోవడం అత్యాశే. అయినా మోడీతో సెల్ఫీలు తీసుకొన్నంత మాత్రాన్న కేంద్రమంత్రి పదవి ఆశించేయడమేనా? కొన్ని రోజులు కేంద్రంతో సన్నిహితంగా మెలగడం, మళ్ళీ మరికొన్నాళ్ళు కత్తులు దూస్తూ తెరాస ప్రభుత్వం నిలకడలేని వ్యవహారశైలి ప్రదర్శిస్తోంది. దాని వలన తెలంగాణా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కేంద్రంపై ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.