జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర

Publish Date:May 15, 2012

Advertisement

హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యక్తిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై దుమారం రేగుతోంది. సాక్షాత్తూ సాక్షి దినపత్రిక ప్రారంభంలోనే తాను క్రైస్తవుడనని జగన్ ప్రకటించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అది క్రైస్తవ సంఘాలను కూడగట్టుకునేందుకని అప్పట్లో భావించారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని సాంప్రదాయాలను ఆయన వ్యతిరేకిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని విశ్వహిందూ పరిషత్తు జాతీయ సమావేశంలో నాయకులు సంచలన వ్యాఖ్యలను చేసిన విషయము తెలిసినదే. అయితే ఇటీవల తిరుపతిలో పర్యటించినప్పుడు జగన్ తిరుమలలో పుస్తకంలో సంతకం చేయకుండా హిందువుల మనస్సు గాయపరిచారని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన జగన్ కు జన (ప్రత్యేకించి హిందువుల) ఆదరణ కరువయిందంటున్నారు.

 

ఇలా హిందువులను వ్యతిరేకిస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్ కు ఎందుకు ఓటెయ్యలో ఆలోచించాలని లింగారెడ్డి కోరుతున్నారు. ఈయన ప్రకటనతో విశ్వహిందూపరిషత్తు బిజెపి కూడా ఎకీభవిస్తున్నాయి. ఇలా జగన్ పై హిందూవ్యతిరేకి అన్న ముద్రస్థిరపడే అవకాశాలు పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక్క చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ ఆరోపణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఉధృతమైతే జగన్ కి హిందువుల సహకారం అనుమానమే అని రాజకీయపరిశీలకులు తేల్చి చెబుతున్నారు. తన వైఖరిలో మార్పు వస్తే తప్ప జగన్ కు వేరే దారిలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒక్క జగన్ తప్పించి ఆయన పార్టీని మోస్తున్న వారందరూ హిందువులే అన్న విషయాన్ని వైకాపా (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) గుర్తుంచుకోవాలని హితవు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.