జగన్ బాధకు అద్దం పట్టిన కధనం

Publish Date:Sep 20, 2014

Advertisement

 

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో చాలా ఆసక్తికరమయిన కధనం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నెహ్రు-గాంధీ వంశ పారంపర్యపాలన కొనసాగించేందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అధిష్టానానికి అత్యంత విధేయులైన వారిని, కొన్నిసార్లు అసమర్ధులను ముఖ్యమంత్రులుగా నియమిస్తోందని చెపుతూ అందుకు కొన్ని ఉదాహరణలు పేర్కొంది. ఆ తరువాత మెల్లగా కధనాన్ని ఆంద్రప్రదేశ్ వైపు మళ్ళించి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగి ఎవరూ ఊహించని విధంగా 2009ఎన్నికలలో విజయం సాధించిపెట్టేరో వివరించబడింది. ఆయన హటాన్మరణం తరువాత శాసన సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరినప్పటికీ, ఆయనకు అధికారం కట్టబెడితే ఎక్కడ తన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం మొదట అసమర్దుడయిన రోశయ్యకు ఆ తరువాత ఎటువంటి అనుభవమూ లేని కిరణ్ కుమార్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అందువలన ముఖ్యమంత్రి కావాలనుకొన్న జగన్మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే అనేకమంది శాసనసభ్యులు ఆయనే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసారు. అతని వంటి బలమయిన నేత ముఖ్యమంత్రి కాలేకపోవడం చేత రాష్ట్రం బలహీనపడింది. ఈవిధంగా రాష్ట్రాలను బలహీనపరిచి వాటిని సామంత రాజ్యాలుగా మలిచే ప్రయత్నం సమాఖ్య స్పూర్తికి ప్రమాదకరం అంటూ కధనం ముగించారు. ఈ కధనం ఏ పత్రికలో వచ్చి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.

 

ఇక అసలు విషయంలోకి వస్తే ఇక్కడ ప్రస్తావించని అంశాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రు వంశపారంపర్య పాలన కొనసాగించడానికే ఇదంతా అని చెపుతున్నపుడు, ఇక్కడ రాష్ట్రంలో వైయస్స్ కుటుంబపాలన సాగడం చాలా అవసరమని ఏవిధంగా సమర్ధించుకొంటారు? నేటికీ వైకాపాలో వైయస్స్ భార్య విజయమ్మ, ఆయన కుమారుడు జగన్, ఆయన కుమార్తె షర్మిల ముగ్గురూ ప్రధాన పాత్ర పోషిస్తున్నపుడు కాంగ్రెస్ పార్టీలో వంశ పారంపర్య పాలనను వేలెత్తి చూపడం ఎందుకు? ఇక సుదీర్గ రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న రోశయ్య, తీవ్ర అల్లకల్లోల పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మూడేళ్ళు పాలించిన కిరణ్ కుమార్ రెడ్డిల కంటే జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సమర్ధుడు? వారిరువురితో పోలిస్తే అతనికి ఎటువంటి అనుభవమూ లేదు కదా? అయినప్పటికీ వారు అసమర్ధులు, తను సమర్ధుడని ఏవిధంగా సమర్ధించుకొంటున్నారు?

 

రోశయ్య ముఖ్యమంత్రిగా రాణించలేకపోయి ఉండవచ్చును. కానీ ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయం వరకు కూడా గొప్ప ఆర్ధిక మంత్రిగా పేరు గడించిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా ఉదృతంగా సాగిన తెలంగాణా ఉద్యమాలు, ఆ తరువాత రాష్ట్ర విభజన, సమైక్యాంద్ర ఉద్యమాలు ఒకదాని తరువాత మరొకటి వరుసగా తరుముకొచ్చినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి తన సత్తా చాటుకొన్నారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయన మాట విని ఉండి ఉంటే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారేమో కూడా. కానీ అలా జరగకపోవడంతో, ఆయనకు, పార్టీకి తీరని నష్టం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారిరువురి కంటే తను సమర్ధుడని భావిస్తున్నారు?

 

ఇక తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే అది సమైక్య స్పూర్తికి విరుద్దం అని నేర్పుగా కలరింగ్ ఇవ్వడం కూడా హాస్యాస్పదం. నిజమే! కాంగ్రెస్ అధిష్టానం తనకు అత్యంత విధేయులు, నమ్మకస్తులనే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా నియమించుకొని వారిపై కర్ర పెత్తనం చేసింది. వైకాపాలోనే ఆయన నియంతృత్వ పోకడలు భరించలేక అనేకమంది సీనియర్లు ఆయనకు, పార్టీకి దణ్ణం పెట్టి బయటకు వెళ్ళిపోయిన సంగతి పెద్ద రహస్యం ఏమీ కాదు. అటువంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఎంచడం ఎందుకు?

 

జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత సమర్ధుడు రాజకీయ దురంధుడు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎందుకు విజయం సాధించి ముఖ్యమంత్రి కాలేకపోయారు? తన అతివిశ్వాసమే కొంప ముంచిందని ఒకవైపు అంగీకరిస్తూనే మళ్ళీ చంద్రబాబును ఎందుకు నిందిస్తున్నట్లు? ఇలా ప్రశ్నించుకొంటూపోతే జవాబు దొరకని ప్రశ్నలు చాలానే వస్తాయి. అయితే అంతిమంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ కధనం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై ఎంత ఆరాటం ఉందో ఇది మరోసారి బయటపెట్టింది.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.