జగన్ ఆర్ధిక లావాదేవీల స్తంభనపై భిన్నవాదాలు ?
Publish Date:May 12, 2012
Advertisement
సిబీఐ అధికారులు సాక్షి దినపత్రిక ఆర్ధిక లావాదేవీలను స్తంభింప చేయడంపట్ల బిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సాక్షి అకౌంట్లను స్తంభింపచేయడం అంటే పత్రికా స్వేచ్చపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించిన జగన్ వ్యాఖ్యలను మెజారిటీ వ్యక్తులు ఖండిస్తున్నారు. ఒక పత్రికా సంపాదకునిపై లేదా పత్రికలో పనిచేసే ఇతర పాత్రికేయ సిబ్బందిపై భౌతికంగా లేదా మానసికంగా దాడిచేస్తే తప్పు అవుతుంది. లేదా పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తలపై, వ్యాసాలపై ఆంక్షలు విధిస్తే అది పత్రికా స్వేచ్చను నివారించినట్లు అవుతుంది. దొంగలించిన డబ్బు దుర్వినియోగం కాకుండా తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి బ్యాంక్ ఖాతాలను నిలిపివేస్తే తప్పు ఎలా అవుతుంది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పత్రికకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నిలిపివేయడం అంటే పరోక్షంగా పత్రిక ప్రచురణకాకుండా చూడటం, దాని ద్వారా పాత్రికేయుల ఉపాధిని దెబ్బతీయడమే అవుతుందనే వాదనలనూ కొందరు చేస్తున్నారు. పత్రిక బ్యాంక్ అకౌంట్ ను నిలిపివేసినా కొత్త అకౌంట్ ప్రారంభించడం ద్వారా పత్రిక కార్యకలాపాలను కొనసాగించుకావచ్చునని సిబీఐ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా సాక్షి బ్యాంగ్ అకౌంట్ల నిలిపివేతతో పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి? పత్రికా స్వేచ్ఛ పేరుతొ పెద్దమనుషులు ఏ విధంగా లబ్ది పొందాలనే ఆలోచనతో వున్నారో సామాన్యులకు కూడా అర్థం అవుతోంది.
http://www.teluguone.com/news/content/freezing-of-accounts-24-13970.html





