పుట్టపర్తిపై కన్నేసిన ఆ ముగ్గురు బాబాలు ఎవరు?

Publish Date:May 16, 2012

Advertisement

సత్యసాయిబాబా భౌతికంగా దూరమైన తరువాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వెలవెలబోతోంది. బాబా మహాభినిశ్రమణ అనంతరం పుట్టపర్తికి భక్తుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వ్యాపారలావాదేవీలు స్తంభించిపోయాయి. వందలాది మంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఏర్పడింది. కొంతమంది వ్యాపారులైతే తమ సంస్థలను మూసేసి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. పుట్టపర్తి తనవైభావాన్ని కోల్పోతుండటంతో ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో పాగా వేయటానికి ముగ్గురు బాబాలు ప్రయత్నిస్తున్నారు. ఈ బాబాల ప్రయత్నాలకు స్థానిక వ్యాపార్య్లతో పాటు ఆశ్రమ నిర్వాహకుల్లో కొందరు కూడా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

 

పుట్టపర్తిపై కన్నేసిన బాబాలలో ఇద్దరు కర్నాటకకు చెందిన వారు. వారిలో అనంతపురం జిల్లావాసులకు అంతో ఇంతో పరిచయమున్న చిక్ బళ్ళాపూర్ కు చెందిన శివసాయిబాబా ఒకరు. సత్యసాయి శివైక్యం అయిన సమయంలో అక్కడ ప్రత్యక్షమై తామే ఆయన వారసుడనని ప్రకటించుకున్నారు. శివసాయి స్థానిక బిల్డర్లు, రాజకీయనాయకుల సహాయ సహకారాలతో పుట్టపర్తిలో ఒక పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని, మరో పెద్ద ఆశ్రమాన్ని నిర్మించబోతున్నారు.

 

పుట్టపర్తిపై కన్నువేసిన బాబాల్లో మరొకరు అఘోరాబాబా. కర్ణాటకకు చెందిన ఈయన పుట్టపర్తికి 20 కిలోమీటర్ల దూరంలో అఘోరాబాబా సంస్థాన్ పేరిట సుమారు 50 ఎకరాల్లో ఆశ్రమం నిర్మిస్తున్నారు. పుట్టపర్తిలో పాగావేసేందుకు తహతహలాడుతున్న మరో బాబా మన రాష్ట్రానికి చెందిన రంగాసాయిబాబా, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో రంగాసాయిబాబాకు భక్తులున్నారు. రంగాసాయిబాబా పుట్టపర్తిలో ఆశ్రమం ఏర్పాటు చెయాలని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఆహ్వానించారు. బాబా ఏర్పాటు చేసే ఆశ్రమానికి భూములు కేటాయిస్తామన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు బాబాల ప్రయత్నాలు సఫలమైతే పుట్టపర్తి మరోసారి భక్తులతో కళకళలాడే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.