వైసీపీ, టీడీపీలకు పవన్ స్ట్రోక్..!

Publish Date:Aug 16, 2017

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా చోటా మోటా నేతల నుంచి ఛరిష్మా ఉన్న నేతలను ప్రచారంలో దించాయి ఇరు పక్షాలు. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో జయాపజయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న బలిజ సామాజిక వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి సామ, ధాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ కీలకంగా మారారు. దీంతో ఆయన మద్ధతు పొందేందుకు ఎవరికి వారు రాయబారాలు నడుపుతున్నారు.

 

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేసి వారి విజయానికి పవన్ కారణమయ్యారని చాలా మంది బాహాటంగానే చెబుతారు. మిత్రపక్షంగా ఉన్న కారణంగా జనసేనాని మద్దతు తమకేనని టీడీపీ నేతలు భావిస్తూ వచ్చారు. అలాగే భూమా కుటుంబం ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డితో కలిసి పనిచేశారు పవన్. ఆ రకంగా భూమా ఫ్యామిలీతో పవర్‌స్టార్‌కు మంచి అనుబంధమే ఉంది. పైగా ఉద్దానం కిడ్నీ బాధితులు, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సున్నితంగా విమర్శించారే తప్ప మిత్రపక్షం నుంచి బయటకు రాలేదు. అంతేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి తొలిసారి హాజరైన పవన్..చంద్రబాబుతో ముచ్చటించడం..ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్న సైకిల్ పార్టీ నేతలు పవన్ తమవైపే ఉంటారని భావించారు.

 

అయితే చంద్రబాబు వ్యవహారశైలి పవన్‌కు నచ్చడం లేదని..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం విమర్శించారన్న కోపం జనసేనానిలో ఉందని అందువల్ల ఆయన ఈసారి తమకే మద్దతు ప్రకటిస్తారని భావించింది వైసీపీ అధినాయకత్వం. అలా ఎవరికి వారు..తమ లెక్కల్లో తాము ఉండగానే అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు జనసేన అధినేత. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని ప్రకటించారు. తాను గానీ, జనసేన పార్టీగానీ ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు 2019 వరకు ఎలాంటి ఉప ఎన్నిక వచ్చినా ఇదే విధానాన్ని అనుసరిస్తామన్నారు పవన్.

 

క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం గానీ...ఏ పార్టీకి గానీ..ఏ అభ్యర్థికి గానీ మద్దతు ఇచ్చేది ఉండదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల నేతలకు వర్షాకాలంలో కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. పవన్‌ను ప్రచారంలోకి తీసుకురావడానికి మంత్రి భూమా అఖిలప్రియ చివరి క్షణం వరకు ఎంతో ప్రయత్నించారు. కానీ కాటమరాయుడు ఇలా ఊహించని షాక్ ఇచ్చేసరికి అఖిల ప్రియ కాస్త నిరాశకు లోనయ్యారట. ఆవిడ ఒక్కరే కాదు ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల పరిస్థితి అలాగే ఉందట. మరి పవన్ ఈ తటస్థ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో..ఆయనకే తెలియాలి.

By
en-us Political News

  
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.