ఫ్యాటీ లివర్.. ఒక నిశ్శబ్ద మహమ్మారి

Publish Date:Apr 15, 2026

Advertisement

శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి కాలేయంపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆర్టిఫిషియల్ సుగర్ ఎక్కువగా ఉండే పానీయాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం వల్ల అవి  నేరుగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి. దీనికి తోడు నిద్రలేమి, అధిక బరువు వంటి సమస్యలు కూడా తోడవడంతో కాలేయం తన సహజ సామర్థ్యాన్ని కోల్పోతోంది. ఈ వ్యాధిలోని అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ప్రారంభ దశలో రోగికి ఎటువంటి శారీరక అసౌకర్యం లేదా నొప్పి తెలియదు. వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడటంతో చికిత్స క్లిష్టతరంగా మారుతోంది.

మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, గతంలో 40-50 ఏళ్ల వయసు వారిలో కనిపించే ఈ సమస్య, ఇప్పుడు 20 నుండి 35 ఏళ్ల యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయస్సులోనే కాలేయ సమస్యల బారిన పడటం వల్ల వారి ఉత్పాదకత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అయితే కాలేయ వ్యాధులు ప్రారంభంలోనే గుర్తిస్తే  90 శాతం వరకు తిరిగి నయం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఖరీదైన మందుల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలే ప్రధానమైన పరిష్కారం. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయాన్ని మళ్లీ ఆరోగ్య స్థితికి తీసుకురావచ్చు. తెల్ల బియ్యం, బేకరీ వస్తువులకు బదులుగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు,   తగినంత ప్రోటీన్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక శ్రమ కాలేయానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా, సైక్లింగ్ ,  స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. కేవలం 5 నుండి 10 శాతం బరువు తగ్గగలిగితే, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులో 50 శాతం వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

అలాగే  రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం వల్ల  శరీరంలోని మలినాలు బయటకు పోయి, కాలేయం శుద్ధి అవుతుంది.  అలాగే కంటినిండా నిద్ర కూడా కాలేయ ఆరోగ్యానికి మంచిది. రోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర కాలేయ కణజాలం పునరుద్ధరణకు ఎంతగానో సహకరిస్తుంది. భవిష్యత్తులో కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన పరిస్థితులను నివారించాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ముఖ్యంగా మధుమేహం, పీసీఓఎస్ , మరియు పొట్ట దగ్గర అధికంగా కొవ్వు ఉన్నవారు ఏడాదికి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం మంచిది. మద్యపానానికి దూరంగా ఉండటం కాలేయ ఆరోగ్యానికి అత్యంత కీలకం. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలేయ ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

-సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.