పుట్టపర్తిపై కన్నేసిన ఆ ముగ్గురు బాబాలు ఎవరు?
Publish Date:May 16, 2012
Advertisement
సత్యసాయిబాబా భౌతికంగా దూరమైన తరువాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వెలవెలబోతోంది. బాబా మహాభినిశ్రమణ అనంతరం పుట్టపర్తికి భక్తుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వ్యాపారలావాదేవీలు స్తంభించిపోయాయి. వందలాది మంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఏర్పడింది. కొంతమంది వ్యాపారులైతే తమ సంస్థలను మూసేసి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. పుట్టపర్తి తనవైభావాన్ని కోల్పోతుండటంతో ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో పాగా వేయటానికి ముగ్గురు బాబాలు ప్రయత్నిస్తున్నారు. ఈ బాబాల ప్రయత్నాలకు స్థానిక వ్యాపార్య్లతో పాటు ఆశ్రమ నిర్వాహకుల్లో కొందరు కూడా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తిపై కన్నేసిన బాబాలలో ఇద్దరు కర్నాటకకు చెందిన వారు. వారిలో అనంతపురం జిల్లావాసులకు అంతో ఇంతో పరిచయమున్న చిక్ బళ్ళాపూర్ కు చెందిన శివసాయిబాబా ఒకరు. సత్యసాయి శివైక్యం అయిన సమయంలో అక్కడ ప్రత్యక్షమై తామే ఆయన వారసుడనని ప్రకటించుకున్నారు. శివసాయి స్థానిక బిల్డర్లు, రాజకీయనాయకుల సహాయ సహకారాలతో పుట్టపర్తిలో ఒక పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని, మరో పెద్ద ఆశ్రమాన్ని నిర్మించబోతున్నారు. పుట్టపర్తిపై కన్నువేసిన బాబాల్లో మరొకరు అఘోరాబాబా. కర్ణాటకకు చెందిన ఈయన పుట్టపర్తికి 20 కిలోమీటర్ల దూరంలో అఘోరాబాబా సంస్థాన్ పేరిట సుమారు 50 ఎకరాల్లో ఆశ్రమం నిర్మిస్తున్నారు. పుట్టపర్తిలో పాగావేసేందుకు తహతహలాడుతున్న మరో బాబా మన రాష్ట్రానికి చెందిన రంగాసాయిబాబా, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో రంగాసాయిబాబాకు భక్తులున్నారు. రంగాసాయిబాబా పుట్టపర్తిలో ఆశ్రమం ఏర్పాటు చెయాలని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఆహ్వానించారు. బాబా ఏర్పాటు చేసే ఆశ్రమానికి భూములు కేటాయిస్తామన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు బాబాల ప్రయత్నాలు సఫలమైతే పుట్టపర్తి మరోసారి భక్తులతో కళకళలాడే అవకాశం ఉంటుంది.
http://www.teluguone.com/news/content/puttaparti-sai-baba-demise-24-14070.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





