పీఎస్‌లో తన సిబ్బందిపై దాడి యత్నం.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..!

Publish Date:Sep 15, 2026

Advertisement

తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో తన సిబ్బందిపై దాడికి యత్నించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. ప్రభుత్వ వ్యవస్థలు గూండాగిరికి అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలే దాడులకు, అరాచకానికి మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో అరాచక త్వం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.తాజా ఘటనను కూడా ఇదే రాజకీయ పరిణా మాల కొనసాగింపుగా పేర్కొంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అను కూలంగా వ్యవహరిస్తోం దని ఆరోపించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామా లపై రాహుల్ గాంధీ స్పందించాలంటూ ప్రశ్నించారు.“వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ” అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణా మాలు ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన తన ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బీఆర్‌ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ.. అసెంబ్లీ ప్రాంగణంలో అమలవుతున్న నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.

 

 

 

[ KTR PA, Saifabad Police, Telangana Assembly Protest, KTR PRO, Hyderabad News, BRS Party News, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V.Anand, Telangana police ]

By
en-us Political News

  
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.