ఉమేష్ కుమార్ కి అంతా పెట్రోలై మండుతోంది!

Publish Date:Aug 31, 2012

Advertisement

సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సస్పెన్షన్ ఉత్తర్వుల్ని కేంద్ర హోంశాఖ కొట్టేసింది. రాష్ట్రానికి కొత్త డిజిపిగా ఆయన నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు కోడైకూస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం డిజిపి పదవి న్యాయంగా ఉమేష్ కుమార్ కే దక్కాలి. కానీ.. గతంలో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని తోసిరాజని దినేష్ రెడ్డిని డిజిపిగా నియమించింది.

కడుపుమంటపట్టలేకపోయిన ఉమేష్ కుమార్ దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ ఎంపీ లెటర్ హెడ్ మీద లేనిపోని కంప్లైంట్లు చేస్తూ కేంద్రానికి లేఖరాసి ఫోర్జరీ సంతకం చేశారంటూ అప్పట్లోపెద్ద గొడవకూడా జరిగింది. దీనిపై విచారణ జరిపిన సిఐడి అధికారులు ఉమేష్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన ఎవరికీ చెప్పకుండా చాకచక్యంగా ఉడాయించారని లోకల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది.

చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యారన్న నెపంతో ఉమేష్ కుమార్ మీద జూన్ నెలలో రాష్ట్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేస్తే 90 రోజుల్లోగా ఆ విషయాన్ని కేంద్ర హోం శాఖకి నివేదించాలి. సస్పెన్షన్ కొనసాగించాలా లేక ఎత్తేయాలా అన్న నిర్ణయం కేంద్రం హోంశాఖ చేతుల్లోనే ఉంటుంది. ఉమేష్ కుమార్ సెలవుకోసం దరఖాస్తు పెట్టుకున్నారు కనుక చెప్పాపెట్టకుండా గైర్హాజరైనట్టు భావించడానికి ఆస్కారమే లేదంటూ కేంద్ర హోం శాఖ సస్పెన్షన్ ని ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఉమేష్ కి కాలం కలిసొస్తోంది. కారుమేఘాలన్నీ ఒక్కటొక్కటిగా విడిపోతున్నాయి. 1977కి  చెందిన దినేష్ రెడ్డి బ్యాచ్ లో ఉమేష్ కుమార్ తప్ప మిగతావాళ్లంతా రిటైరైపోయారు. డిజిపి నియామకానికి సంబంధించి మరో కొత్త జాబితాని తయారుచేసి పంపాలని యూపీఎస్సీ ఆదేశించిన సమయంలో ఉమేష్ కుమార్ పై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ ని ఏత్తేయడం కీలక పరిణామం.

 

By
en-us Political News

  
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.