ఇన్నాళ్లూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీకి కోల్కతా నైట్రైడర్స్ షాకిచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీని కూడా అలవోకగా ఓడించిన నైట్రైడర్స్ ఐపీఎల్-5 లో వరుసగా ఆరో విజయం సాధించింది. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే నెగ్గింది. ఓపెనర్లు మెకల్లమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు), గంభీర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్కు 68 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. గంభీర్ జోరుతో కోల్కతా పవర్ప్లే ఆరు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సాధించడం విశేషం. గంభీర్ అవుటయ్యాక... కలిస్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెకల్లమ్కు అండగా నిలబడ్డాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్), వార్నర్ (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఆరంభాన్నిచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. జయవర్ధనే (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/knight-riders-delhi-daredevils-24-13904.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!