ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు త్వరలో సరికొత్త ఆర్.టీ.ఓ. విధానాలు

Publish Date:Aug 19, 2014

Advertisement

 

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి నిన్న పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్.టీ.ఓ. వ్యవస్థను, విధానాలను సమూలంగా మార్చవలసిన తరుణం ఆసన్నమయింది. అందుకోసం మా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కొత్త చట్టాలను సిద్దం చేస్తోంది. అవి ఇప్పుడున్న విధానాల కంటే చాల మెరుగైనవి, సమర్ధనీయమైనవి. వాటిని త్వరలోనే అమలులోకి తీసుకు వస్తాము. ప్రస్తుత వ్యవస్థలో, విధానాలలో అంతటా అవినీతి, డబ్బు రాజ్యం ఏలుతోంది. దానికి ఆస్కారం లేకుండా అత్యాధునిక వ్యవస్థను, విధానాలను అమలులోకి తీసుకువస్తాము. లండన్ వంటి నగరాలలో అనుసరిస్తున్న అత్యాధుని ట్రాఫిక్ విధానాలను మనదేశంలో కూడా అమలు చేసేందుకు వీలుగా చట్టాలను రూపొందిస్తున్నాము. అవి అమలయితే ఇక ఆర్.టీ.ఓ. వ్యవస్థలో అవినీతికి తావు ఉండదు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు చట్టం దృష్టి నుండి తప్పించుకోలేరు. ఎవరయినా ఎక్కడయినా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సదరు వాహనదారు ఇంటికే నేరుగా జరిమానా నోటీసు చేరిపోతుంది. దానిని కోర్టులో సవాలు చేసేందుకు సాహసితే మూడు రెట్లు జరిమానా వసూలు చేయబడుతుంది,” అని అన్నారు.

 

సాధారణంగా ప్రభుత్వం కొత్త సౌకర్యాలు లేదా తమకు లబ్ది చేకూరే పధకాలు ప్రేవేశ పెడుతుందని ప్రజలు ఆశిస్తుంటారు. కానీ ఈవిధంగా కొత్త విధానాల ద్వారా తమ జేబులకు చిల్లులు పెట్టాలని ఎవరూ కోరుకోరు. భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం పెద్ద వింత కాదు. కొత్త విషయము కాదు. కానీ అందుకు ప్రధాన కారణం నానాటికి పెరిగిపోతున్న జనాభా మరియు ట్రాఫిక్ రద్దీ. నేటికీ మహానగరాలలో సైతం గోతులు పడిన రోడ్లు, రోడ్ల మీద పారే మురుగు నీరు, ఇరుకు సందులు, వాటిలో విచ్చల విడిగా తిరిగే పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు కనబడుతూనే ఉంటాయి.

 

కానీ ఇంతవరకు పరిపాలించిన ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా రోడ్లు నిర్మించడం, రోడ్లు వెడల్పు చేయడం, ఫ్లై ఓవర్లు కట్టించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బస్సులు, మెట్రో రైళ్ళను ఏర్పాటు చేయడం, నదులు, కాలవలు పారే ప్రాంతాలలో కొత్తగా జల రవాణా వ్యవస్థలను ఏర్పాటుకు గట్టిగా కృషి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం ప్రస్తుతం ఉన్న రోడ్లను, వ్యవస్థలలో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నాలు చేయలేదు. అందువలననే నిత్యం రోడ్డు ప్రమాదాలలో వందలాది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. కానీ ప్రభుత్వాలు ఎన్నడూ మేల్కొనలేదు. రోడ్డు ప్రయాణికులకు సరయిన సౌకర్యాలు, తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయినా, నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు, ఆర్.టీ.ఓ. అధికారులు వారిని నిత్యం దోచుకొంటూనే ఉన్నారు.

 

ఇప్పడు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఏమి చేయాలో ఆలోచించకుండా, ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్న ఆ ఆ.ర్టీ.ఓ. వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. మోడీ ప్రభుత్వంపై ప్రజలలో చాలా ఆశలున్నాయి. అందుకే ఆయన ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నెల రోజుల్లోనే రైల్వే చార్జీలు భారీగా పెంచినప్పటికీ, ప్రజలు ఆయనపై నమ్మకంతో సర్దిచెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రవాణాశాఖా మంత్రిగారు ప్రజల ముక్కు పిండి డబ్బు వసూలు చేసేందుకు చట్టాలు సవరిస్తామని చెప్పడం చూస్తే ఇకపై ప్రజలు జేబు నిండా డబ్బుంటే తప్ప రోడ్లమీద తిరిగే సాహసం చేయకూడదని అర్ధమవుతోంది. ఆవిధంగానయినా దేశంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి, రోడ్డు ప్రమాదాలు అరికడదామని మంత్రిగారు భావిస్తున్నారేమో!

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.